E-Paper
Advertisement

స్పెషల్ సర్వీసుల పొడిగింపు.. ప్రయాణికులకు అదిరిపోయే న్యూస్ చెప్పిన సౌత్ సెంట్రల్ రైల్వే!

స్పెషల్ సర్వీసుల పొడిగింపు.. ప్రయాణికులకు అదిరిపోయే న్యూస్ చెప్పిన సౌత్ సెంట్రల్ రైల్వే!
Advertisement

Charlapalli Patna Special Trains: ప్రయాణికుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. చర్లపల్లి–పాట్నా మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్ల సేవలను మరోసారి పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు సెప్టెంబర్ నెల చివరి వరకు కొనసాగించనున్నట్లు తెలిపింది. దీంతో బీహార్, తెలంగాణ మధ్య ప్రయాణించే వారికి మరింత సౌకర్యం కలగనుంది.

ప్రయాణికుల రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో..

ప్రత్యేక రైళ్ల పొడిగింపునకు సంబంధించి రైల్వే అధికారులు తాజాగా కీలక ప్రకటన విడుదల చేశారు. ప్రయాణికుల రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ముఖ్యంగా పండుగలు, సెలవులు, ఉద్యోగాలు, ఎడ్యుకేషన్ కోసం ఈ మార్గంలో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను కొనసాగించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

ప్రత్యేక రైలు సర్వీసుల వివరాలు

Advertisement

* రైల్వే అధికారులు ప్రకటించిన వివరాల ప్రకారం, రైలు నెం. 03253 పాట్నా–చర్లపల్లి ప్రత్యేక రైలు సోమవారాలు, బుధవారాల్లో నడుస్తుంది. ఈ రైలుకు చెందిన మొత్తం 14 సర్వీసులను ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్ 16 వరకు పొడిగించారు.

* అటు రైలు నెం. 03254 చర్లపల్లి–పాట్నా ప్రత్యేక రైలు బుధవారాల్లో నడుస్తుంది. ఈ రైలుకు చెందిన ఏడు సర్వీసులు ఆగస్టు 5 నుంచి సెప్టెంబర్ 16 వరకు కొనసాగనున్నాయి.

Advertisement

*మరోవైపు రైలు నెం. 03255 చర్లపల్లి–పాట్నా ప్రత్యేక రైలు ప్రతి శుక్రవారం నడుస్తుంది. ఈ సర్వీసులను ఆగస్టు 7 నుంచి సెప్టెంబర్ 18 వరకు పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.

ప్రత్యేక రైళ్లలో ఏ క్లాస్ కోచ్ లు ఉంటాయంటే?

ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రత్యేక రైళ్లలో పలు రకాల క్లాస్ కోచ్‌లను తీసుకొచ్చారు. ఇందులో 3AC, 3AC ఎకానమీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. దీంతో అన్ని వర్గాల ప్రయాణికులు తమ అవసరానికి అనుగుణంగా టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్రత్యేక రైళ్ల పొడిగింపుతో చర్లపల్లి నుంచి పాట్నా, అలాగే పాట్నా నుంచి చర్లపల్లికి వెళ్లే ప్రయాణికులకు గణనీయమైన ఊరట లభించనుంది. ముఖ్యంగా రిజర్వేషన్ దొరకక ఇబ్బంది పడుతున్న వారికి ఇది ఉపయోగపడే అవకాశం ఉంది. ప్రత్యేక రైళ్ల షెడ్యూల్, స్టాపేజీలు, టికెట్ బుకింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను భారతీయ రైల్వే అధికారిక వెబ్‌ సైట్, ఐఆర్‌సీటీసీ ద్వారా తెలుసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. ముందే టిక్కెట్లు బుక్ చేసుకోవడం వల్ల ప్రయాణాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనసాగించే అవకాశం ఉంటుందన్నారు.

Read Also: 1,200 కి.మీ పూర్తి చేసిన హైడ్రోజన్ రైలు.. అసలు విషయం తెలిస్తే షాకవ్వాల్సిందే!

Related News

వైష్ణో దేవి యాత్రికులకు గుడ్ న్యూస్.. ఏకంగా 4 కొత్త వందే భారత్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

డిస్నీల్యాండ్ కు పోటెత్తుతున్న టూరిస్టులు, మ్యాటర్ ఏంటో తెలుసా?

ఆకాశంలో విమానం.. రెక్కపై బుసలు కొడుతున్న పాము.. నెట్టింట వీడియో వైరల్!

ప్రయాణికులకు అలర్ట్.. రైల్వేశాఖ కీలక నిర్ణయం.. ఆగస్టు 1 నుంచి కొత్త ‘తత్కాల్’ రూల్స్!

రైలు ఏసీ కోచ్‌లో ఓ ప్రయాణికుడు పూజలు.. తోటి ట్రావెలర్లు ఆందోళన, వీడియో వైరల్

మీ ప్రయాణాన్ని సులభతరం చేసే గూగుల్ మ్యాప్స్ ట్రిక్స్.. ప్రతి ట్రావెలర్ ఇవి తెలుసుకోవడం తప్పనిసరి

పోచంపల్లి ఇక్కత్‌కు ప్రధాని ప్రశంసలు.. అసలు ఈ చేనేతలో ఉన్న మ్యాజిక్ ఏంటి?

Big Stories

Advertisement
×