E-Paper
Advertisement

IND VS PAK: ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ కు వర్షం టెన్ష‌న్‌…తెర‌పైకి రిజ‌ర్వ్ డే, క‌చ్చితంగా ఆడాల్సిందే

IND VS PAK: ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ కు వర్షం టెన్ష‌న్‌…తెర‌పైకి రిజ‌ర్వ్ డే, క‌చ్చితంగా ఆడాల్సిందే
Advertisement

IND VS PAK:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా మరికొన్ని గంటల్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. శ్రీలంకలోని కొలంబో ప్రేమ దాస స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. శివరాత్రి రోజున రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మేరకు ఇప్పటికే టికెట్లు కూడా విక్రయించబడ్డాయి. అభిమానులు అందరూ కొలంబో చేరుకున్నారు. ఇలాంటి నేపథ్యంలో క్రికెట్ అభిమానులకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరగబోయే మ్యాచ్ కు వరుణుడు విలన్ గా మారబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మ్యాచ్ జరగకుండా వర్షం ముప్పు ఉన్నట్లు చెబుతున్నారు. శివరాత్రి రోజున అంటే రేపు కొలంబోలో 90% వర్షపాతం నమోదు అయ్యే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇదే జరిగితే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగే అవకాశాలు లేనట్లే అని అంటున్నారు.

Also Read: Ishan Kishan: ఉస్మాన్ తారిక్ బౌలింగ్ ను చీల్చి చెండాడుతాం, సిక్సుల వ‌ర్షం కురిపిస్తాం..ప్లాన్ రివీల్ చేసిన ఇషాన్ కిష‌న్‌

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కు వర్షం ముప్పు

Advertisement

కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా మరికొన్ని గంటల్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కు వర్షం ముప్పుగా మారినట్లు చెబుతున్నారు. రేపు మ్యాచ్ 7:00కు ప్రారంభం అవుతుంది. ఆ సమయానికి వాతావరణం అనుకూలించే అవకాశాలు లేనట్టే అని చెబుతున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం 80 నుంచి 95% రేపు సాయంత్రం ఏడు గంటల సమయంలో కొలంబోలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయట. ఈ ఎఫెక్ట్ ప్రేమ దాస స్టేడియం దగ్గర కూడా ఉండే ప్రమాదం పొంచి ఉందని అంటున్నారు. ఇదే జరిగితే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ కు తీవ్ర అంతరాయం ఏర్పడునున్నట్లు వాతావరణ శాఖ సూచనలు చేస్తోంది.

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కు రిజర్వుడే ?

శివరాత్రి రోజున ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ కు వర్షం గండంగా మారిన సంగతి తెలిసిందే. అయితే రేపు మ్యాచ్ ప్రారంభానికి వర్షం పడి… విధ్వంసం సృష్టిస్తే ఐసీసీ ప్లాన్ B సిద్ధం చేసిందట. శివరాత్రి రోజు అసలు మ్యాచ్ జరగకుండా వర్షం పడితే.. రిజర్వుడే పెట్టేందుకు సిద్ధమైందట ఐసీసీ. ఇదే జరిగితే, ఫిబ్రవరి 16వ తేదీన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. అదే స్టేడియం వేదికగా మ్యాచ్ నిర్వహిస్తారు. ఇక ఫిబ్రవరి 16వ తేదీన కూడా మ్యాచ్ జరగలేని పరిస్థితి ఉంటే దాదాపు 300 కోట్ల నష్టం ఐసీసీకి జరిగే ప్రమాదం ఉందట. అటు మ్యాచ్ రద్దు అయితే చెరొక పాయింట్ దక్కనుంది. దీంతో ఈ రెండు జట్లు కచ్చితంగా సూపర్ 8 లోకి దూసుకు వెళ్తాయి.

Advertisement

Also Read: Sunil Gavaskar: అర్ష‌దీప్ సింగ్ స్థానంలో వాషింగ్ట‌న్ ను తీసుకోండి..పాక్ తో ఆడే టీమిండియా జ‌ట్టుపై గ‌వాస్క‌ర్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

 

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×