Nasser Hussain On IND VS PAK: పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ (Pakistan vs England) మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టెస్ట్ సిరీస్ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టును విమర్శించని వాళ్లు ఎవరు లేరు. సొంత దేశపు మాజీ క్రికెటర్లు కూడా పాకిస్తాన్ జట్టును ఒక ఆట ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు నాజర్ హుస్సేన్ (Nasser Hussain On IND VS PAK) కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ క్రికెట్ జట్టు చాలా బలహీనమైనదిగా మారిపోయిందని బాంబు పేల్చాడు. ఈ క్రమంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లు చాలా చక్కగా సాగుతున్నాయని పరువు తీశారు. పాకిస్తాన్ వీక్ గా కావడంతో టీమిడియా సులభంగా గెలుస్తూ వస్తోందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు నాజర్ హుస్సేన్. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్ (Nasser Hussain) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలో ఇది అత్యంత నిరాశ జనకమైన దశ అంటూ పేర్కొన్నారు. హెడింగ్లీ వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ సందర్భంగా పాకిస్తాన్ ఘోర పరాజయాన్ని ప్రస్తావిస్తూ ఈ కామెంట్ చేశారు. రెండో టెస్టులో కూడా ఇదే పరిస్థితిని పాకిస్తాన్ ఎదుర్కొంటుందని హెచ్చరించారు. ఈ సిరీస్ లో పాకిస్తాన్ జట్టును చిత్తుగా ఓడించి…3-0 తేడాతో ఇంగ్లాండ్ వైట్ వాష్ చేయడం గ్యారంటీ అని తెలిపారు.
పాకిస్తాన్ జట్టులో పోరాట పట్టిన ఏ మాత్రం లేదని హేళన చేస్తూ మాట్లాడారు. ఒకప్పుడు పాకిస్తాన్ జట్టు అంటే చాలా భయంకరంగా ఉండేదని వ్యాఖ్యానించారు. ఆ జట్టులో భయంకరమైన బ్యాటర్లతో పాటు బౌలర్లు కూడా ఉండేవారని గుర్తు చేశారు. కానీ ఆ అంకితభావం ఉన్న ఆటగాళ్లు ఇప్పుడు పాకిస్తాన్ జట్టులో లేరని విమర్శించారు. ఒకరినొకరు తిట్టుకోవడం తప్ప… పాకిస్తాన్ జట్టును గెలిపించే అంత సత్తా ఎవరి దగ్గర లేదని పరువు తీశారు మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్.
పాకిస్తాన్ క్రికెట్ జట్టులో ప్లేయర్ల తప్పిదాల కంటే, రాజకీయాలు ఎక్కువగా అయ్యాయని మండిపడ్డారు నాజర్ హుస్సేన్. బాబర్ ఆజం, మహమ్మద్ రిజ్వాన్, సల్మాన్ అలీ లాంటి ప్లేయర్లను ఎవరు విమర్శించకూడదని.. తప్పంతా పాకిస్తాన్ క్రికెట్ బోర్డుదే అంటూ ఆగ్రహించారు. పాకిస్తాన్ క్రికెట్ లో ప్రతి ఒక్కరూ వేలు పెట్టిన నేపథ్యంలో.. నాణ్యమైన ప్లేయర్లు జట్టులోకి రావడం లేదన్నారు.