Shoaib – Rahul Dravid : భారత్-పాక్ మధ్య కొద్ది రోజుల నుంచి ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ప్రకటించారు. ఇరు దేశాల DGMO డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్ ల మధ్య చర్చల తరువాత ఇది సాధ్యమైంది. ప్రస్తుతం భారత DGMO లెప్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్. సైనిక కార్యకలాపాల బాధ్యత ఆయనదే. యుద్ధం లేదా ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలకు వ్యూహాలను సిద్ధం చేయడం, శాంతి స్థాపన కోసం కొనసాగుతున్న మిషన్లను రూపొందించడం DGMO పని. ఇతను నిఘా సంస్థలతో సమన్వయం చేసుకుంటారు. ముఖ్యంగా యుద్ధం ప్రారంభం నుంచి కాల్పులు విరమణ వరకు ప్రతీ నిర్ణయంలో DGMO ముఖ్య పాత్ర పోషిస్తారు.
Also Read : Trump-IPL : శభాష్ ట్రంప్.. ఒకేసారి రెండు యుద్దాలను ఆపేసావు
అయితే భారత్-పాక్ ఉద్రిక్తత నేపథ్యంలోనే తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. పాకిస్తాన్ మాజీ క్రికెటర్, బౌలర్ షోయబ్ అక్తర్ పాక్ డ్రోన్ ల మాదిరిగా బౌలింగ్ చేస్తే.. టీమిండియా మాజీ క్రికెటర్, ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రవిడ్ S-400 మాదిరిగా అడ్డుకుంటున్నాడు. షోయబ్ అక్తర్ ఎంత ఫాస్ట్ గా బౌలింగ్ చేసినా.. రాహుల్ ద్రావిడ్ మాత్రం డిఫరెంట్ పెడతాడు. దాంతో షోయభక్తర్ అంత ఫాస్ట్ గా పరిగెత్తిన ప్రయోజనం ఉండదు. ఇప్పుడు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ యుద్ధంలో కూడా అదే జరిగింది. పాకిస్తాన్ ఎంత దూకుడుగా డ్రోన్లు, రఫెల్స్ దూసుకొచ్చినా మన ఇండియన్ ఆర్మీ వాటిని తిప్పి కొట్టింది. ప్రస్తుతం షోయబ్ అక్తర్-రాహుల్ ద్రవిడ్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఒకప్పుడు షోయబ్ అక్తర్ పాకిస్తాన్ జట్టులో కొనసాగాడు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బౌలర్ గా కొనసాగాడు. అక్తర్ బౌలింగ్ లో సెహ్వాగ్, సచిన్ చితకబాదేవారు. కొందరూ బ్యాట్స్ మెన్లు మాత్రం బంతిని టచ్ చేయలేనంతగా బౌలింగ్ చేసేవాడు. ఇక మన రాహుల్ ద్రవిడ్ మాత్రం క్రీజులో ఉంటే.. ఆ బంతి ఎంత వేగంగా వచ్చినా దానిని మెల్లగా మిటికించే వాడు. అలా ఆపీ జిడ్డుగా ఆడేవాడు ద్రవిడ్. టెస్ట్ ల్లో అయితే రాహుల్ ద్రవిడ్ అద్భుతంగా ఆడి తన ప్రతిభ చాటేవాడు. ప్రస్తుతం ఇండియాలో ఐపీఎల్, పాకిస్తాన్ లో పీఎస్ఎల్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. అయితే భారత్-పాక్ మధ్య ఉద్రిక్తత వాతావరణం ఉండటంతో వారం రోజుల పాటు ఐపీఎల్ మ్యాచ్ లు వాయిదా వేశారు. వారం తరువాత దక్షిణ భారతదేశంలోనే మ్యాచ్ లు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు పీఎస్ఎల్ మ్యాచ్ లు దుబాయ్ లో జరుగుతాయని ప్రచారం జరిగింది. కానీ దుబాయ్ అందుకు అంగీకరించలేదని సమాచారం. మళ్లీ అవి పాక్ లోనే జరిగే అవకాశం కనిపిస్తోంది. యుద్ధం ఆపడానికి ప్రధాన కారణం అమెరికా అని.. ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
?igsh=ZDZiMnFnMm95M2pp