Ritika Sajdeh : టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. పరుగులు చేయడంలో అతనికీ సాటి లేరు అని నిరూపించాడు. ఐపీఎల్ 2025 సీజన్ లో విరాట్ కోహ్లీ కీలక ఇన్నింగ్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు టైటిల్ సాధించింది. ఇందులో విరాట్ కోహ్లీ పాత్ర కూడా చాలా కీలకం అనే చెప్పాలి. ఈ సీజన్ లో ఆర్సీబీ అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్ రెండింటిలో రాణించింది. దీంతో టైటిల్ సాధించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ పిక్ వైరల్ అవుతోంది. టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ భార్య రితికా సాజ్దే, విరాట్ కోహ్లీ కలిసి ఉన్న ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. వాస్తవానికి విరాట్ కోహ్లీ అనుష్క శర్మను పెళ్లాడక ముందు కొందరూ హీరోయిన్లు, మోడళ్లతో డేటింగ్ చేసినట్టు సమాచారం. రోహిత్ శర్మ భార్య రితికా తో కూడా డేటింగ్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read : Sonu Nigam : RCB టైటిల్ గెలవడంతోనే… ఇండియాలో ప్రమాదాలు.. ట్వీట్ వైరల్
రితికాతో కలిసి ఉన్న విరాట్..
2013లో రితికాతో కలిసి విరాట్ కోహ్లీ ఓ సినిమాకి వెళ్లాడు. 2013లో జింబాబ్వే టూర్ నుంచి స్వదేశానికి వచ్చిన విరాట్ కోహ్లీ ముంబైలో ఆమెతో తిరుగుతూ కనిపించాడు. ఆ సమయంలో ముంబైలో స్పోర్ట్స్ టాలెంట్ మేనేజర్ గా పని చేసింది రితికా సాజ్దే. వాస్తవానికి 2010 ఐపీఎల్ సమయంలో రితికా కి విరాట్ కోహ్లీకి పరిచయం ఏర్పడింది. ఇక ఆ తరువాత విరాట్ కోహ్లీకి మూడేళ్ల పాటు మేనేజర్ గా పని చేసింది రితికా. అప్పట్లో వీరిద్దరి మధ్య ఏదో ఉందని ప్రచారం జరిగినా.. తమ మధ్య ఏమిలేదని.. తాము కేవలం ఫ్రెండ్స్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు విరాట్ కోహ్లీ. విరాట్ తరువాత రోహిత్ శర్మతో కలిసి మేనేజర్ గా వ్యవహరించిన రితికా.. అతని ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. డిసెంబర్ 13, 2015న రోహిత్-రితికా పెళ్లి చేసుకున్నారు. విరాట్ కోహ్లీ మాత్రం డిసెంబర్ 11, 2017 న అనుష్క శర్మను పెళ్లి చేసుకున్నాడు. అంటే.. రోహిత్ శర్మ పెళ్లి జరిగిన రెండు సంవత్సరాల తరువాత విరాట్ కోహ్లీ పెళ్లి చేసుకున్నాడు.
వారితో విరాట్ రిలేషన్ షిప్..
ఇప్పటి వరకు టీ-20లు, టెస్ట్ లు, వన్డేలలో అద్భుతమైన ఫామ్ కనబరిచిన కోహ్లీ పలు ప్రపంచ రికార్డులను సృష్టించాడు. ఇటీవలే టెస్ట్ క్రికెట్ కి కూడా గుడ్ చెప్పాడు. ప్రస్తుతం కేవలం వన్డే క్రికెట్ కి మాత్రమే పరిమితమయ్యాడు విరాట్ కోహ్లీ. టీ-20 వరల్డ్ కప్ విజయం సాధించిన అనంతరం టీ-20 మ్యాచ్ లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కోహ్లీ గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా కోహ్లీ రిలేషన్ షిప్ ఇంతమందితో కొనసాగించాడా..? అని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేయడం విశేషం. కోహ్లీ.. రితిక తో పాటు హీరోయిన్లు సాక్షి అగర్వాల్, తమన్నా హీరోయిన్స్ తో రిలేషన్ షిప్ కొనసాగించినట్టు తెలుస్తోంది.