Tanveer Ahmed: ఐసీసీ టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( ICC T20 World Cup 2026 tournament) నేపథ్యంలో పాకిస్తాన్ విషం కక్కుతూనే ఉంది. మొదటి నుంచి ఈ టోర్నమెంట్ పై అనేక విమర్శలు చేస్తున్న పాకిస్తాన్.. ఇండియాతో మ్యాచ్ కూడా బహిష్కరించింది. ఇండియాలో టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ జరుగుతున్న నేపథ్యంలో ఎలాగైన కుట్రలకు తెరలేపాలని ప్లాన్ చేస్తోంది. ఇక నిన్న ఇండియా వర్సెస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ( India vs United States of America) మధ్య జరిగిన మ్యాచ్ పైన కూడా పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు రెచ్చిపోయి వాగుతున్నారు. అమెరికా చేతిలో టీమిండియా ఓడిపోయేదని.. కానీ ఐసీసీ బాస్ జై షా డబ్బులు ఇవ్వడం కారణంగా చివరి క్షణంలో సూర్య సేన విజయం సాధించిందని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ ( Tanveer Ahmed ) సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఐసీసీ టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( ICC T20 World Cup 2026 tournament) నేపథ్యంలో యూనైటేడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జట్టుపై టీమిండియా 29 పరుగులు సాధించింది. యూఎస్ ఏ జట్టుపై ఎంతో కష్టపడి టీమిండియా విజయం సాధించింది. సూర్య కుమార్ యాదవ్, అక్షర్ పటేల్, మహమ్మద్ సిరాజ్ కష్టపడి ఆడిన నేపథ్యంలో విజయం సాధించింది టీమిండియా. అయితే, యూఎస్ ఏ జట్టుపై టీమిండియా గెలవడంపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీ బాస్ జై షా వల్లే, టీమిండియా గెలిచిందని బాంబ్ పేల్చారు. USA జట్టుకు జై షా డబ్బులు ఇచ్చాడని, అందుకే కావాలనే ఓడిపోయారని ఆరోపణలు చేశారు. సౌరభ్ నేత్రావల్కర్ ఇండియా వాడేనని, అతనికి డబ్బులు ఇవ్వడం వల్లే, 4 ఓవర్లలో 65 పరుగులు విరాళంగా ఇచ్చాడని సంచలన వ్యాఖ్యలు చేశారు తన్వీర్ అహ్మద్. USA జట్టుకు డబ్బుల మూట పోవడం వల్లే, టీమిండియా ఓడిపోయేది..ఇప్పుడు గెలిచిందని మండిపడ్డారు. జై షా కనుసన్నల్లోనే మ్యాచ్ లన్ని జరుగుతున్నాయని బాంబ్ పేల్చారు. అయితే, పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలపై ఇండియన్ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. ఇండియా కష్టపడి గెలిస్తే, ఇలా తప్పుడు ప్రచారం దారుణమంటూ మండిపడ్డారు.
ఐసీసీ టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో USA జట్టుపై పడుతూ, లేస్తూ గెలిచింది టీమిండియా. ఈ మ్యాచ్ లో 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్ 84 పరుగులు చేసి, ఇండియాను గెలిపించాడు.
?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==