PBKS vs DC War Effect: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) నేపథ్యంలో…హిమాచల్ ప్రదేశ్ ధర్మశాల లో ( ( Himachal Pradesh Dharamshala )) కలకలం నెలకొంది. పంజాబ్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ ( Punjab Kings vs Delhi Capitals, 58th Match ) మధ్య జరుగుతున్న మ్యాచ్ అర్ధాంతరంగా రద్దు అయినట్లు సమాచారం అందుతోంది. కాసేపటి క్రితమే… డ్రోన్స్ ఇండియా పైకి వదిలింది పాకిస్తాన్. ముఖ్యంగా జమ్మూ లోని ఎయిర్ పోర్ట్ టార్గెట్ గా పాకిస్తాన్ ఈ దాడులు చేస్తోంది. అయితే ఆ పాకిస్తాన్ ( Pakisthan Team) దాడులను ఇండియా కూడా సమర్థవంతంగా… ఎదుర్కొంటోంది.
Also Read: Sakshi Singh Dhoni: KKR లేడీతో ధోని రొమాన్స్… సాక్షి స్ట్రాంగ్ వార్నింగ్
ఇలాంటి నేపథ్యంలో.. ఐపీఎల్ 2025 టోర్నమెంట్లో ( IPL 2025) భాగంగా ఇవ్వాల జరుగుతున్న పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య రద్దు చేసినట్లు తెలుస్తోంది. హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. బోర్డర్ కు దగ్గరగా ఉన్న నేపథ్యంలో… ఈ మ్యాచ్ అర్ధాంతరంగా ఆపివేయాలని కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. వెంటనే స్టేడియంలో లైట్లు కూడా ఆపేశారు. దీంతో మ్యాచ్ ఆగిపోయింది. జమ్ములో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో బ్లాక్ అవుట్ విధించినట్లు సమాచారం. నిజంగానే ఈ మ్యాచ్ రద్దు అయితే చెరొక పాయింట్ వస్తుంది.
అయితే.. జరుగుతున్న మ్యాచ్ అర్ధాంతరంగా ఇలా రద్దు కావడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇంత వరకు ఎప్పుడూ కూడా…. ఇలా అర్ధాంతరంగా మ్యాచ్ ఆగిపోలేదు. అందులోనూ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో… మ్యాచ్ రద్దు కావడం అందరిలోనూ ఉత్కంఠతను నెలకొల్పుతోంది. ఈ యుద్ధం కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ మిగతా సీజన్ జరిగే అవకాశాలు లేవని కూడా చెబుతున్నారు. పాకిస్తాన్ రెచ్చిపోయి దాడులు చేస్తున్న నేపథ్యంలో…. మ్యాచ్లు నిర్వహించడం అసాధ్యమని కూడా కొంతమంది అంచనా వేస్తున్నారు. ప్లే ఆఫ్ అలాగే సెమీస్ అలాగే ఫైనల్ మ్యాచ్ లు భవిష్యత్తులో జరగాల్సి ఉంది.
కాబట్టి నాకౌట్ మ్యాచ్ లు ఉన్న నేపథ్యంలో జనాలు ఎక్కువగా వస్తారు. జనాలు ఎక్కువగా వస్తే… ఇలాంటి ఉగ్ర దాడులు జరిగితే ప్రమాదమే. ఎవరిని కంట్రోల్ చేయలేం. కాబట్టి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటు రద్దు చేయాలని కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. మరి దీనిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఒకవేళ ఇలా అర్ధాంతరంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ముగిస్తే… చాలా కష్టమే అని చెబుతున్నారు. దీనిపై మోడీ ప్రభుత్వం ఆదేశాల మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి ( Board of Control for Cricket in India ) వెళ్లే ఛాన్సులు ఉన్నాయి.
Also Read: Sakshi Singh Dhoni: KKR లేడీతో ధోని రొమాన్స్… సాక్షి స్ట్రాంగ్ వార్నింగ్
IPL chairman Arun Dhumal requesting fans to leave the stadium as soon as possible at Dharamshala. pic.twitter.com/1Pj0H7I5cc
— Tanuj (@ImTanujSingh) May 8, 2025