E-Paper
Advertisement

Race to Top 2 : RCB కి బంపర్ ఆఫర్.. ప్లే ఆఫ్స్ లో ఇలా జరిగితే కప్ గ్యారంటీ

Race to Top 2 : RCB కి బంపర్ ఆఫర్.. ప్లే ఆఫ్స్ లో ఇలా జరిగితే కప్ గ్యారంటీ
Advertisement

Race to Top 2 : ఐపీఎల్ 2025 సీజన్ లో ఇప్పటికే గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లు ప్లే ఆప్స్ కి చేరుకున్నాయి. అయితే ఇవి ప్లే ఆప్స్ కి చేరినప్పటికీ.. టాప్ 1, 2, 3, 4 జట్లు ఏవి అనేవి మాత్రం ఇంకా క్లారిటీ లేదు. టాప్ 1 లేదా 2 కోసం నాలుగు జట్లు పోటీ పడుతున్నాయి. టాప్ 2లో ఉన్న జట్టు ఓడిపోయినప్పటికీ ఎలిమినేటర్ లో విజయం సాధించిన జట్టుతో మరోసారి క్వాలిఫ్లయిర్ 2 ఆడేందుకు ఛాన్స్ ఉంటుంది. అందుకే ఆ టాప్ ప్లేస్ లో ఉండేందుకు ఆయా జట్లు పోటీ పడుతున్నాయి.

Also Read : Natarajan : ఒక్కో బాల్ కు 60 లక్షలు.. నటరాజన్ క్రేజ్ మామూలుగా లేదు

Advertisement

అయితే ప్లే ఆప్స్ కి చేరుకున్న జట్లు ముచ్చటగా మూడు ఇప్పటికే ఓటమిపాలయ్యాయి. తొలి స్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ జట్టు.. లక్నో సూపర్ జెయింట్స్ తో.. రెండో స్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఓడిపోవడంతో మూడో స్థానానికి పడిపోయింది. ఇక రెండో స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ జట్టు.. ఢిల్లీ క్యాపిటల్స్ పై ఓడిపోయింది. ముంబై జట్టు.. పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది. ఇవాళ గుజరాత్ టైటాన్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఒకవేళ ఈ మ్యాచ్ లో కనుక గుజరాత్ టైటాన్స్ ఓడిపోతే పరిస్థితి మరోలా ఉంటుంది. ముఖ్యంగా నిన్న పంజాబ్ జట్టు ఓడిపోవడంతో పాయింట్ల పట్టికనే తలకిందులు అయినంత పని చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కి అడ్వాంటేజ్ గా మారనుంది. గుజరాత్ టైటాన్స్ 18, పంజాబ్ 17, ఆర్సీబీ 17, ముంబై ఇండియన్స్ 16 పాయింట్లతో ఉంది. అయితే ఈ నాలుగు టీమ్ లకు ఒక్కొక్క మ్యాచ్ మిగిలి ఉంది.

ఆర్సీబీ కే అధిక ఛాన్స్.. 

Advertisement

అయితే గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్ తో గుజరాత్ విజయం సాధిస్తే.. 20 పాయింట్లకు చేరుకుంటుంది. అఫిషీయల్ గా టాప్ లో క్వాలిఫై అవుతుంది. ఒకవేళ ఓడిపోతే పరిస్థితి మరోలా ఉంటుంది. 90 శాతం గుజరాత్ గెలిచే అవకాశం కనిపిస్తోంది. ఇక తరువాత మ్యాచ్ పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్టు ఆడబోతున్నారు. అయితే ఈ మ్యాచ్ చాలా ముఖ్యమైనదనే చెప్పాలి. ఒకవేళ పంజాబ్ గెలిస్తే పంజాబ్ టాప్ 2లోకి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఇందులో ఆర్సీబీ విజయం సాధిస్తే.. పంజాబ్, ఆర్సీబీ లలో ఎవరి రన్ రేట్ బాగుంటే వాళ్లు టాప్ 2లోకి వెళ్తారు. ఒకవేళ పంజాబ్ ముంబై పై ఓడిపోతే.. మాత్రం.. ఆర్సీబీ విజయం కోసం ఎదురుచూడాలి. ఆర్సీబీ విజయం సాధిస్తే.. మాత్రం నేరుగా టాప్ 2లోకి వెళ్తుంది. చివరి మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ ఆర్సీబీ ఆడబోతుంది. అయితే ఎన్ని ఓవర్లలో గెలవాలనేది తెలుస్తుంది కాబట్టి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కి ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పవచ్చు. ముంబై జట్టు ఇతర జట్ల పై ఆధారపడాలి. కానీ ఆర్సీబీ చూసుకొని సత్తా చాటితే ఫైనల్ కి వెళ్లే అవకాశం ఉంటుంది. ప్రారంభం నుంచి ఆర్సీబీ టైటిల్ సాధిస్తుందని వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఏం జరుగుతుందో వేచి చూడాలి మరీ.

?igsh=cTZ5OXZhb2NweGls

Tags

Related News

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

Big Stories

Advertisement
×