E-Paper
Advertisement

Rohit Sharma: రోహిత్ దెబ్బ అదుర్స్‌.. ఆ ఈవెంట్‌ రద్దు చేసుకున్న పాకిస్తాన్‌ !

Rohit Sharma: రోహిత్ దెబ్బ అదుర్స్‌.. ఆ ఈవెంట్‌ రద్దు చేసుకున్న పాకిస్తాన్‌ !
Advertisement

Rohit Sharma: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 20 నుండి ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. 1996 వన్డే ప్రపంచ కప్ తర్వాత పాకిస్తాన్ ఐసీసీ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి కావడం విశేషం. అయితే భద్రతా కారణాల దృశ్య టీమిండియా ఆ దేశానికి వెళ్లడం లేదు. భారత్ తనకు సంబంధించిన మ్యాచ్ లు అన్నింటిని దుబాయ్ వేదికగానే ఆడుతుంది. ఈ టోర్నీ ప్రారంభం కావడానికి చాలా రోజుల సమయం లేదు. ఈ మెగా ఈవెంట్ లో 8 టీమ్ లు పాల్గొనబోతున్నాయి.

Also Read: Mumbai Indians – Oval Invincibles: IPL 2025: రూ.658 కోట్లతో ముంబై ఇండియన్స్ కొత్త డీల్.. ఆ వాటా కొనుగోలు !

Advertisement

ఈ టోర్నీ ప్రారంభం కోసం అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. దీంతో ఈ టోర్నీ ప్రారంభ వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ టోర్నీ ఈవెంట్ కి ముందు భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ {Rohit Sharma} పాకిస్తాన్ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఐసీసీ టోర్నమెంట్ కి ముందు.. టోర్నీ లో పాల్గొనే జట్ల కెప్టెన్లు అందరూ ఫోటోషూట్ { photoshoot} కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంటుంది.

అనంతరం విలేకరుల సమావేశాన్ని నిర్వహిస్తారు. టోర్నమెంట్ ని అధికారికంగా నిర్వహించే దేశంలో ఈ కార్యక్రమం ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఇది ఆనవాయితీగా జరుగుతున్న ప్రక్రియ. అయితే ఈ టోర్నీకి ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కి ముందు జరిగే కెప్టెన్ ఫోటోషూట్ { photoshoot} ని పిసిబి రద్దు చేసింది. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్ సీజన్ జోరుగా సాగడం వల్లే ఈ ప్రీటోర్ని ఈవెంట్ ని రద్దు చేయాల్సి వచ్చిందని ఓ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారి తెలిపారు.

Advertisement

అయితే ఓపెనింగ్ సెర్మని మాత్రం ఫిబ్రవరి 16న లాహోర్ లో నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీంతో భారత కెప్టెన్ రోహిత్ శర్మ {Rohit Sharma} కరాచీలో జరగాల్సిన కెప్టెన్స్ సమావేశం కోసం వెళ్లడం లేదని తేలిపోయింది. ఇక ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లాండ్ తో ఐదు టి-20 ల సిరీస్ లో తలపడుతున్న విషయం తెలిసిందే. ఇది ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ జరగబోతోంది.

Also Read: IND vs ENG 4th T20I: నేడే 4వ టీ20… రింకూ, అర్షదీప్ రీ-ఎంట్రీ..షమీ ఔట్!

ఆ తర్వాత భారత జట్టు ఫిబ్రవరి 15న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం దుబాయ్ లో అడుగు పెట్టబోతోంది. ఈ టోర్నీలో భాగంగా భారత జట్టు తన తొలి మ్యాచ్ని ఫిబ్రవరి 20న దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్ తో ఆడబోతోంది. ఆ తర్వాత ఫిబ్రవరి 23న పాకిస్తాన్ తో భారత జట్టు అమీతుమీ తేల్చుకోనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కి ముందు కెప్టెన్ల ఫోటోషూట్ రద్దు అయ్యిందన్న వార్తతో అభిమానులు కొంతవరకు సంతోషిస్తున్నారు.

Related News

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

డ్రెస్సింగ్ రూంలో త‌న్నుకున్న పాకిస్తాన్ క్రికెట‌ర్లు..!

ఐర్లాండ్ చేతిలో టీమిండియానే వైట్ వాష్ అయింది, అందుకే పాకిస్తాన్ ఓడిపోతోంది

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

Big Stories

Advertisement
×