BigTV English

Mukesh Kumar : కోహ్లీకి ఘోర అవమానం.. జెర్సీ విషయంలో బీసీసీఐ కుట్రలు!

Mukesh Kumar : కోహ్లీకి ఘోర అవమానం.. జెర్సీ విషయంలో బీసీసీఐ కుట్రలు!
Advertisement

Mukesh Kumar : టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ కి ఘోర అవమానం జరిగిందనే చెప్పాలి. విరాట్ కోహ్లీ 18 నెంబర్ గల జెర్సీ ధరించి క్రికెట్ ఆడుతుంటాడు. ఈ విషయం ప్రతీ అభిమానికి, క్రికెట్ మ్యాచ్ వీక్షించే వారందరికీ తెలిసిందే. అయితే కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ జెర్సీ కి రిటైర్మెంట్ ఇవ్వకుండా ప్రముఖ క్రికెటర్, బౌలర్ ముఖేష్ కి ఇచ్చారు. దీంతో జెర్సీ విషయంలో బీసీసీఐ కుట్రలు చేసిందని పలువురు కోహ్లీ అభిమానులు పేర్కొంటున్నారు. వాస్తవానికి విరాట్ కోహ్లీ జెర్సీ ని అసలు ముఖేష్ కి ఎందుకు కేటాయించారని ఇప్పుడు రకరకాల ప్రశ్నలు తలెత్తడం విశేషం.


Also Read :  Psg-Rcb: PSG చారిత్రక విజయం… అంటే ఈసారి RCB దేనా టైటిల్

విరాట్ కోహ్లీ టెస్ట్ మ్యాచ్ లకు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ.. వన్డే మ్యాచ్ లు మాత్రం ప్రస్తుతం ఆడుతున్నాడు. ఇటీవలే టెస్ట్ మ్యాచ్ కి గుడ్ చెప్పేశాడు. అంతకు ముందే టీ-20 మ్యాచ్ లు ఆడుతున్నాడు. అయితే ఐపీఎల్ లో మాత్రం రాయల్ ఛాలెంజర్స్ తరపున ఎప్పటి నుంచో ఆడుతున్నాడు విరాట్ కోహ్లీ. కానీ ఆర్సీబీ జట్టు కి ఇప్పటివరకు ఒక్క ట్రోఫీ ని కూడా అందించలేకపోయాడు. ఈ సీజన్ లోనైనా అందించాలని భావిస్తున్నాడు. ఇప్పటికే ఆర్సీబీ జట్టు ఫైనల్ కి చేరుకుంది. ఫైనల్ లో విజయం సాధిస్తే.. తొలి ట్రోఫీని ముద్దాడుతాడు విరాట్ కోహ్లీ. అతని కెప్టెన్సీలో ఫైనల్ వరకు వెళ్లి ఆర్సీబీ విజయం సాధించలేకపోయింది. ఈ సారి ఆర్సీబీ జట్టు ట్రోఫీ గెలుస్తుందని అభిమానులు సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్స్ చేస్తున్నారు. చివరికీ ఈ సారి ఆర్సీబీ గెలుస్తుందో లేదో తెలియదు కానీ.. ఆర్సీబీ పై మాత్రం వైరల్ కావడం విశేషం.


విరాట్ కోహ్లీ టీమిండియా కి కెప్టెన్ గా వ్యవహరించాడు. అయితే వన్డే జట్టుకి, టీ-20కి, టెస్ట్ క్రికెట్ కి 3 ఫార్మాట్ లకు కెప్టెన్ గా వ్యవహరించిన విరాట్ కోహ్లీ పట్ల బీసీసీఐ ఎందుకు ఇలా వ్యవహరిస్తుందనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. కొందరూ మాత్రం కోహ్లీ వద్దని చెప్పినా టెస్ట్ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించడంతోనే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుందని చెప్పుకొస్తున్నారు. ఇందులో వాస్తవం ఎంత అనేది మాత్రం క్లారిటీ లేదు. టీమిండియాలో విరాట్ కోహ్లీ కి ఉన్న అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. సచిన్ టెండూల్కర్ తరువాత ప్రస్తుతం అంతటి క్రేజ్ తెచ్చుకున్న క్రికెటర్ ఎవరైనా ఉన్నారంటే అది కోహ్లీ అనే చెప్పాలి. అయితే కెప్టెన్సీ పరంగా గతంలో ఎం.ఎస్. ధోనీ కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. కానీ కోహ్లీ మాత్రం రన్ మెషీన్. అత్యధిక పరుగులు చేస్తాడు. చాలా నమ్మకంగా బ్యాటింగ్ చేస్తాడని అభిమానులు కూడా ఎంతో ఆశిస్తారు. వారి ఆశలకు తగ్గట్టు చాలా మ్యాచ్ ల్లో రాణించి అద్భుతమైన బ్యాటింగ్ చేసి టీమిండియా కి విజయాలను అందించాడు. కొన్ని సందర్భాల్లో సచిన్ సెంచరీ చేస్తే.. మ్యాచ్ ఓడిపోతుందనే సెంటిమెంట్ కూడా ఉండేది. ఒకానొక సందర్భంలో సచిన్ ఆస్ట్రేలియా పై డబుల్ సెంచరీ చేశాడు. కానీ ఆ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించడం విశేషం.

Related News

Babar Azam: ప్ర‌మాదంలో బాబ‌ర్ కెరీర్‌..1030 నుంచి ఒక్క సెంచ‌రీ లేదు..ఇక రిటైర్మెంట్ ఖాయం

Athadu: ఆడు మగాడ్రా బుజ్జి…పుట్ బాల్ ప్లేయ‌ర్ కోసం అత‌డు సినిమా డైలాగ్‌..!

Virat Kohli: వాళ్ల టార్చ‌ర్ భరించ‌లేక‌..లండ‌న్ లో సెటిల్ కావ‌డంపై కోహ్లీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

IND VS PAK: 95, 195, 295 పరుగుల వద్ద సిక్స‌ర్ కొట్టిన ఏకైక మొన‌గాడు..పాకిస్థాన్ కు వెన్నులో వ‌ణుకు పుట్టించాడు

Team India: మ‌గాళ్ల‌తో స‌మాన జీతం…మీరు క్రికెట్ ఆడ‌టం దండ‌గే..మ‌హిళ‌ల టీమిండియాపై బ్యాన్ ?

IND VS AUS: బుమ్రాకు రెస్ట్‌, కుల్దీప్ ను ప‌క్క‌కు పెట్టారు…తొలి వ‌న్డేలో ఓట‌మికి 100 కార‌ణాలు

Womens World Cup 2025: నేడు శ్రీలంక‌, బంగ్లా మ‌ధ్య ఫైట్‌…టీమిండియా సెమీస్ చేరాలంటే ఇలా జ‌రుగాల్సిందే?

INDW VS ENGW: స్టేడియంలో ఎక్కి ఎక్కి ఏడ్చిన‌ స్మృతి మందాన..ఫోటోలు వైర‌ల్‌

Big Stories

×