Shahid Afridi: ఇండియాలో పెట్రోల్ కొరత ఉందని, వాహన దారులు చాలా ఇబ్బందులు పడుతున్నారని పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే మొహ్సిన్ నఖ్వీ చేసిన వ్యాఖ్యలకు పాకిస్తాన్ నుంచే స్ట్రాంగ్ కౌంటర్ వస్తోంది. ఇప్పటికే ఈ అంశంపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ( Shoaib Akthar) స్పందించాడు. లేటెస్ట్ గా మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది కూడా రియాక్ట్ అయ్యాడు. మొహ్సిన్ నఖ్వీ (Mohsin Naqvi) చేతకాని దద్దమ్మ అంటూ మండిపడ్డారు. ఇండియా జోలికి వెళ్లకూడదని.. అనవసరంగా పరువు తీసుకోకూడదని హెచ్చరించారు. ఇండియాతో పాకిస్తాన్ కు ఎలాంటి పోలిక లేదని కౌంటర్ ఇచ్చారు షాహిద్ అఫ్రిది. దీంతో షాహిద్ అఫ్రిది ( Shahid Afridi) చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Also Read: Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వైభవ్ కు కూడా లవ్ స్టోరీ…ఔట్ కాగానే కన్నీళ్లు పెట్టుకుంది కదరా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ చాలా రసవత్తరంగా కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంటును హైలెట్ చేసే ప్రయత్నం చేశాడు మొహ్సిన్ నఖ్వీ. ప్రేక్షకులు లేకుండా నిర్వహిస్తున్న PSL చాలా సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతుందని పేర్కొన్నాడు. కానీ ఇండియాలో మాత్రం దరిద్రమైన పరిస్థితులు ఉన్నాయని బాంబు పేల్చాడు మొహ్సిన్ నఖ్వీ. ప్రేక్షకులతోనే ఐపీఎల్ నిర్వహిస్తున్న ఇండియా, వాహన దారులకు మాత్రం పెట్రోల్ అలాగే డీజిల్ అందించలేక విఫలమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
అయితే మొహ్సిన్ నఖ్వీ చేసిన ఈ వ్యాఖ్యలపై తాజాగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది మండిపడ్డారు. ఇండియాను విమర్శించే ముందు పాకిస్తాన్ గురించి ఒకసారి ఆలోచించు.. మన దేశంలో పెట్రోల్ ధరలు ఆకాశాన్ని ఉంటాయని మండిపడ్డారు. 200% ధరలు పాకిస్తాన్ లో పెరిగితే, ఇండియాలో మాత్రం పెట్రోల్ ధరలు పెరగలేదని సీరియస్ అయ్యారు షాహిద్ అఫ్రిది. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని, మొహ్సిన్ నఖ్వీ మాట్లాడాలని షాహిద్ అఫ్రిది షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ప్రేక్షకులతో కలకలలాడుతోందని.. కానీ పాకిస్తాన్ సూపర్ లీగ్ లో మాత్రం ప్రేక్షకులు లేక విలవిలలాడుతోందని ఆగ్రహించారు. దమ్ముంటే, ప్రేక్షకులతో పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు షాహిద్ అఫ్రిది.
పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కూడా ఇదే తరహాలో స్పందించాడు. ఇండియాలో పెట్రోల్ అలాగే డీజిల్ సమస్యలు ఎక్కడ లేవని.. తప్పుడు ప్రచారం చేయకూడదని మండిపడ్డారు. పాకిస్తాన్ లో అత్యంత దారుణమైన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో పక్క దేశం గురించి నీకెందుకు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు షోయబ్ అక్తర్.
Also Read: Akhtar On Naqvi: భూతద్దాలు పెట్టుకోని చూడు..పెట్రోల్ విషయంలో ఇండియా కాలి గోటికి కూడా పాక్ సరిపోదు
🚨 SHAHID AFRIDI ANGRY ON MOHSIN NAQVI 🚨
Mohsin Naqvi Said 🗣️,
"We always talk about others, but we don’t look at what we ourselves are doing. Many people are commenting that in some countries there is no petrol and people are standing in long queues for it, while we don’t… pic.twitter.com/SVm09WDr3B
— lndian Sports Netwrk (@IS_Netwrk29) April 15, 2026