E-Paper
Advertisement

Rishabh Pant: ఆస్తులు మొత్తం వారికి రాసిస్తున్న రిషబ్‌ పంత్‌ !

Rishabh Pant: ఆస్తులు మొత్తం వారికి రాసిస్తున్న రిషబ్‌ పంత్‌ !
Advertisement

Rishabh Pant: టీమిండియా క్రికెటర్, స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఎక్స్ {ట్విట్టర్} వేదికగా సంచలన ప్రకటన చేశాడు. మరోసారి తన మంచి మనసును చాటుతూ ఇకపై తన ఆదాయంలో 10% పేదలకు ఇస్తానని ప్రకటించారు. యాడ్స్ ద్వారా తనకు వచ్చే ఆదాయంలో 10% పేదలకు ఆర్థిక సాయం చేస్తానని వెల్లడించాడు రిషబ్ పంత్. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదిక ద్వారా పంచుకున్నాడు. దీంతో రిషబ్ పంత్ తీసుకున్న ఈ నిర్ణయం పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Also Read: Ind vs Eng 1st ODI: నేటి నుంచే వన్డే సిరీస్‌..టైమింగ్స్‌ ఇవే..ఉచితంగా ఇలా చూడండి ?

Advertisement

ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేసిన రిషబ్ పంత్.. ” క్రికెట్ వల్లే నేను ఈ స్థాయికి చేరుకున్నాను. కఠిన సమయాలలో ధైర్యంగా ఎలా ఉండాలో నాకు ఎదురైన అనుభవాల ద్వారా నేర్చుకున్నాను. క్రికెట్ నాకు అందించిన దానికి కృతజ్ఞతగా.. సమాజానికి తిరిగి అందించాలనే ఆలోచన నా మనసులో ఉంది. ఒక్కోసారి మన జీవితంలో అనుకోకుండా చోటు చేసుకునే ఘటనలు జీవిత పాఠాలు నేర్పిస్తాయి. కొన్ని సంవత్సరాల క్రితం నేను అలాంటి కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నాను. అందుకే ఇంకా ఎక్కువ కృతజ్ఞతతో ఉండాలని నిర్ణయించుకున్నాను.

జీవితంలో నేను నేర్చుకున్నది ఎప్పుడూ వదులుకోకుండా, ఎల్లప్పుడూ ఆశతో నవ్వుతూ ఉండడం, నా ఆట ద్వారా నేను పొందిన దానిలో కొంత భాగం ప్రజలకు ఇచ్చి.. వారిలో కూడా చిరునవ్వులను తీసుకురావాలనేది నా లక్ష్యం. తిరిగి ఇవ్వడం ద్వారా వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేనిది. అందుకే యాడ్స్ ద్వారా వచ్చిన సంపాదనలో 10% రిషబ్ పంత్ ఫౌండేషన్ { Rishabh pant Foundation} ద్వారా పేదలకు ఖర్చు చేస్తాను.

Advertisement

రిషబ్ పంత్ ఫౌండేషన్ నాకు చాలా ఇష్టమైంది. దాని లక్ష్యాలు నా హృదయానికి దగ్గరగా ఉన్నాయి. మరో రెండు నెలల్లో దీని పూర్తి వివరాలు వెల్లడిస్తాను. మీ ప్రేమ, ఆశీస్సులు, మద్దతుకు ధన్యవాదాలు”. అంటూ రిషబ్ పంత్ ఓ వీడియోని రిలీజ్ చేశారు. ఇలా రిషబ్ పంత్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అతని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గొప్ప వాళ్ళు ఎప్పుడూ గొప్పగానే ఆలోచిస్తారని కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఇటీవల జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో రిషబ్ పంత్ అత్యధిక ధరకు అమ్ముడుపోయిన క్రికెటర్ గా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. లక్నో సూపర్ జాయింట్ అతడిని ఏకంగా రూ. 27 కోట్లకు కొనుగోలు చేసింది. అంతేకాకుండా తమ జట్టుకు కెప్టెన్ గా నియమించింది. ఇక రిషబ్ పంత్ ప్రస్తుతం సుమారు 10 కోట్ల ఉత్పత్తులకు ప్రచారకర్తగా ఉన్నట్లు సమాచారం.

Also Read:  Champions Trophy 2025: శిఖర్ ధావన్ లేకపోవడం టీమిండియాకు ఎంత నష్టమో తెలుసా.. కోహ్లీ, రోహిత్ కూడా పనికిరారు !

ప్రస్తుతం టీమిండియాలో మూడు ఫార్మాట్లలో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. 2017లో టీమిండిగా తరఫున అరంగేట్రం చేసిన పంత్.. ఇప్పటివరకు 150 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడాడు. జట్టులో ఓ కీలక ఆటగాడిగా ఎదిగాడు. 2024 లో టీమిండియా టి-20 వరల్డ్ కప్ గెలవడంలో పంత్ కూడా ఓ సభ్యుడు. ఇక విదేశీ గడ్డపై దూకుడుగా ఆడడంలో పంత్ కి మరెవ్వరూ సాటిరారు.

Tags

Related News

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

Big Stories

Advertisement
×