E-Paper
Advertisement

MS Dhoni: టీమిండియా ప్లేయ‌ర్ల‌కు ధోని ధావ‌త్‌…నేను రానంటూ ఇంటికి వెళ్లిపోయిన గంభీర్‌ !

MS Dhoni: టీమిండియా ప్లేయ‌ర్ల‌కు ధోని ధావ‌త్‌…నేను రానంటూ ఇంటికి వెళ్లిపోయిన గంభీర్‌ !
Advertisement

MS Dhoni: టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా ( IND VS SA) మధ్య నవంబర్ 30వ తేదీ నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ రెండు జట్ల మధ్య మొత్తం 3 వన్డేలు జరగనున్నాయి. అయితే మొట్ట మొదటి వన్డే సిరీస్, జార్ఖండ్ రాజధాని రాంచిలో ఉన్న JSCA ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్ లో ( JSCA International Stadium Complex, Ranchi )
జరగనుంది. ఈ మేరకు టీమిండియా ప్లేయర్లు రాంచికి చేరుకున్నారు. ఇందులో విరాట్ కోహ్లీ తో పాటు రోహిత్ శర్మ కూడా ఉన్నారు. రేపటి నుంచి ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టనున్నారు టీమిండియా క్రికెటర్లు.

Also Read:  WTC 2025-27 points table: WTC పాయింట్ల పట్టికలో టీమిండియాకు షాక్ ఇచ్చిన పాకిస్తాన్.. మనోళ్లను వెనక్కి నెట్టిన శత్రుదేశం

టీమిండియా ప్లేయర్లకు మహేంద్ర సింగ్ ధోని ధావత్

Advertisement

దక్షిణాఫ్రికా వర్సెస్ టీమిండియా మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మహేంద్ర సింగ్ ధోని కీలక నిర్ణయం తీసుకున్నారు. మొదటి వన్డే ఆడేందుకు రాంచీకి దక్షిణాఫ్రికా అలాగే టీమిండియా జట్లు వచ్చాయి. ఈ జట్టులో విరాట్ కోహ్లీ తో పాటు రోహిత్ శర్మ కూడా ఉన్నారు. ఈ తరుణంలో టీమిండియాను కలిసేందుకు స్టేడియానికి నేరుగా మహేంద్ర సింగ్ ధోని వచ్చాడు. ధోనిది కూడా రాంచీ అన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే, రాంచికి వచ్చిన టీమిండియా ప్లేయర్లకు దావత్ ఇవ్వాలని ధోని నిర్ణయం తీసుకున్నాడు.

దీంతో నేరుగా రాంచీ స్టేడియంలో ఉన్న టీమిండియా ప్లేయర్లను కలిసి దావత్ కు ఇన్వైట్ చేశాడు. రేపు సాయంత్రం తన ఇంటిలో పార్టీ నిర్వహించేందుకు ధోని స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. రాంచీ వేదికగా నవంబర్ 30వ తేదీన వన్డే ఉండ నేపథ్యంలో, రేపు అంటే నవంబ‌ర్ 28వ తేదీన‌ దావత్ ఇవ్వాలని అనుకుంటున్నాడట. ఇక ఈ పార్టీకి టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, టీమిండియా సిబ్బందిని కూడా ఇన్వైట్ చేశాడు ధోని. రేపు కచ్చితంగా ఆ పార్టీకి హాజరవుతామని టీమిండియా ప్లేయర్ లందరూ ధోనికి హామీ ఇచ్చారట. అయితే గౌతమ్ గంభీర్ మాత్రం తాను రాబోనని ముఖం మీదే చెప్పేసినట్లు తెలుస్తోంది. తాను ఢిల్లీకి వెళ్లాల్సిన పని ఉందని వెళ్లిపోయాడట.

బైక్ పైనే స్టేడియానికి వ‌చ్చిన ధోని

Advertisement

టీమిండియా ప్లేయర్లు ఉన్న రాంచీ ( JSCA International Stadium Complex, Ranchi ) స్టేడియానికి మహేంద్రసింగ్ ధోని బైక్ పైనే వచ్చేసాడు. ఈ సందర్భంగా టీమిండియా ప్లేయర్లను ( Team India) కలిసి విందుకు ఆహ్వానించాడు ధోని. అనంతరం బైక్ పైనే ఎలాంటి సెక్యూరిటీ లేకుండా వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ధోని అంటే సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్ అంటూ ఈ వీడియోని చూసిన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Gambhir: ఆసియా, చాంపియన్స్ ట్రోఫీ నేనే తీసుకువచ్చా.. దక్షిణాఫ్రికాతో ఓటమికి టీమిండియా ప్లేయర్లే కారణం, నా తప్పేం లేదు

 

 

Related News

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×