E-Paper
Advertisement

Shoaib Akhtar On PCB: ఒరేయ్ ద‌ద్ద‌మ్మ‌ల్లారా..ఇండియాతో పెట్టుకోవ‌ద్దు, మాడిపోతారు.. అన్ని మూసుకుని మ్యాచ్ ఆడండి

Shoaib Akhtar On PCB: ఒరేయ్ ద‌ద్ద‌మ్మ‌ల్లారా..ఇండియాతో పెట్టుకోవ‌ద్దు, మాడిపోతారు.. అన్ని మూసుకుని మ్యాచ్ ఆడండి
Advertisement

Shoaib Akhtar On PCB:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026) నేపథ్యంలో ఇండియాతో జరిగే మ్యాచ్ ను పాకిస్తాన్ బహిష్కరించడం పై వివాదం రాజుకంటోంది. పాకిస్తాన్ ఇలా అర్ధాంతరంగా మ్యాచ్ నుంచి తప్పుకోవడంపై తీవ్రస్థాయిలో విమర్శలు కూడా వస్తున్నాయి. పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు సైతం.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ( Shoaib Akhtar) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియాతో మ్యాచ్ బహిష్కరించడం చాలా తప్పుడు నిర్ణయం అంటూ ఫైర్ అయ్యారు. అసలు ఇండియాతో పాకిస్తాన్ పెట్టుకోకూడదని చురకలు అంటించారు. ఇలా ఐసీసీ ( ICC) ఈవెంట్స్ లో వ్యవహరిస్తే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీవ్రంగా నష్టపోతుందని హెచ్చరించారు షోయబ్ అక్తర్. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: Kevin Pietersen-Mohsin Naqvi: పాకిస్తాన్ కు సిగ్గుందా ? మ‌రీ..ఫైన‌ల్స్ లో టీమిండియాతో ఆడాల్సి వ‌స్తే, ఏం పీకుతారు? రెచ్చిపోయిన‌ పీట‌ర్స‌న్

ఇండియా తోనే పాకిస్తాన్ కు అవసరం.. అన్ని మూసుకొని ఆడండి

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఫిబ్రవరి 15వ తేదీన ఇండియాతో జరిగే మ్యాచ్లో కచ్చితంగా పాకిస్తాన్ ఆడాలని మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలా ఆడకపోతే ఇండియాను చూసి పాకిస్తాన్ భయపడి పారిపోయిందని ట్రోలింగ్ చేయడం గ్యారంటీ అంటూ హితువు పలికారు. ఎప్పుడైనా ఇండియాతోనే పాకిస్తాన్ కు అవసరం ఉంటుంది.. పాకిస్తాన్ తో ఇండియాకు ఎలాంటి అవసరం ఉండబోదు అంటూ గుర్తు చేశారు. అలాగే ఐసీసీ నుంచి వచ్చే నిధులు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు ( PCB ) చాలా అవసరమని వెల్లడించారు షోయబ్ అక్తర్.

ఈ విషయాలను గుర్తు పెట్టుకొని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ( PCB ) ముందుకు సాగాలని కోరారు. లేకపోతే అడుక్కు తింటారని హెచ్చరించారు. అన్ని మూసుకొని ఫిబ్రవరి 15వ తేదీన ఇండియాతో మ్యాచ్ ఆడండి అంటూ సూచనలు చేశారు షోయబ్ అక్తర్. అలా ఆడకపోతే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అప్పుల్లో కూరుకుపోవడం గ్యారంటీ అన్నారు. మరి దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అలాగే అక్కడి ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

పాకిస్తాన్ ఆడకపోతే నష్టం ఎంత ?

Advertisement

ఇండియాతో ఫిబ్రవరి 15వ తేదీన పాకిస్తాన్ మ్యాచ్ ( Team India Vs Pakistan Match) ఆడకపోతే దాదాపు 4500 కోట్ల వరకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని నేషనల్ మీడియాలో కథనాలు వెలుబడుతున్నాయి. బ్రాడ్ కాస్టర్లు, ఐసీసీ ఇతర రంగాల వారికి ఈ నష్టం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ( Team India Vs Pakistan ) చూసే అభిమానులు కూడా తీవ్రంగా నిరాశ చెందే ఛాన్స్ ఉంటుంది. ఇది ప్రపంచకప్ పైన ప్రభావం చూపిస్తుందని హెచ్చరిస్తున్నారు.

 

Also Read: Danish Kaneria: టీమిండియా అంటే నిద్ర‌లో కూడా ఉలిక్కిప‌డుతున్నారు..ఫైన‌ల్స్ ఆడాల్సి వ‌స్తే పారిపోతారా ?

 

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×