Abrar Ahmed – Kavya Maran: ఇంగ్లాండ్ వేదికగా ది 100 లీగ్ 2026 టోర్నమెంట్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. జులై 21వ తేదీన ప్రారంభమైన ఈ మెగా టోర్నమెంట్ ఆగస్టు 16వ తేదీ వరకు కొనసాగనుంది. అయితే ఈ ది 100 లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ కూడా భాగం అయ్యాడు. కావ్య పాప ఓనర్ గా వ్యవహరిస్తున్న సన్ రైజర్స్ లీడ్స్ జట్టులో అబ్రార్ అహ్మద్ ఆడుతున్నాడు. పాకిస్తాన్ క్రికెటర్ అయిన అబ్రార్ అహ్మద్ ను కొలుగోలు చేసినందుకు కావ్య పాప పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ అతన్ని సన్ రైజర్స్ లీడ్స్ జట్టు తరఫున ఆమె ఆడిస్తున్నారు. ఇక ఆమె పెట్టుకున్న నమ్మకానికి న్యాయం చేస్తూ సన్రైజర్స్ లీడ్స్ జట్టు తరఫున అబ్రార్ అహ్మద్ అద్భుతంగానే రాణిస్తున్నాడు.
Also Read : టెస్ట్ ప్లేయర్ అంటూ ట్రోల్స్..ఇచ్చిపడేసిన తిలక్..రెండో టీ20లోనూ టీమిండియా విజయం
ది 100 లీగ్ 2026 టోర్నమెంట్ కొనసాగుతోన్న నేపథ్యంలో కావ్య పాపకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. పాకిస్తాన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న నేషనల్ ఛాంపియన్స్ వన్డే కప్ ( Champions ODI Cup) త్వరలో జరగనున్న నేపథ్యంలో.. మిస్టరీస్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ను పక్కకు పెట్టింది PCB. ది 100 లీగ్ 2026 టోర్నమెంట్ జరుగుతున్న నేపథ్యంలో… అతడిని డిస్టర్బ్ చేయకూడదని నిర్ణయం తీసుకున్నారు. కావ్య పాపకు ఎలాంటి నష్టం జరగకుండా సన్ రైజర్స్ లీడ్స్ టోర్నమెంట్ మొత్తం ఆడేలా… నేషనల్ ఛాంపియన్స్ వన్డే కప్ ఆడించకుండా కీలక స్టెప్పు వేసింది PCB.
100 లీగ్ టోర్నమెంట్ లో అబ్రార్ అహ్మద్ ఆడితే, అతనికి అనుభవం పెరుగుతుంది. ఇంగ్లాండు లాంటి మైదానాలలో అబ్రార్ అహ్మద్ కు మంచి ప్రాక్టీస్ లభిస్తుంది. ఈ క్రమంలోనే అమ్రా రహమద్ను లైట్ తీసుకుంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. దీంతో కావ్య పాప పెట్టిన రూ.2.34 కోట్లు వర్త్ కానున్నాయి. కావ్య పాప కోసమే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో నెటిజెన్స్ పోస్టులు పెడుతున్నారు. బిసిసిఐ ని ఎదురించి మరి, పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ను కొనుగోలు చేసిన కావ్య పాపకు ఈ మాత్రం న్యాయం చేయకపోతే కరెక్ట్ కాదని భావించిందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
నేషనల్ ఛాంపియన్స్ వన్డే ట్రోఫీని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. 2027 మండే వరల్డ్ కప్ లో ప్లేయర్లను వన్డేలకు సిద్ధం చేసేందుకుగాను ఈ టోర్నమెంట్ జరుగుతోంది. ఈ టోర్నమెంట్ ఆగస్టు 11వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జరుగుతుంది. ఇందులో పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు సంబంధించిన ప్లేయర్ లందరూ పాల్గొంటారు.