Kris Srikkanth On Gambhir: టీమిండియా వర్సెస్ శ్రీలంక (Team India vs. Sri Lanka) మధ్య రెండు టెస్టుల సిరీస్ ( India tour of Sri Lanka 2026) నిన్నటితో ముగిసింది. ఈ టెస్ట్ సిరీస్ ను 1-0 తేడాతో టీమిండియా కైవసం చేసుకుంది. ఈ రెండు టెస్టుల సిరీస్ లో మొదటి మ్యాచ్ లో టీమిండియా అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక రెండో మ్యాచ్ లో చివరి దాకా పోరాడి ఓడిపోయింది టీమిండియా. రెండో మ్యాచ్ ఓడిపోయినప్పటికీ సిరీస్ మాత్రం టీమిండియా దక్కించుకుంది. దీంతో గౌతమ్ గంభీర్ ను ఉద్దేశించి అతని అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. గౌతమ్ గంభీర్ నాయకత్వంలో టీమిండియా కు మరో టెస్ట్ సిరీస్ దక్కిందని తెగ పొగుడుతున్నారు.
శ్రీలంక గడ్డపై టీమ్ ఇండియా టెస్ట్ సిరీస్ గెలిచిన నేపథ్యంలో గౌతమ్ గంభీర్ కు అనుకూలంగా పోస్టులు పెడుతున్న నేపథ్యంలో… మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ (Krishnamachari Srikkanth)
సంచలన వ్యాఖ్యలు చేశారు. పసికూన శ్రీలంక పైన సిరీస్ గెలవడం కాదు.. బలమైన న్యూజిలాండ్ అలాగే ఆస్ట్రేలియా పైన గెలిచి చూపించాలి అంటూ గంభీర్ కు సవాల్ విసిరారు. అంతేకాదు నిజంగా గంభీర్ మగాడు అయితే… వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ట్రోఫీని టీమిండియా కు అందించాలని చాలెంజ్ విసిరారు. అలా చేయకపోతే వెంటనే హెడ్ కోచ్ పదవికి రాజీనామా చేయాలంటూ హేళన చేస్తూ మాట్లాడారు. శ్రీలంక లాంటి చిన్న జట్టుపై విజయం సాధించి వరల్డ్ కప్ వచ్చినట్లుగా గౌతమ్ గంభీర్ ఫీల్ కావడం దారుణం అంటూ మండిపడ్డారు.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ ఫైనల్ కు వెళ్లాలంటే న్యూజిలాండ్ అటు ఆస్ట్రేలియా పైన టీమిండియా గెలవాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు కృష్ణమాచారి శ్రీకాంత్ (Krishnamachari Srikkanth). అక్కడ టీమ్ ఇండియాలో గంభీర్ లీడ్ చేయాలని సూచనలు చేశారు. శ్రీలంకపై రెండో టెస్టులో కూడా టీమిండియా గెలిచే అవకాశాన్ని గంభీర్ తప్పుడు నిర్ణయాల వల్ల పోగొట్టాడని ఫైర్ అయ్యారు. అనవసరంగా ఫాలో వన్ ఆడించి శ్రీలంకకు ఆయుధం ఇచ్చారని మండిపడ్డారు. ఈ మ్యాచ్ డ్రా అయిన నేపథ్యంలో పూర్తి బాధ్యత గౌతమ్ గంభీర్ తో పాటు గిల్ వహించాలని సీరియస్ అయ్యారు.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు టీమిండియా వెళ్లాలంటే కచ్చితంగా ఏడు మ్యాచ్ లలో 6 గెలవాలి. ఏడు మ్యాచ్ లకు 7 గెలిస్తే.. వందకు రెండు వందల శాతం ఫైనల్స్ కు వెళ్తుంది. న్యూజిలాండ్ తో రెండు టెస్టులు, ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులు అతి త్వరలోనే టీమ్ ఇండియా ఆడనుంది. ఈ రెండు సిరీస్ లను టీమిండియా కైవసం చేసుకుంటే అవలీలగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు వెళుతుంది.