E-Paper
Advertisement

Shahid Afridi On Ind Vs Eng: అంతా ఫిక్సింగే, పిచ్ క్యూరేట‌ర్ ను గంభీర్ బెదిరించాడు…ఇక ఇంగ్లాండ్ ప్లేయ‌ర్ల‌ కొంప కొల్లేరే

Shahid Afridi On Ind Vs Eng: అంతా ఫిక్సింగే, పిచ్ క్యూరేట‌ర్ ను గంభీర్ బెదిరించాడు…ఇక ఇంగ్లాండ్ ప్లేయ‌ర్ల‌ కొంప కొల్లేరే

Shahid Afridi On Ind Vs Eng:  టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ లో ( T20 World Cup 2026 tournament )  భాగంగా ఇవాళ రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ రెండో సెమీ ఫైనల్ లో ఇంగ్లాండ్ అలాగే టీమిండియా ( Team India vs England 2nd Semi-Final) తలపడతాయి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రీది ( shahid afridi ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ మ్యాచ్ ఫిక్స్ అయిందని.. కచ్చితంగా ఇండియానే గెలుస్తుందని బాంబు పేల్చారు. నిన్ననే ముంబై వాంఖడే ( Wankhede Stadium, Mumbai)  పిచ్ క్యూరేటర్ ను గంభీర్ ( Gautam Gambhir) బెదిరించాడని సంచలన ఆరోపణలు చేశారు. టీమిండియాకు అనుకూలంగా పిచ్ రెడీ చేశారని కూడా పేర్కొన్నాడు. ఈ లెక్కన ఇంగ్లాండ్ పై రెండవ సెమీ ఫైనల్ లో టీమిండియా గెలవడం గ్యారెంటీ అంటూ కారు కూతలు కూసాడు షాహిద్ ఆఫ్రీది.

Also Read: SA vs NZ 1st Semi-Final: టీమిండియా కోసం జై షా కుట్ర‌లు…ద‌క్షిణాఫ్రికాను కావాల‌నే ఇంటికి పంపార‌ని ట్రోల్స్ !

అంతా ఫిక్సింగే, పిచ్ క్యూరేట‌ర్ ను గంభీర్ బెదిరించాడు

టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం రెండో సెమీ ఫైనల్ జరగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రీది విషం కక్కాడు. మరోసారి ఈ మ్యాచ్ ఫిక్సింగ్ అయిందని బాంబు పేల్చాడు. పిచ్ క్యూరేటర్ ను టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ బెదిరించాడని… టీమిండియా కు అనుకూలంగా పిచ్ రెడీ చేయించాడని ఆరోపణలు చేశాడు షాహిద్ ఆఫ్రీది. గౌతమ్ గంభీర్ బెదిరించిన ఫోటోలు కూడా ఇప్పటికీ ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయని పేర్కొన్నాడు. దీన్నిబట్టి చూస్తే రెండో సెమీ ఫైనల్ లో ఫిక్సింగ్ జరిగిందని షాకింగ్ కామెంట్స్ చేశారు షాహిద్ ఆఫ్రీది. ఈ మ్యాచ్ పక్క ఫిక్స్ అయినట్లే కనిపిస్తోంది.. కాబట్టి ఇండియా ఫైనల్ కు వెళ్లడం గ్యారంటీ అన్నారు. దీంతో షాహిద్ ఆఫ్రీది చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ పై మహమ్మద్ అమీర్ సంచలనం

టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ రెండో సెమీఫైనల్ పై మహమ్మద్ అమీర్ కూడా మరోసారి స్పందించారు. టీమిండియాపై ఖచ్చితంగా ఇంగ్లాండ్ గెలుస్తుందని పేర్కొన్నారు. ఇంగ్లాండ్ ఫైనల్ కు వెళ్లడం గ్యారంటీ అన్నారు. ఎన్ని కుట్రలు చేసినా టీమిండియా ఓడిపోయి ఇంటిదారి పడుతుందని వార్నింగ్ ఇచ్చారు. దీంతో మహమ్మద్ అమీర్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అంతకు ముందు సెమీస్ కు టీమిండియా రాబోదని వ్యాఖ్యానించిన మహమ్మద్ అమీర్.. ఇప్పుడు ఫైనల్ కు రాదని పేర్కొన్నాడు.

Also Read: Pak Players: ఆయ‌న‌వి ఒంటెద్దు పోక‌డులు, కీలు బొమ్మ‌లాగా ఆడుకున్నాడు..కోచ్ పై ఫిర్యాదు చేసిన‌ పాకిస్తాన్ ప్లేయ‌ర్లు

 

 

 

Related News

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Tanveer Ahmed: విరాట్ కోహ్లీ మ‌గాడైతే, పాకిస్తాన్ పిచ్ ల‌పై ఆడి చూపించాలి

లాహోర్ గ‌డ్డ‌పై విరాట్ కోహ్లీ ప్లకార్డులు…గూస్ బంప్స్ రావాల్సిందే

Big Stories

×