E-Paper
Advertisement

Shreyas Iyer ICU: ఐసీయూలో శ్రేయాస్ అయ్యర్..రెండు రోజులుగా తీవ్ర ర‌క్త స్రావం ?

Shreyas Iyer ICU: ఐసీయూలో శ్రేయాస్ అయ్యర్..రెండు రోజులుగా తీవ్ర ర‌క్త స్రావం ?
Advertisement

Shreyas Iyer ICU: టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడవ వన్డే సందర్భంగా శ్రేయాస్ అయ్యర్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం శ్రేయాస్ అయ్యర్ ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం అందుతోంది. గత రెండు రోజులుగా ఐసీయూలోనే శ్రేయాస్ అయ్యర్ ఉన్నాడట. ఆస్ట్రేలియా ఆటగాడు అలెక్స్ కేరీ క్యాచ్ పట్టే క్రమంలో బలంగా నేలపై పడిపోయాడు శ్రేయాస్ అయ్యర్. ఈ నేపథ్యంలోనే శ్రేయాస్ అయ్యర్ పక్కటెముకలు విరిగినట్లు సమాచారం అందుతోంది. ఈ గాయం నేపథ్యంలో అంతర్గత రక్తస్రావం జరిగినట్లు చెబుతున్నారు. దీంతో సిడ్నీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శ్రేయాస్ అయ్యర్ చికిత్స పొందుతున్నాడట. రెండు రోజుల నుంచి అతన్ని ఐసీయూలోనే ఉంచారట వైద్యులు. శ్రేయాస్ అయ్యర్ హెల్త్ అప్డేట్ గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: Rohit Sharma ODI Ranking: 38 ఏళ్లలో నం.1 ర్యాంక్.. గంభీర్ కాదు, వాడి అమ్మ మొగుడు కూడా రోహిత్‌ ను ఆపలేడు.. 2027 వరల్డ్ కప్ లోడింగ్

ఐసీయూలో శ్రేయాస్ అయ్యర్

Advertisement

ఆస్ట్రేలియా వర్సెస్ టీమ్ ఇండియా ( Australia vs India, 3rd ODI ) మధ్య జరిగిన మూడవ వన్డేలో తీవ్రంగా గాయపడిన శ్రేయాస్ అయ్యర్ ( Shreyas Iyer ) ప్రస్తుతం ఐసీయూలో ఉన్న వార్త బయటకు వచ్చింది. దీంతో ఆయన అభిమానులు టెన్షన్ పడుతున్నారు. శ్రేయాస్ అయ్యర్ కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐసీయూలో ఉన్న వార్త తెలియగానే ఆస్ట్రేలియా కు శ్రేయాస్ అయ్యర్ ఫ్యామిలీ వెళ్లినట్లు సమాచారం. కుటుంబ సభ్యులు దగ్గర ఉండాలన్న నేపథ్యంలో వాళ్లను ఆస్ట్రేలియాకు పంపించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి ( Board of Control for Cricket in India). ప్రస్తుతం వైద్యులు అయితే క్రిటికల్ గా పరిస్థితి ఉందని చెబుతున్నారు. ప్రక్కటెముకల దగ్గర రక్తస్రావం రావడంతో పరిస్థితి విషమించింది అని చెబుతున్నారు. అయితే శ్రేయాస్ అయ్యర్ ఐసీయూలో ఉన్న నేపథ్యంలో వెంటనే కోలుకోవాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.

శ్రేయస్ అయ్యర్ హెల్త్ ఇష్యూ పై బీసీసీఐ కీలక ప్రకటన

ఐసీయూలో ఉన్న శ్రేయాస్ అయ్యర్ హెల్త్ విషయంపై తాజాగా కీలక ప్రకటన చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి ( Board of Control for Cricket in India). శ్రేయాస్ అయ్యర్ ఐసీయూలో ఉన్నది వాస్తవమేనని తెలిపింది. ఇండియా నుంచి ప్రత్యేక వైద్యుల బృందాన్ని కూడా సిడ్నికి పంపించినట్లు వెల్లడించింది. శ్రేయస్ అయ్యర్ కు ఎలాంటి హాని జరగకుండా అన్ని దగ్గరుండి చూసుకుంటున్నట్లు తెలిపింది. శ్రేయాస్ అయ్యర్ ను కోలుకునేంతవరకు తమ బాధ్యత ఉంటుందని ప్రకటన విడుదల చేసింది. ఇది ఇలా ఉండ‌గా, టీమిండియా వ‌ర్సెస్ ఆసీస్ వ‌న్డే సిరీస్ లో శ్రేయాస్ అయ్యర్ కు వైస్ కెప్టెన్సీ ఇచ్చారు.

Advertisement

Also Read: Australian women cricketers: ఆస్ట్రేలియా మహిళల జట్టును గెలికిన వాడికి థర్డ్ డిగ్రీ.. కాళ్లు, చేతులు విరగ్గొట్టారు.. నడవలేని పరిస్థితి

Related News

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

Big Stories

Advertisement
×