Sanjay Manjrekar: శ్రీలంక క్రికెటర్లతో 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ గొడవ పడిన సంగతి తెలిసిందే. శ్రీలంక వర్సెస్ టీమిండియా మధ్య ట్రై సిరీస్ లో భాగంగా మొన్న మ్యాచ్ జరిగింది. ఇందులో సూపర్ ఓవర్ జరగగా ఇందులో టీమిండియా చిత్తుగా ఓడింది. అయితే మ్యాచ్ ఓడిపోయిన అనంతరం శ్రీలంక ప్లేయర్లతో వైభవ్ సూర్యవంశీ గొడవపడ్డాడు. ఈ సంఘటనలో శ్రీలంక క్రికెటర్లది తప్పిదం అంటూ ఇండియన్ క్రికెటర్లు వాదిస్తుంటే.. మరికొంతమంది శ్రీలంక మాజీలు మాత్రం, వైభవ్ సూర్యవంశీని ( VAIBHAV SOORYAVANSHI) విలన్ చేస్తున్నారు. అయితే ఈ వివాదంపై టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ (Sanjay Manjrekar) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తానే లిస్ట్ ఏ టీం ఇండియా మేనేజర్ లేదా కోచ్ అయి ఉంటే.. వైభవ్ చెంపలు రెండు వాయించే వాడిని అంటూ బాంబు పేల్చారు. మెడలు పట్టుకొని టీమిండియా నుంచి గెంటేసే వాడిని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో సంజయ్ మంజ్రేకర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ట్రై సిరీస్ లో భాగంగా శ్రీలంక వర్సెస్ టీమిండియా మధ్య మొన్న మ్యాచ్ జరగగా.. వైభవ్ అనవసరంగా వివాదంలో చిక్కుకున్నాడు. శ్రీలంక క్రికెటర్లు రెచ్చగొడితే.. సహనం కోల్పోయిన వైభవ్, ప్రత్యర్థి కాలర్లు పట్టుకున్నాడు. శ్రీలంక గడ్డపై అక్కడి ప్లేయర్లకు వార్నింగ్ ఇచ్చాడు వైభవ్. ఈ క్రమంలో సోషల్ మీడియాలో వైభవ్ సూర్యవంశీ యాటిట్యూడ్ పై విమర్శలు వస్తున్నాయి. వైభవ్ సూర్య వంశీ మళ్లీ క్రికెట్ ఆడకుండా బ్యాన్ విధించాలని పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు సైతం డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో వైభవ్ సూర్య వంశీకి సపోర్ట్ గా నిలవాల్సిన మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ దుర్మార్గంగా వ్యవహరించాడు. వైభవ్ సూర్య వంశీ తప్పు ఉన్నట్లుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
తానే టీమిండియా ఏ జట్టు మేనేజర్ లేదా కోచ్ అయి ఉంటే… వెంటనే వైభవ్ సూర్య వంశీని జట్టులో నుంచి పీకి పడేసే వాడిని అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మొదట రెండు చెంపలు వాయించే వాడినంటూ హాట్ కామెంట్స్ చేశారు. క్రికెట్ పైన దృష్టి పెట్టకుండా.. గొడవలు పెట్టుకోవడం ఏంటంటూ నిలదీశారు. ఇలా అయితే కెరీర్ ముందుకు వెళ్లడం కష్టమేనని బాంబు పేల్చారు. అయితే సంజయ్ మంజ్రేకర్ చేసిన వ్యాఖ్యలపై ఇండియన్ క్రికెటర్లు ఫైర్ అవుతున్నారు. వీడికి ఇండియా తరఫున ఆడే ఛాన్స్ వచ్చినప్పుడు… పెద్దగా పీకిందేమీ లేదు, కానీ ఇప్పుడు ఆడేవాడిని అనవసరంగా గెలుకుతున్నాడని మండిపడుతున్నారు. ఇండియా వాళ్లకు సపోర్ట్ గా నిలవకుండా…. ప్రత్యర్థి జపం చేస్తున్నాడని సీరియస్ అవుతున్నారు ఫ్యాన్స్.