BigTV English

Rohit Sharma: రోహిత్ దెబ్బ అదుర్స్‌.. ఆ ఈవెంట్‌ రద్దు చేసుకున్న పాకిస్తాన్‌ !

Rohit Sharma: రోహిత్ దెబ్బ అదుర్స్‌.. ఆ ఈవెంట్‌ రద్దు చేసుకున్న పాకిస్తాన్‌ !

Rohit Sharma: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 20 నుండి ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. 1996 వన్డే ప్రపంచ కప్ తర్వాత పాకిస్తాన్ ఐసీసీ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి కావడం విశేషం. అయితే భద్రతా కారణాల దృశ్య టీమిండియా ఆ దేశానికి వెళ్లడం లేదు. భారత్ తనకు సంబంధించిన మ్యాచ్ లు అన్నింటిని దుబాయ్ వేదికగానే ఆడుతుంది. ఈ టోర్నీ ప్రారంభం కావడానికి చాలా రోజుల సమయం లేదు. ఈ మెగా ఈవెంట్ లో 8 టీమ్ లు పాల్గొనబోతున్నాయి.


Also Read: Mumbai Indians – Oval Invincibles: IPL 2025: రూ.658 కోట్లతో ముంబై ఇండియన్స్ కొత్త డీల్.. ఆ వాటా కొనుగోలు !

ఈ టోర్నీ ప్రారంభం కోసం అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. దీంతో ఈ టోర్నీ ప్రారంభ వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ టోర్నీ ఈవెంట్ కి ముందు భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ {Rohit Sharma} పాకిస్తాన్ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఐసీసీ టోర్నమెంట్ కి ముందు.. టోర్నీ లో పాల్గొనే జట్ల కెప్టెన్లు అందరూ ఫోటోషూట్ { photoshoot} కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంటుంది.


అనంతరం విలేకరుల సమావేశాన్ని నిర్వహిస్తారు. టోర్నమెంట్ ని అధికారికంగా నిర్వహించే దేశంలో ఈ కార్యక్రమం ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఇది ఆనవాయితీగా జరుగుతున్న ప్రక్రియ. అయితే ఈ టోర్నీకి ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కి ముందు జరిగే కెప్టెన్ ఫోటోషూట్ { photoshoot} ని పిసిబి రద్దు చేసింది. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్ సీజన్ జోరుగా సాగడం వల్లే ఈ ప్రీటోర్ని ఈవెంట్ ని రద్దు చేయాల్సి వచ్చిందని ఓ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారి తెలిపారు.

అయితే ఓపెనింగ్ సెర్మని మాత్రం ఫిబ్రవరి 16న లాహోర్ లో నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీంతో భారత కెప్టెన్ రోహిత్ శర్మ {Rohit Sharma} కరాచీలో జరగాల్సిన కెప్టెన్స్ సమావేశం కోసం వెళ్లడం లేదని తేలిపోయింది. ఇక ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లాండ్ తో ఐదు టి-20 ల సిరీస్ లో తలపడుతున్న విషయం తెలిసిందే. ఇది ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ జరగబోతోంది.

Also Read: IND vs ENG 4th T20I: నేడే 4వ టీ20… రింకూ, అర్షదీప్ రీ-ఎంట్రీ..షమీ ఔట్!

ఆ తర్వాత భారత జట్టు ఫిబ్రవరి 15న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం దుబాయ్ లో అడుగు పెట్టబోతోంది. ఈ టోర్నీలో భాగంగా భారత జట్టు తన తొలి మ్యాచ్ని ఫిబ్రవరి 20న దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్ తో ఆడబోతోంది. ఆ తర్వాత ఫిబ్రవరి 23న పాకిస్తాన్ తో భారత జట్టు అమీతుమీ తేల్చుకోనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కి ముందు కెప్టెన్ల ఫోటోషూట్ రద్దు అయ్యిందన్న వార్తతో అభిమానులు కొంతవరకు సంతోషిస్తున్నారు.

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×