E-Paper
Advertisement

MS Dhoni : మాల్దీవులు వద్దు.. లక్ష ద్వీప్ ముద్దు.. వైరల్ అవుతున్న ధోని వ్యాఖ్యలు

MS Dhoni : మాల్దీవులు వద్దు.. లక్ష ద్వీప్ ముద్దు..  వైరల్ అవుతున్న ధోని వ్యాఖ్యలు
MS Dhoni latest comments

MS Dhoni latest comments(Sports news headlines):

భారతదేశం-మాల్దీవుల మధ్య రేగిన చిచ్చు, అక్కడ దేశంలో ముగ్గురు మంత్రుల  సస్పెన్షన్  వరకు వెళ్లింది. అంతేకాదు భారతదేశంలో నిప్పులా రాజుకుంది. ఇప్పుడందరూ చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు మాల్దీవులు వద్దు…లక్షద్వీప్ ముద్దు అంటున్నారు.

మన దేశంలో సుందరమైన ప్రదేశాలను చూసిన తర్వాతే.. విదేశాల్లో పర్యటిస్తామని ఒక  వీడియోలో ఎప్పుడో మాజీ కెప్టెన్ ధోనీ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం అది సందర్భానుసారంగా ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.అందులో తన భార్య సాక్షి ట్రావెలింగ్ అంటే ఎంతో ఇష్టమని, కెరీర్ అయిన తర్వాత ముందు భారతదేశమంతా తిరగాలని ఉందని అందులో తెలిపాడు..

ఇంతకీ విషయం ఏమిటంటే ఇటీవల దేశ ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ వెళ్లారు. అక్కడ అనంతమైన ప్రకృతి సౌందర్యాన్ని చూసి మైమరిచారు. లక్షద్వీప్ ను పర్యాటక స్వర్గధామంలా మార్చాలని భారత ప్రజలకు పిలుపునిచ్చారు.

ఇది చూసిన చాలామంది నెటిజన్లు ఏం చేశారంటే, కుదురుగా ఉండకుండా లక్షద్వీప్ ని మాల్దీవులతో పోల్చారు. ఇక్కడే నిప్పు రాజుకుంది. మాల్దీవుల మంత్రి షియూనా భారతదేశంలో ప్రజలు నీట్ గా ఉండరు. వారికి సామాజిక స్ప్రహ తక్కువ. ఎక్కడపడితే అక్కడ మలమూత్ర విసర్జన చేస్తుంటారని విమర్శించారు. ఈ మాటలకి మరో ఇద్దరు మంత్రులు మజీద్, మల్షా  తమ మద్దతు తెలిపారు.

దీంతో వీరి వ్యాఖ్యలపై బాలీవుడ్ హీరో అక్షయ కుమార్ స్పందించాడు. నా దేశ ప్రజలను అవమానించిన మాల్దీవులకి ఇక వెళ్లనని ఒట్టు పెట్టాడు. నా ఓటు లక్షద్వీప్ కేనని తెలిపాడు. నా షూటింగులన్నీ ఇక్కడే పెట్టుకుంటానని చెప్పాడు. అంతేకాదు ఎక్స్ ప్లోర్ ఇండియన్ ఐలాండ్స్ అని ఒక ట్యాగ్ తగిలించాడు. 

ఇందుకు సపోర్టుగా చాలామంది సినీహీరోలు, సెలబ్రిటీలు, మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, ఇర్ఫాన్ పఠాన్, సురేశ్ రైనాతో సహా పలువురు, ఇంకా బాలీవుడ్ దిగ్గజాలు అమితాబ్ లాంటి వాళ్లు అందరూ జయహో భారత్ అన్నారు.

మహ్మద్ షమీ కూడా స్పందించాడు. భారతదేశంలో పర్యాటకానికే ప్రధమ ప్రాధాన్యత ఇవ్వాలని అన్నాడు. దీంతో ‘బాయ్ కాట్ మాల్దీవుస్’ అనే హాష్ ట్యాగ్ వైరల్ గా మారింది. దీంతో టూరిజం మీదే ఆధారపడి జీవించే మాల్దీవుల ప్రభుత్వం ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలోనే ధోనీ ఆనాడెప్పుడో చెప్పిన మాటలను ఇప్పుడు మళ్లీ తెరపైకి తీసుకొచ్చా

Related News

Big Shock To Trump: ట్రంప్‌కు ఊహించని ఝలక్.. షాకిచ్చిన వార్ పవర్స్, ఆపరేషన్ ‘ఎపిక్ ఫ్యూరీ’ క్లోజ్

Kuwait Airport: ఇరాన్ మిస్సైళ్ల దాడులు.. కువైట్‌ ఎయిర్‌పోర్ట్ డ్యామేజ్, విమాన సర్వీసులు రద్దు

మరో బాంబ్‌ పేల్చిన అమెరికా.. భారత్‌పై అదనపు సుంకాలకు ప్రతిపాదన, ఏకంగా 12 శాతం

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుస దాడులు, ఖేష్మ్ ద్వీపంపై

ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. ఇకపై మాటలు-చర్చల్లేవ్, హోర్మూజ్ జలసంధి మాటేంటి?

ఇరాన్‌లో ఇంటిపోరు మొదలైందా? అధ్యక్షుడు మసూద్‌ నిర్ణయం వెనుక, అసలేం జరుగుతోంది?

రూటు మార్చిన అమెరికా.. ఇరాన్‌పై మెరుపు దాడులు, రాడార్- డ్రోన్ వ్యవస్థలు డ్యామేజ్

హోర్ముజ్ జలసంధిలో హై టెన్షన్.. ఇరాన్ సైనిక క్యాంప్‌పై అమెరికా దాడి, కవ్వింపు చర్యలు డీల్ కోసమా?

Big Stories

×