BigTV English

ENG Vs IND 5th Test : ఐదో టెస్ట్.. ఇంగ్లాండ్ ఆటగాళ్లతో పాటు సిరాజ్ కూడా తలు వైట్ బ్యాండ్..!

ENG Vs IND 5th Test : ఐదో టెస్ట్.. ఇంగ్లాండ్ ఆటగాళ్లతో పాటు సిరాజ్ కూడా తలు వైట్ బ్యాండ్..!

ENG Vs IND 5th Test :  టీమిండియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య లండన్ లోని ఓవల్ వేదికగా ప్రస్తుతం 5వ టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే.  ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 224 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ జట్టు 247 పరుగులు చేసింది. మ్యాచ్ రెండో రోజు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ గ్రాహం థోర్ప్ మతికి నివాళిగా..  ఇంగ్లాండ్ క్రికెటర్లందరూ అతనికి గుర్తుగా వైట్ బ్యాండేజ్ ధరించారు. వారితో పాటు టీమిండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్ కూడా తలకు వైట్ బ్యాండెజ్ ధరించడం విశేషం. టీమిండియా బౌలింగ్ చేసిన సమయంలో  మహమ్మద్ సిరాజ్ కూడా బ్యాండ్ ధరించాడు.


Also Read : Pakistan Name Banned: పాకిస్తాన్ ప్లేయర్లకు ఎదురు దెబ్బ.. PCB షాకింగ్ నిర్ణయం

తలకు వైట్ బ్యాడ్ పెట్టుకున్న సిరాజ్ 


ఇటీవల ఓ ఫుట్ బాల్ క్రికెటర్ మరణిస్తే కూడా స్టేడియంలో అతనికి సంతాపం ప్రకటించాడు సిరాజ్. తన మనస్తత్వాన్ని చాటి చెబుతున్నాడు. ఒకవేళ గ్రాహం థోర్ప్ ఉండి ఉంటే.. ఆగస్టు 01వ తేదీ నాటికి 56 సంవత్సరాలు పడేవి. గత ఆగస్టులో సర్రెలోని రైల్వే స్టేషన్ లో రైలు ఢీ కొని మరణించిన బ్యాటర్ ను గుర్తుంచుకోవడానికి.. అతని కుటుంబం, స్నేహితులు, సహచరులు ఓవల్ లో ఏ డే ఫర్ థోర్పీ ని జరుపుకున్నారు. ఇంగ్లాండ్ క్రికెటర్.. ఎడమచేతి వాటం ఆటగాడు. 1993 నుంచి 2025 వరకు 100 టెస్ట్  మ్యాచ్ ల్లో 44.66 సగటుతో 6,744 టెస్టు పరుగులు చేశాడు.  శిక్షణ సమయంలో ఆటగాళ్లు థోర్ప్ సిల్హౌట్.. అతని తొలి అక్షరాలతో హెడ్ బ్యాండ్ లను ధరించారు. అతని భార్య అమండా.. కుమార్తె ఎమ్మా భారత్ రెండో రోజు ఆటకు ముందు బెల్ మోగించడానికి హాజరయ్యారు.

Also Read : IND Vs ENG : అంపైర్ ధర్మసేన పై రాహుల్ ఫైర్.. అందుకోసమేనా..?

పోరాడుతున్న టీమిండియా 

ఇదిలా ఉంటే.. ఓవల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా విజయం సాధిస్తే.. టెస్ట్ సిరీస్ సమం అవుతుంది. లేకుంటే ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించినట్టయితే ఆ జట్టు సిరీస్ ని కైవసం చేసుకుంటుంది. టీమిండియా విజయం కోసం పోరాడుతుంది. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 224 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లాండ్ జట్టు భారీ స్కోర్ చేస్తుందని భావించారు. కానీ ఇంగ్లాండ్ జట్టు కూడా టీమిండియా కంటే అదనంగా కేవలం 23 పరుగులు మాత్రమే చేశారు. దీంతో టీమిండియా బ్యాటర్లు ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం 130 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 38 ఓవర్లలో టీమిండియా 155 పరుగులు చేసింది. ఓపెనర్ జైస్వాల్ సెంచరీకి చేరువలో ఉన్నారు. ప్రస్తుతం జైస్వాల్ 80 పరుగులు చేయగా.. ఆకాశ్ దీప్ 51 పరుగులు చేశాడు. కే.ఎల్. రాహుల్ 07, సాయి సుదర్శన్ 11 పరుగులు మాత్రమే చేశాడు. టీమిండియా ఇలాగే ఫామ్ కొనసాగించి.. వికెట్లను కాపాడుకుంటే భారీ స్కోర్ సాధించే అవకాశం ఉంది. లేకుండా వికెట్లను కోల్పోతే మాత్రం మాత్రం మ్యాచ్ ని కోల్పేయే ప్రమాదం ఉంది.

Related News

FOX Spotted: మ్యాచ్ మధ్యలో ఎంట్రీ ఇచ్చిన వింత జంతువు… ఈ వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు

IND vs ENG: టీమిండియాలో మొత్తం గుజరాత్ టైటాన్స్ ప్లేయర్లే…గిల్ విజయ రహస్యం ఇదేనా

Karishma Kotak : స్టేడియంలోనే బట్టలు మార్చుకున్న యాంకర్.. వీడియో చూస్తే!

Vindhya Vishaka : సిరాజ్ కెరీర్ మొత్తం కష్టాలే.. తండ్రి చనిపోయినా మ్యాచ్ ఆడాడు.. ఇప్పుడు రియల్ హీరో అయ్యాడు

Prasidh Krishna : వీడు మామూలోడు కాదు… చెప్పి మరి వికెట్ తీశాడు.. ఇంగ్లీష్ వాడి పరువు తీశాడు

Gautam Gambhir : డ్రెస్సింగ్ రూమ్ లో గౌతమ్ గంభీర్ చేసిన రచ్చ చూడండి

Big Stories

×