Mustafizur Rahman: ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ 2026 ( Indian Premier League Tournament 2026 ) నుంచి తనను తొలగించడంపై బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రహమాన్ ( Mustafizur Rahman ) మరోసారి స్పందించాడు. మొదట స్పందించినప్పుడు కాస్త పాజిటివ్ గా కామెంట్స్ చేసిన ముస్తాఫిజుర్ రహమాన్, ఇప్పుడు రెచ్చిపోయి మాట్లాడాడు. ఇకపై ఐపీఎల్ టోర్నమెంట్ లో ఆడబోనంటూ సంచలన ప్రకటన చేశాడు. రూ.20 కోట్లు ఇచ్చి, తనను బతిలాడినా కూడా ఇకపై ఐపీఎల్ లో ఆడబోనని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు ముస్తాఫిజుర్ రహమాన్. భారత క్రికెట్ నియంత్రణ మండలి పెద్దలు వచ్చి, తనను బుజ్జగించినా కూడా ఆలోచించబోనని వివరించాడు. ఐపీఎల్ తో తనకు బంధం తెగిపోయిందని బాంబు పేల్చారు. దీంతో ముస్తాఫిజుర్ రహమాన్ కామెంట్స్ వైరల్ గా మారాయి. దీంతో ముస్తాఫిజుర్ రహమాన్ చేసిన కామెంట్లకు ఇండియన్ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. నువ్వు కాకపోతే మీ అయ్య ఆడడానికి వస్తాడు.. నీకు ఎవడురా ? రూ. 20 కోట్లు ఇచ్చేది అంటూ ఫైర్ అవుతున్నారు ఇండియన్ ఫ్యాన్స్.
ఇండియా అలాగే బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్త పరిస్థితిలు నెలకొన్న సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరుగుతున్న తరుణంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ కు చెందిన ముస్తాఫిజుర్ రహమాన్ ( Mustafizur Rahman ) లాంటి ప్లేయర్లను ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో ఆడకుండా ఆదేశాలు ఇచ్చింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. అయితే ముస్తాఫిజుర్ రహమాన్ ( Mustafizur Rahman ) పై వేటు వేయడంతో అనేక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దీనిపై తాజాగా బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రహమాన్ స్పందించాడు.
భారత క్రికెట్ నియంత్రణ మండలి తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు వెనక్కి తీసుకోలేదని వివరించాడు. ఇకపై ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో ( Indian Premier League Tournament ) 20 కోట్లు ఇచ్చిన ఆడబోనని వెల్లడించారు ముస్తాఫిజుర్ రహమాన్. బంగ్లాదేశ్ ప్రభుత్వం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని క్లారిటీ ఇచ్చారు. ఇతర ఫ్రాంచైజీ టోర్నమెంట్ లలో ఆడతానని వెల్లడించారు. దీంతో ముస్తాఫిజుర్ రహమాన్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.
బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రహమాన్ పై భారత క్రికెట్ నియంత్రణ మండలి వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం కౌంటర్ గా సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ 2026 ప్రసారాలు వాళ్ల దేశంలో రాకుండా డిస్ట్రిబ్యూటర్ లందరికీ ఆదేశాలు ఇచ్చింది. ఐపీఎల్ ప్రసారాలపై బ్యాన్ వేసింది. భవిష్యత్తులో పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని.. ఇప్పటికైతే ఐపీఎల్ ప్రసారాలపై బ్యాన్ విధిస్తున్నట్లు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది బంగ్లాదేశ్ ప్రభుత్వం.
Also Read: Sara Tendulkar: సచిన్ ఘోర అవమానం..కూతురు సారా ఫోటోలు అసభ్యకరంగా తీసి, వేధింపులు ?
🚨 MUSTAFIZUR RAHAMAN SAID ABOUT IPL 🚨
Mustafizur Rahman 🗣️“I will never play the IPL again, even if they offer me ₹20 crore.”#MustafizurRahman #IPLl2026 #KKR #CSK @IPL pic.twitter.com/bKRyXvAhQi
— lndian Sports Netwrk (@IS_Netwrk29) January 8, 2026
?igsh=bzc2bTEycWFobGx2