Sahibzada Farhan: ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ (2026 Asian Games tournament) నేపథ్యంలో తాజాగా పాకిస్తాన్ క్రికెట్ జట్టును ప్రకటించింది PCB. మొత్తం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించారు. ఈ తరుణంలో పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (Sahibzada Farhan) కు కెప్టెన్సీ అప్పగించింది. ఇక సెప్టెంబర్ 19వ తేదీ నుంచి అక్టోబర్ మూడో తేదీ వరకు జపాన్ లోని ఐచి నాగోయాలో టి20 ఫార్మాట్ లో ఏషియన్ గేమ్స్ జరగనున్నాయి. అయితే తనకు కెప్టెన్సీ వచ్చిన నేపథ్యంలో పాకిస్తాన్ కొత్త కెప్టెన్ సాహిబ్జాదా ఫర్హాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కెప్టెన్సీలో పాకిస్తాన్ జట్టుకు రెండు నుంచి మూడు వరల్డ్ కప్ లు తీసుకువస్తానని స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో సాహిబ్జాదా ఫర్హాన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ (2026 Asian Games tournament) నేపథ్యంలో తనకు కెప్టెన్సీ రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (Sahibzada Farhan). పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తనును నమ్మి, కెప్టెన్సీ బాధ్యతలను ఇచ్చిందని వెల్లడించారు. ఇక పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నమ్మకాన్ని తాను కాపాడుకుంటానని… తన సత్తా చాటుతానని ప్రకటించారు. అందరిలాగా కాకుండా… పాకిస్తాన్ జట్టుకు వరుసగా విజయాలను అందిస్తూ కెప్టెన్ గా శాశ్వతంగా ఉంటానని వెల్లడించారు సాహిబ్జాదా ఫర్హాన్. ఆ అల్లా మీద ఒట్టేసి చెబుతున్నా… పాకిస్తాన్ కు మరో ఐదు నుంచి ఆరు సంవత్సరాలలో, కనీసం మూడు వరల్డ్ కప్ ట్రోఫీలను అందిస్తానని శపథం చేశారు.
ఇకపై ఇండియాతో జరిగా ఏ మ్యాచ్ అయినా.. పాకిస్తాన్ గెలిచేలా చర్యలు తీసుకుంటానని వ్యాఖ్యానించారు. ప్రతి మ్యాచ్ లోనూ టీమిండియాను ఓడించి తీరుతానని శపథం చేశారు సాహిబ్జాదా ఫర్హాన్ (Sahibzada Farhan). ఇన్ని రోజులు టీమిండియా తమపై గెలిచి.. ఓవరాక్షన్ చేసిందని ఆగ్రహించారు. ఇకపైన పరిస్థితి అలా ఉండబోదని వ్యాఖ్యానించారు. ప్రతి మ్యాచ్ లోను టీమిండియాను ఓడించడం జరుగుతుందన్నారు. త్వరలో జరగబోతున్న ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో మొదట టీమిండి అని ఓడించి తన ప్రతాపం ఏంటో చూపిస్తానని కూడా వ్యాఖ్యానించారు. దీంతో ఫర్హాన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అయితే సాహిబ్జాదా ఫర్హాన్ చేసిన వ్యాఖ్యలకు ఇండియన్ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. ఏషియన్ గేమ్స్ లో ఇండియాను ఓడించి చూపించాలని చాలెంజ్ విసురుతున్నారు. చేతకానీ దద్దమ్మలు ఇలాంటి స్టేట్ మెంట్స్ చేస్తూనే ఉంటారని సెటైర్లు పేల్చారు. ఇండియాలో చేతిలో ఎప్పుడు, ఎక్కడ మ్యాచ్ జరిగినా పాక్ ఓడిపోతుందంటున్నారు.