E-Paper
Advertisement

Shoaib Akhtar: క్రికెట్ మానేసి గాజులు వేసుకోండి..ఇక‌పై టీమిండియాపై ప‌డి ఏడ‌వ‌కండి రా..అక్త‌ర్ సంచ‌ల‌నం !

Shoaib Akhtar: క్రికెట్ మానేసి గాజులు వేసుకోండి..ఇక‌పై టీమిండియాపై ప‌డి ఏడ‌వ‌కండి రా..అక్త‌ర్ సంచ‌ల‌నం !
Advertisement

Shoaib Akhtar: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( ICC Men’s T20 World Cup 2026)  నేపథ్యంలో పాకిస్తాన్ ( Pakistan) పరిస్థితి దారుణంగా తయారైంది. ఇంగ్లాండ్ చేతిలో ఓడిన పాకిస్తాన్‌, సెమీ ఫైనల్ వెళ్లే దారులు మూసుకుపోయాయి. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ జట్టుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ( Shoaib Akhtar). ఇంగ్లాండ్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోవడం అత్యంత అవమానకరం అంటూ వ్యాఖ్యానించారు షోయబ్ అక్తర్. క్రికెట్ మానేసి, ఆడవాళ్ళ లాగా గాజులు వేసుకోండి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడూ కూడా టీమిండియాపై ఏడవటం కాదు.. వాళ్లు సాధించిన ట్రోఫీలను చూడండి అంటూ నిప్పులు చెరిగారు. ఇప్పటికే టీమిండియా చాలా ఐసీసీ టోర్నమెంట్లు గెల్చుకుంది… మరి పాకిస్తాన్ ఏం పీకింది ? అంటూ ఫైర్ అయ్యారు షోయబ్ అక్తర్. దీంతో షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ గా మారాయి.

Also Read: England vs Pakistan: సెంచ‌రీతో ఇర‌గదీసిన బ్రూక్‌, సెమీ ఫైన‌ల్ కు ఇంగ్లాండ్‌..టోర్న‌మెంట్ నుంచి పాకిస్తాన్ ఔట్ !

క్రికెట్ మానేసి గాజులు వేసుకోండి..ఇక‌పై టీమిండియాపై ప‌డి ఏడ‌వ‌కండి

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( ICC Men’s T20 World Cup 2026) సూపర్ 8 లో భాగంగా ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మంగళవారం మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ రెండు వికెట్ల తేడాతో ఓడిపోయింది. పాకిస్తాన్ నూట అరవై ఐదు పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండు ముందు ఉంచింది. అయితే ఈ లక్ష్యాన్ని 19.1 ఓవర్లలోనే ఊది పడేసింది ఇంగ్లాండ్. దీంతో రెండు వికెట్ల తేడాతో పాకిస్తాన్ జట్టును చిత్తు చేసి సెమీ ఫైనల్ కు దూసుకు వెళ్ళింది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ సెమీఫైనల్ వెళ్లే దారులు అన్నీ మూసుకుపోయాయి.

అయితే ఇదే అంశంపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఐసీసీ టోర్నమెంట్స్ లో టీమిండియా అద్భుతంగా రాణిస్తూ ఉంటే… పాకిస్తాన్ మాత్రం చేతకాని దద్దమ్మ లాగా వ్యవహరిస్తుందని నిప్పులు చెరిగారు. ప్రతిసారి అవమానకర రీతిలో ఓడిపోయి ఇంటిదారి పడుతోందని మండిపడ్డారు. ముఖ్యంగా పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ పైన కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు షోయబ్ అక్తర్. సల్మాన్ లో కెప్టెన్సీ లక్షణాలు ఒక్కటి కూడా లేవని మండిపడ్డారు. అతడు కెప్టెన్ మెటీరియల్ కాదని విమర్శలు చేశారు షోయబ్ అక్తర్. ఇలా అయితే ఛాంపియన్ కావడం కష్టమేనని చురకలు అంటించారు.

పాక్ కెప్టెన్ స‌ల్మాన్ అలీ ఫ్యామిలీకి వేధింపులు

Advertisement

ఇంగ్లాండ్ చేతిలో ఓడిన పాకిస్తాన్‌, సెమీ ఫైనల్ వెళ్లే దారులు మూసుకుపోయాయి. ఇలాంటి నేప‌థ్యంలో పాకిస్తాన్ కెప్టెన్ స‌ల్మాన్ అలీ భార్య‌, కొడుకుపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు పాక్ ఫ్యాన్స్‌. నీ పెళ్లాన్ని రేప్ చేస్తామ‌ని, కొడుకును చంపేస్తామ‌ని హెచ్చ‌రిస్తున్నారు.

Also Read:  Indian Team Semi final Qualification: టీమిండియా సెమీ ఫైన‌ల్ కు చేరాలంటే ఒక్క‌టే మార్గం..వ‌ర్షం ప‌డాల‌ని కొబ్బ‌రికాయ‌లు కొట్టాల్సిందే

 

 

 

 

 

Related News

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

Big Stories

Advertisement
×