E-Paper
Advertisement

Sri Lankan players ill: షాహిన్ ఆఫ్రిది ఇంట్లో విందు.. శ్రీలంక ప్లేయర్లకు ఫుడ్ పాయిజన్?

Sri Lankan players ill: షాహిన్ ఆఫ్రిది ఇంట్లో విందు.. శ్రీలంక ప్లేయర్లకు ఫుడ్ పాయిజన్?
Advertisement

Sri Lankan players ill: సొంత గడ్డపై శ్రీలంకతో జరిగిన 3 వన్డేల సిరీస్ ని పాకిస్తాన్ జట్టు 3 – 0 తో క్లీన్ స్వీప్ చేసింది. ఈ 3 వన్డేల సిరీస్ లో మంగళవారం రోజు జరిగిన తొలి వన్డేలో పాకిస్థాన్ జట్టు ఆరు పరుగుల తేడాతో శ్రీలంక పై గెలుపొందింది. ఈ మొదటి వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన అతిథ్య పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. ఈ కష్టసాధ్యమైన 300 పరుగుల లక్ష్యాన్ని చేదించేందుకు పోరాడిన శ్రీలంక.. 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 293 పరుగులు చేసి ఓడింది.

Also Read: Ind vs pak: పాక్ చేతిలో ఇండియా ఓటమి.. వివాదంగా మారిన క్యాచ్.. ఔటా? నాటౌటా?

Advertisement

ఇక శుక్రవారం జరిగిన రెండవ వన్డేలో శ్రీలంకపై పాకిస్తాన్ మరోసారి విజయం సాధించి వన్డే సిరీస్ ని కైవసం చేసుకుంది. ఈ రెండవ వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 8 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేదనకు దిగిన పాకిస్తాన్.. 48.2 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసి విజయం సాధించింది. ఇక రేపటినుండి పాకిస్తాన్ – శ్రీలంక మధ్య రావల్పిండిలో ముక్కోనపు టోర్ని జరగనుంది. ఈ టోర్నీలో పాకిస్తాన్, శ్రీలంకతో పాటు జింబాబ్వే బరిలో నిలిచింది.

3 వన్డేలను క్లీన్ స్వీప్ చేసిన పాకిస్తాన్:

ఇక ఆదివారం రోజు జరిగిన మూడవ వన్డేలో కూడా పాకిస్తాన్ 6 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తుచేసి సిరీస్ ని 3 -0 తో క్లీన్ స్వీప్ చేసింది. ఈ చివరి వన్దేలో మొదట బ్యాటింగ్ కి దిగిన శ్రీలంక 45.2 ఓవర్లలో 211 పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది. అనంతరం పాకిస్తాన్ 44.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసి గెలుపొందింది. ఇక ఈ మూడు వన్డేలలో కలిపి తొమ్మిది వికెట్లు పడగొట్టిన హరీస్ రవుఫ్ “ప్లేయర్ ఆఫ్ ది సిరీస్” గా నిలిచాడు.

Advertisement

Also Read: Ind VS Sa 1st Test: గిల్ తెలివిగా తప్పుకున్నాడు.. గంభీర్ బుక్ అయ్యాడు..!

పాక్ కెప్టెన్ డిన్నర్.. లంక ప్లేయర్లకు వాంతులు, విరేచనాలు:

పాకిస్తాన్ – శ్రీలంక మధ్య వన్డే సిరీస్ పూర్తయిన అనంతరం ఓ ఆసక్తికర వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సిరీస్ ని పాకిస్తాన్ క్లీన్ స్వీప్ చేసింది. అయితే సిరీస్ గెలిచిన తర్వాత శ్రీలంక క్రికెటర్లకు {Sri Lankan players} ఇస్లామాబాద్ లో పాకిస్తాన్ కెప్టెన్ షాహిన్ ఆఫ్రిది గ్రాండ్ డిన్నర్ ఇచ్చినట్లు సమాచారం. ఈ డిన్నర్ కి శ్రీలంక ఆటగాళ్లు అంతా హాజరయ్యారని.. అయితే ఈ డిన్నర్ అనంతరం శ్రీలంక ఆటగాళ్లు అంతా వాంతులు, విరేచనాలు, వైరల్ జ్వరంతో అనారోగ్యానికి గురైనట్లు ఓ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అందరికీ ఒకేసారి వాంతులు, విరేచనాలు కావడంతో భయాందోళనకు గురయ్యారట. ఈ వార్త తెలిసిన క్రీడాభిమానులు.. శ్రీలంక క్రికెటర్లు పాకిస్తాన్ వెళ్లి ప్రాణాలపైకి తెచ్చుకున్నారని కామెంట్స్ చేస్తున్నారు.

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×