BigTV English

Dhoni Brothers : ధోని, అతని సోదరుడి మధ్య గొడవలు.. కారణమేంటి !

Dhoni Brothers : ధోని, అతని సోదరుడి మధ్య గొడవలు.. కారణమేంటి !

Dhoni Brothers : టీమిండియా మాజీ కెప్టెన్  మహేంద్రసింగ్ ధోనీ కి ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కిన విషయం తెలిసిందే. అయినప్పటికీ అతను అవార్డు అందుకునేందుకు వెళ్లలేదు. ఆ సమయంలో వ్యవసాయం చేసుకుంటూ సోషల్ మీడియాలో కనిపించాడు. ఇదిలా ఉంటే.. ముఖ్యంగా వేగానికి పెట్టింది పేరు.. కళ్లు మూసి కళ్లు తెరిచేంతలో చాలా స్పీడ్ గా స్టంపింగ్ చేయడంలో దిట్ట. అదేవిధంగా క్రికెట్ లో సాధారణంగా కెప్టెన్లు తీవ్రమైన ఒత్తిడిలో ఉంటారు. కానీ ధోనీ ఎప్పుడూ కూడా ఒత్తిడిలో కనిపించలేదు. మైదానంలో కూల్ అండ్ కామ్ గా ఉండేవాడు. కెప్టెన్ గా కీలక నిర్ణయాలు తీసుకునే వాడు. ఈ విషయాలు అన్ని దాదాపు అందరికీ తెలిసే ఉంటాయి. ధోనీ హెలికాప్టర్ షాట్లతో పరుగులను రాబట్టాడు. జట్టుకు అవసరమైన సమయంలో అద్భుతంగా రాణించేవాడు. ఈ నేపథ్యంలో ధోనీ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది.


Also Read :  Indian Team Captains: ధోని, రోహిత్ సక్సెస్.. గిల్ కు మాత్రం కోహ్లీ దరిద్రం… టీమిండియా వరుసగా ఓడిపోవడం ఖాయమైనా?

ఈ ‘ధోనీ’ ల మధ్య గొడవ.. 


మహేంద్ర సింగ్ ధోనీ, అతని సోదరుడు నరేంద్ర సింగ్ ధోనీ మధ్య గొడవలు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. నరేంద్ర సింగ్ ధోనీ.. భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంధ్ర సింగ్ ధోనీ కి అన్నయ్య. దాదాపు 10 సంవత్సరాలు పెద్దవాడు. నరేంద్ర సింగ్ ధోనీ పేరిట ఓ ఖాతా ఉంది. ఇటీవలే స్థానిక క్రికెట్ టోర్నమెంట్ కి అతను ముఖ్య అతిథిగా కూడా విచ్చేశాడు. వాస్తవానికి నరేంద్ర సింగ్ ధోనీ ఎప్పుడూ కూడా తన సోదరుడు MS ధోనీతో బహిరంగంగా కనిపించలేదన్నది నిజం. ధోనీ క్రికెట్ కెరీర్ ప్రారంభంలో సోదరి జయంతి గుప్త కీలక పాత్ర పోషించింది. MS ధోనీ తండ్రి పాన్ సింగ్ ధోనీ, తల్లి దేవకి దేవి ఫోటోలు కూడా కనిపించాయి. అన్నయ్య లేని కుటుంబాన్ని ధోనీ బయోపిక్ మూవీ ఎంఎస్ ధోనీ: ది అన్ టోల్డ్ స్టోరీ లో కూడా చూపించడం గమనార్హం. నరేంద్ర రాజకీయ వేత్త అని కూడా కొన్ని నివేదికలు వెల్లడించాయి.

చివరికి ఇలా.. 

2013లో సమాజ్ వాది పార్టీలో చేరారు. అంతకు ముందు ఆయన బీజేపీలో కొనసాగారు. ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారనే విషయం మాత్రం ఎలాంటి సమాచారం లేదు. నవంబర్ 21, 2007లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె కలరు. వీరిద్దరూ 2009లో గొడవపడ్డారు. ధోనీ క్రికెట్ లోకి వెళ్లడం వాళ్ల అన్నయ్యకి ఇష్టం లేదని కొందరూ.. వీరికి ఆస్తి గొడవలు అని మరికొందరూ ఇలా చాలా మంది రకరకాలుగా పేర్కొనడం గమనార్హం. మొత్తానికి వీరు   కొద్ది సంవత్సరాల వరకు వీరు మాట్లాడుకోలేదు. చివరికీ గత మూడు సంవత్సరాల నుంచి మాత్రమే వీరు మాట్లాడుకుంటున్నారు. వీరు ప్రస్తుతం కలిసి రాంచీలో సంతోషంగా జీవిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త వైరల్ అవుతోంది. ధోనీ ఇటీవల ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాడు. తొలుత చెన్నై జట్టు కి రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ గా ఉన్నాడు. అతను గాయాల కారణంగా దూరం కావడంతో చెన్నై సూపర్ కింగ్స్ కి ఎం.ఎస్. ధోనీ 2025 సీజన్ కి కెప్టెన్ గా వ్యవహరించాడు. ధోనీ కెప్టెన్సీలో సీఎస్కే జట్టు పేలవ ప్రదర్శన కనబరిచింది. పాయింట్ల పట్టికలో చిట్ట చివరి స్థానంలో కొనసాగడం విశేషం.

Related News

IND Vs SL : టాస్ గెలిచిన శ్రీలంక‌.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

IND Vs PAK : ఇండియా వర్సెస్ పాక్ ఫైనల్..PVR సంచలన నిర్ణయం.. ఏకంగా 100 థియేటర్స్ లో

Asia Cup 2025 : ఒకే గొడుగు కిందికి పాకిస్తాన్, బంగ్లా ప్లేయర్స్… ఇద్దరు ఇండియాకు శత్రువులే.. క్రేజీ వీడియో వైరల్

Shoaib Akhtar : ఇండియాకు ఇగో ఎక్కువ‌.. ఆదివారం మొత్తం దించేస్తాం..ఇక కాస్కోండి !

IND Vs PAK : ఆసియా కప్ ఫైనల్ కంటే ముందు పాకిస్తాన్ కు ఎదురుదెబ్బ.. హరీస్ రవుఫ్ పై బ్యాన్..!

India vs Pakistan Final: ఇండియాను వ‌ద‌ల‌కండి…చంపేయండి అంటూ రెచ్చిపోయిన పాక్ ఫ్యాన్‌..హరీస్ రవూఫ్ కు షేక్ హ్యాండ్ ఇచ్చి !

Asia Cup 2025 : పాక్ చెత్త ఫీల్డింగ్.. మ‌రోసారి రుజువైంది..చేతులారా వ‌చ్చిన రనౌట్ వ‌దిలేశారుగా

India vs Pakistan final: టీమిండియా, పాక్ మ‌ధ్య ఫైన‌ల్స్‌… 41 ఏళ్లలో తొలిసారి…రికార్డులు ఇవే..ఫ్రీగా చూడాలంటే?

Big Stories

×