Ambati Rambabu: వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను హుటాహుటీనా హైదరాబాద్ కు తలరించారు. అక్కడి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అంబటికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయన గుండెకు స్టెంట్ వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం. మరోవైపు వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా పేరున్న అంబటి ఆస్పత్రిలో చేరడంపై పార్టీ నేతలు, శ్రేణులు ఆందోళనకు గురవుతున్నారు.
Also Read: ‘విశ్వనగరాన్ని విషాద నగరంగా మార్చారు’.. కాంగ్రెస్, బీఆర్ఎస్పై రామచందర్ రావు ఫైర్!
ఇక అంబటి రాంబాబు విషయానికి వస్తే.. ఆయన వైసీపీలో ప్రధాన కాపు నేతగా ఉన్నారు. 2019లో సత్తెనపల్లి నుంచి ఎంఎల్ఏగా గెలిచి.. గత వైసీపీ ప్రభుత్వంలో నీటిపారుదలశాఖ మంత్రిగా పనిచేశారు. అయితే 2024లో వైసీపీ ఓడిపోగా.. అంబటి సైతం తన నియోజకవర్గంలో ఓటమిపాలయ్యారు. అయినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వైసీపీ తరపున తన బలమైన స్వరాన్ని వినిపిస్తూనే ఉన్నారు. తూటాల్లాంటి మాటలతో టీడీపీ, జనసేన పార్టీపై విరుచుకుపడుతున్నారు.
Also Read: రోబో వ్యాక్యూమ్తో భార్య ఎఫైర్ బట్టబయలు.. రూ.15 లక్షలు గెలిచి.. చివరికి జైలు పాలైన భర్త!