T20I Tri-Series 2025: పాకిస్తాన్ దేశంలో వరుసగా బాంబు దాడులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ దేశంలో వరుసగా క్రికెట్ టోర్నమెంట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ మధ్య 3 వన్డేల సిరీస్ కొనసాగుతోంది. త్వరలోనే పాకిస్తాన్ దేశంలో టీ20 ట్రై సిరీస్ ( Pakistan T20I Tri-Series 2025) జరగనుంది. ఆఫ్ఘనిస్తాన్ మధ్యంతరంగా తప్పుకున్న ఈ సిరీస్ లో జింబాబ్వే ఎంట్రీ ఇస్తోంది. ఈ ట్రై సిరీస్ లో శ్రీలంక ( Sri Lanka), పాకిస్తాన్ ( Pakistan ), జింబాబ్వే ( Zimbabwe), తలపడనున్నాయి. ఈ మేరకు తాజాగా షెడ్యూల్ అప్డేట్ చేసి రిలీజ్ చేశారు.
పాకిస్తాన్, శ్రీలంక, జింబాబ్వే మధ్య టి20 ట్రై సిరీస్ జరగనుంది. ఈ ట్రై సిరీస్ నవంబర్ 17వ తేదీ నుంచి నవంబర్ 29వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ టోర్నమెంటులో మొత్తం ఏడు టి20 లు జరుగుతాయి. ఈ మేరకు తాజాగా కొత్త షెడ్యూల్ ప్రకటించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఇక ఇస్లామాబాద్ నగరంలో వరుసగా బాంబు దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఏడు టి20 లు మొత్తం కూడా రావాల్పిండి స్టేడియంలోనే (Rawalpindi Cricket Stadium, Rawalpindi) నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేస్తామని కూడా ఈ సందర్భంగా పాకిస్తాన్ వెల్లడించింది.
పాకిస్తాన్ వర్సెస్ జింబాబ్వే మధ్య నవంబర్ 18వ తేదీన మొట్ట మొదటి టి20 జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 6:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. నవంబర్ 20వ తేదీన శ్రీలంక వర్సెస్ జింబాబ్వే మధ్య రెండవ టి20, పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక మధ్య నవంబర్ 22వ తేదీన మూడవ టి20 నిర్వహిస్తారు. ఇక నవంబర్ 23వ తేదీన పాకిస్తాన్ వర్సెస్ జింబాబ్వే మధ్య నాలుగో టి20 రావాల్పిండి స్టేడియంలో ( Rawalpindi) జరగనుంది. నవంబర్ 25వ తేదీన శ్రీలంక వర్సెస్ జింబాబ్వే, నవంబర్ 27వ తేదీన పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక మధ్య మ్యాచ్ జరగనుంది.
నవంబర్ 29వ తేదీ శనివారం రోజున ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. ఇది ఇలా ఉండగా గత నెలలో పాకిస్తాన్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఈ యుద్ధం నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ లో ఓ వైమానిక దాడికి పాల్పడింది పాకిస్తాన్. ఈ సంఘటనలో ఆఫ్ఘనిస్తాన్ దేశానికి సంబంధించిన ముగ్గురు దేశవాళి క్రికెటర్లు మృతి చెందారు. దీంతో ట్రై సిరీస్ నుంచి తప్పుకుంది ఆఫ్ఘనిస్తాన్. ఈ తరుణంలోనే, జింబాబ్వే రంగంలోకి దిగుతోంది. ఈ తరుణంలోనే శ్రీలంక, జింబాబ్వే, పాకిస్తాన్ మధ్య ట్రై సిరీస్ జరుగనుంది.
The revised schedule of Tri-nation series.
– All matches shifted to Rawalpindi. pic.twitter.com/NTJes2albV
— Sheri. (@CallMeSheri1_) November 13, 2025