BigTV English

Virat Kohli : ఓటమి బాధలో కోహ్లీ.. కన్నీళ్లు పెట్టుకుంటున్న ఫ్యాన్స్

Virat Kohli : ఓటమి బాధలో కోహ్లీ.. కన్నీళ్లు పెట్టుకుంటున్న ఫ్యాన్స్

  Virat Kohli :  టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన సచిన్ తరువాత టీమిండియా తరపున ఒక్కొక్క రికార్డును బ్రేక్ చేస్తున్నారు. ఐపీఎల్ లో కోహ్లీ రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ లో భాగంగా నిన్న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ ఓటమి చవి చూసింది. ఆర్సీబీ నిర్దేశించిన 164 పరుగుల లక్ష్యాన్ని డీసీ 4 వికెట్లు కోల్పోయి 17.5 ఓవర్లలోనే ఛేదించింది. లోకల్ బాయ్ కే.ఎల్.రాహుల్ 53 బంతుల్లో 97 పరుగులు చేసి నాటౌట్ నిలిచాడు. 5 పరుగుల వద్దనే రాహుల్ క్యాచ్ ను కెప్టెన్ పాటిదార్ వదిలేయడంతో ఆర్సీబీ భారీ మూల్యం చెల్లించుకుంది.


ముఖ్యంగా ఆర్సీబీకి ఈ ఏడాది హోం గ్రౌండ్ అయిన చిన్నస్వామి స్టేడియం ఏమాత్రం కలిసి రావడం లేదనే చెప్పాలి. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ లలో కూడా ఓడిపోయింది. ఈ సీజన్ ఆర్సీబీ ఐదు మ్యాచ్ లలో 3 విజయాలు సాధించగా.. అవన్నీ బయటి మైదానాల్లో కావడం గమనార్హం. ఢిల్లీ క్యాపిటల్స్ పై చిన్న స్వామి స్టేడియంలో ఓటమితో ఆర్సీబీ చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది. ఒకే వేదిక పై అత్యధిక పరాజయాలు చవిచూసిన తొలిజట్టుగా బెంగళూరు నిలిచింది. సొంత మైదానంలో ఇప్పటి వరకు బెంగళూరు 45 మ్యాచ్ లలో ఓడిపోవడం గమనార్హం. అంతకు ముందు ఈ రికార్డు ఢిల్లీ క్యాపిటల్స్ పేరిట ఉండేది. ఢిల్లీ 44 మ్యాచ్ ల్లో ఓడింది. డీసీ రికార్డును ఇప్పుడు బెంగళూరు బ్రేక్ చేసింది.

ఢిల్లీతో చేతిలో సొంత గడ్డపై ఓటమితో ఆర్సీబీ ప్లేయర్లు నైరాశ్యంలో మునిగిపోయారు. ముఖ్యంగా ఆర్సీబీ కీలక ఆటగాడు విరాట్ కోహ్లీ తీవ్రమైన బాధలో కనిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పలు చోట్ల విజయం సాధించినా సొంత గ్రౌండ్ లో వరుస పరాజయాలు ఆర్సీబీ ప్లేయర్లను బాధిస్తున్నాయని పలువురు కామెంట్లు చేస్తున్నారు. బెంగళూరు, ఢిల్లీ తరువాత సొంత గ్రౌండ్ లో ఓడిపోయిన జాబితాలో మూడో స్థానంలో కోల్ కతా ఉంది. ఈడెన్ గార్డెన్ లో 38 మ్యాచ్ లలో కేకేఆర్ ఓడిపోయింది. ఐపీఎల్ 18 టైటిల్ దిశగా సాగుతున్న ఆర్సీబీకి డీసీ కళ్లెం వేసింది. మరోవైపు ఐపీఎల్ 2025 డీసీ జోరు కొనసాగుతోంది. మిగతా జట్లన్నీ కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఓడిపోగా.. ఢిల్లీ మాత్రం అజేయంగా ఉంది.


నిన్నటి మ్యాచ్ లో బెంగళూరు జట్టు 163 పరుగులు చేసి 7 వికెట్లు కోల్పోయింది. ఫిల్ సాల్ట్ 17 బంతుల్లో 37 పరుగులు చేశాడు. సాల్ట్ రన్ కావడంతో బెంగళూరు స్కోర్ కి బ్రేకులు పడ్డాయి. అయితే చివరిలో టిమ్ డేవిడ్ 20 బంతుల్లో 37 పరుగులు చేయడంతో బెంగళూరు ఆ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది. మరోవైపు డీసీ బౌలర్లు కూడా కట్టుదిట్టమైన బంతులు వేయడంతో బెంగళూరు ఆటగాళ్లు చతికిల పడ్డారు. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ లో లివింగ్ స్టోన్, జితేష్ శర్మ విఫలం చెందారు. దీంతో బెంగళూరు భారీ స్కోరు చేయలేక సొంత గ్రౌండ్ లో ఓటమి పాలైంది.

 

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×