E-Paper
Advertisement

Suryakumar Yadav: ‘నాకు కెప్టెన్ గా ఉండాలని లేదు’.. శ్రీలంక మ్యాచ్ విజయం తరువాత సూర్యకుమార్ యాదవ్!

Suryakumar Yadav: ‘నాకు కెప్టెన్ గా ఉండాలని లేదు’.. శ్రీలంక మ్యాచ్ విజయం తరువాత సూర్యకుమార్ యాదవ్!
Advertisement

Suryakumar Yadav: శ్రీలంకతో ఆదివారం జరిగిన రెండో టి20 మ్యాచ్ లో విజయం సాధించిన తరువాత టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తనకు కెప్టెన్ గా ఉండాలని లేదని.. కేవలం ఓ నాయకుడిగా అందరూ గుర్తిస్తే చాలని అన్నాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో టీమిండియా బౌలింగ్ తడబడుతున్నట్లు అనిపించిన సమయంలో కెప్టెన్ గా సూర్యకుమార్ తీసుకున్న నిర్ణయాలు అద్భుతంగా పనిచేశాయని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు.

214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక బ్యాటింగ్ ఓపెనర్లు పాథుమ్ నిస్సాంకా, కుసల్ మెండిస్ తమ అరాచక బ్యాటింగ్ తో విధ్వంసం సృష్టించారు. దీంతో శ్రీలంక ఈజీగా మ్యాచ్ గెలిచేస్తుందని అనుకున్నారంతా. తొమ్మిదో ఓవర్లో వికెట్ కోల్పోకుండా 84 పరుగులు సాధించిన శ్రీలంక ఓపెనర్లు ఇక గౌతమ్ గంభీర్, సూర్యకుమార్ శకానికి తొలిలోనే చేదు అనుభవం అందిస్తున్నట్లు అందరిలో భావన కలిగింది.

Advertisement

పైగా ఈ మ్యాచ్ లో టీమిండియా తరపున కేవలం అయిదుగురు బౌలర్లు రంగంలోకి దిగడంతో సూర్యకుమార్ కు బౌలింగ్ విషయంలో పెద్దగా ప్రత్యామ్నాలు లేవు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అర్ష్ దీప్ సింగ్ చేత బౌలింగ్ చేయించాలని సూర్యకుమార్ నిర్ణయం తీసుకున్నారు. ఆ ఓవర్లో అర్షదీప్ మెండిస్ వికెట్ పడగొట్టి.. సూర్యకుమార్ సరైన నిర్ణయం తీసుకున్నాడని నిరూపించాడు. అయినా శ్రీలంక స్పీడు తగ్గలేదు.

మళ్లీ అక్సర్ పటేల్ ని 15వ ఓవర్లు బౌలింగ్ చేయమని సూర్యకుమార్ చెప్పడంతో.. కుసల్ పరేరా ఔటయ్యాడు. దీంతీ లంక బ్యాటింగ్ వేగం తగ్గింది. అయితే సూర్యకుమార్ ఈ మ్యాచ్ లో మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. అదే రియాన్ పరాగ్ చేతిలో బాల్ పెట్టడం. బ్యాటింగ్ లో విఫలమైన రియాన్ పరాగ్ తన స్పిన్ బౌలింగ్ తో మూడు వికెట్లు తీసి కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అది కూడా 8 బంతుల్లోనే.

Advertisement

Also Read| Ind vs SL 2nd T20I Match Highlights: రెండో టీ 20లో టీమ్ ఇండియా గెలుపు.. సిరీస్ మనదే

టీమిండియా మ్యాచ్ విజయం తరువాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. రియాన్ పరాగ్ ని తాను నెట్ ప్రాక్టీస్ లో బౌలింగ్ చేస్తున్నప్పుడు చూశానని.. అతను అద్భుతంగా స్పిన్ బౌలింగ్ చేయగలడని తనకు నమ్మకుముందని తెలుపుతూ… ఐపిఎల్ లో రియాన్ పరాగ్ బౌలింగ్ మ్యాజిక్ ని గుర్తు చేశాడు. అందుకే రియాన్ ఈ మ్యాచ్ లో ఒక ఎక్స్ ఫ్యాక్టర్ అని ప్రశంసించాడు.

అయితే ఈ మ్యాచ్ తరువాత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్.. సూర్యకుమార్ లో మంచి కెప్టెన్ ఉన్నాడని.. అతని నాయకత్వ నైపుణ్యం భారత జట్టుకు చాలా అవసరమని అభిప్రాయపడ్డాడు. అయితే ఈ విషయంపై స్పందిస్తూ.. సూర్యకుమార్ యాదర్ ఒక ట్వీట్ చేశాడు. తనకు కెప్టెన్ గా ఉండాలని లేదని.. తనకు ఒక మంచి నాయకుడిగా అందరి మద్దతు అవసరమని తన ట్వీట్ లో రాశాడు.

Also Read: ‘ఆ విజయం కోసం ఆమె ఎంతో కష్టపడింది’.. మనూ భాకెర్ విజయంపై స్పందించిన రాహుల్ ద్రవిడ్..

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×