E-Paper
Advertisement

Shahid Afridi: ఫైన‌ల్స్ లో టీమిండియా చిత్తుగా ఓడిపోవాలి..ఒకవేళ గెలిస్తే క్రికెట్ సంక‌నాకిపోతుంది

Shahid Afridi: ఫైన‌ల్స్ లో టీమిండియా చిత్తుగా ఓడిపోవాలి..ఒకవేళ గెలిస్తే క్రికెట్ సంక‌నాకిపోతుంది

Shahid Afridi:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) ఫైనల్ మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ ఫైనల్ మ్యాచ్ లో ఇండియా, న్యూజిలాండ్ జట్టు ( Team India vs New Zealand, Final ) తలపడతాయి. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ( Narendra Modi Stadium, Ahmedabad ) వేదికగా ఈ రెండు జట్ల మధ్య బిగ్ ఫైట్ ఉండనుంది. రాత్రి 7 గంటలకు ఈ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇలాంటి నేపథ్యంలో టీమిండియా ఓడిపోవాలని పాకిస్తాన్ దేశంలో పూజలు చేస్తున్నారు కొంతమంది దుర్మార్గులు. న్యూజిలాండ్ గెలవాలని కోరుతున్నారు. అయితే తాజాగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రీది ( Shahid Afridi) కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ఫైనల్స్ లో టీమిండియా అస్సలు గెలవకూడదని కోరారు. ఒకవేళ ఇండియా టైటిల్ గెలిస్తే క్రికెట్ సంక నాకి పోతుందని బాంబు పేల్చారు. బీసీసీఐకి మరింత పొగరు పొగరు పెరుగుతుందని ఫైర్ అయ్యారు.

Also Read: Shaheen Afridi: అల్లాహ్ మీద ఒట్టు..2027 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్స్ లో ఇండియాను ఓడించ‌క‌పోతే పేరు మార్చుకుంటా

టి20 వరల్డ్ కప్ టైటిల్ ఇండియా గెలువకూడదు

టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఇవాళ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ గెలవాలని.. టీమిండియా చిత్తుగా ఓడిపోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రీది ( Shahid Afridi). ఒకవేళ ఇండియా టైటిల్ గెలిస్తే మాత్రం బీసీసీఐ కి పొగరు మరింత పెరుగుతుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి దగ్గర ఇప్పటికే కోట్లాది డబ్బులు ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్ప‌టికే టీమిండియా చాలా ట్రోఫీలు ఉన్నాయ‌న్నారు. ఇక‌ ఇప్పుడు మళ్లీ టైటిల్ గెలిస్తే, ప్రపంచ క్రికెట్ ను బీసీసీఐ (BCCI ) శాసిస్తుందని ఫైరయ్యారు. దీనివల్ల క్రికెట్ పూర్తిగా సంకనాకి పోతుందని షాహిద్ ఆఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. డబ్బుల మదంతో క్రికెట్ ను సర్వనాశనం చేస్తుందని బిసిసిఐ పై మండిపడ్డారు. ఇప్ప‌టికే ఐపీఎల్ లాంటి ఈవెంట్స్ నిర్వ‌హించి, ప్లేయ‌ర్ల‌ను గ్రిప్ లో పెట్టుకుంద‌ని బీసీసీఐపై ఆరోప‌ణ‌లు చేశారు షాహిద్ ఆఫ్రీది ( Shahid Afridi).

అల్లా సాక్షిగా టీమిండియా ఓడిపోతుంది – తన్వీర్ అహ్మద్

అల్లా మీద ఒట్టు టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో చిత్తుగా ఓడిపోతుందని పాకిస్తాన్ మాజీ ఆటగాడు తన్వీర్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యూజిలాండ్ కు అల్లా అండగా నిలుస్తాడని.. ఫైనల్స్ ఆ జట్టు గెలుస్తుందని వివరించారు. టీమిండియా ఓడిపోయేలా పాకిస్తాన్లో అందరూ పూజలు చేస్తున్నారని వెల్లడించారు. ఒకవేళ టీమిండియా ఫైనల్ మ్యాచ్లో గెలిస్తే తాను పాకిస్తాన్ లో బట్టలు లేకుండా తిరుగుతాను అని కూడా శపథం చేశాడు తన్వీర్ అహ్మద్.

Also Read: Tanveer Ahmed: 15వ‌ ఓవర్ నుంచే ఫిక్సింగ్…క్యూరేటర్ మెడ‌పై క‌త్తి పెట్టి, పిచ్ అనుకూలంగా జై షా మార్చుకున్నాడు

 

Related News

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Tanveer Ahmed: విరాట్ కోహ్లీ మ‌గాడైతే, పాకిస్తాన్ పిచ్ ల‌పై ఆడి చూపించాలి

లాహోర్ గ‌డ్డ‌పై విరాట్ కోహ్లీ ప్లకార్డులు…గూస్ బంప్స్ రావాల్సిందే

Big Stories

×