E-Paper
Advertisement

Team India: ఈ ముగ్గురిని తీసుకోండి, లేక‌పోతే టీమిండియా స‌ర్వ‌నాశ‌నమే..ఇక‌నైనా తేరుకోండి ?

Team India: ఈ ముగ్గురిని తీసుకోండి, లేక‌పోతే టీమిండియా స‌ర్వ‌నాశ‌నమే..ఇక‌నైనా తేరుకోండి ?

Team India:  టీమిండియా ( Team India ) వర్సెస్ దక్షిణాఫ్రికా ( India vs South Africa, 2nd ODI ) మధ్య రాయ్‌ పూర్ వేదికగా బుధవారం మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో టీమిండియా దారుణంగా ఓడిపోయింది. 358 పరుగులు చేసినప్పటికీ బౌలర్లు అట్టర్ ఫ్లాప్ కావడంతో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది టీమిండియా. టీమిండియా బౌలర్లు ఒక్కరు కూడా పెద్దగా రాణించలేదు. అర్షదీప్ సింగ్ ఆ మినహా మిగిలిన హర్షిత రాణా, ప్రసిద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా అందరూ అట్టర్ ప్లాప్ అయ్యారు. దీంతో 358 పరుగుల లక్ష్యాన్ని అవలీలగా చేదించింది దక్షిణాఫ్రికా.

Also Read: T20 World Cup 2026: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్..టీమిండియా కొత్త జెర్సీ లాంచ్ చేసిన రోహిత్, తిల‌క్‌

ఆ ముగ్గురిని వెంటనే తీసుకోండి..అప్పుడే టీమిండియాకు విజ‌యాలు

దక్షిణాఫ్రికా చేతిలో టీమిండియా అత్యంత దారుణంగా ఓడిపోయిన నేపథ్యంలో మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రాకు వన్డేల్లో అవకాశం ఎక్కువగా కల్పించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. 2023 వన్డే వరల్డ్ కప్ సమయంలో మహమ్మద్ షమీ అత్యధిక వికెట్లు తీసి దుమ్ము లేపాడు. అలాగే ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా అదరగొట్టాడు. ఇటు మహమ్మద్ సిరాజ్ ఎలాంటి గాయాలు లేకుండా ప్రతి మ్యాచ్ ల‌లో దుమ్ము లేపుతున్నాడు. టెస్టుల్లో లీడింగ్ వికెట్ టేకర్ గా కూడా ఈ సంవత్సరం నిలిచాడు. అటు జస్‌ప్రీత్ బుమ్రా గాయాలు అయినప్పటికీ, రాణిస్తున్నాడు. జస్‌ప్రీత్ బుమ్రా ఆడాడు అంటే మ్యాచ్ గెలవాల్సిందే. ముఖ్యంగా డెత్ ఓవర్లలో జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్ ఇరగదీస్తాడు. ఈ ముగ్గురు జట్టులో ఉంటే, ప్రత్యర్థి జట్టును 100 పరుగులకే ఆల్ అవుట్ చేసే ఛాన్సులు ఉంటాయి.

వీళ్ళ ముగ్గురికి తోడు స్పిన్నర్లు ఇద్దరు కాస్త టచ్ లోకి వస్తే చాలు. టీమిండియా అవలీలగా గెలుస్తుంది. కానీ, అలా కాకుండా ప్రసిద్ కృష్ణ, హర్షిత్ రాణా లాంటి అనుభవం లేని బౌలర్లకు ఛాన్సులు ఇస్తే టీమిండియా దారుణంగా ఓడిపోతోందని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇప్పటికైనా ఈ చెత్త బౌలర్లను పక్కకు పెట్టి మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రాలకు ఛాన్స్ ఇవ్వాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.ఈ ముగ్గురు తుది జట్టులో ఉంటేనే 2027 వన్డే వరల్డ్ కప్ టీమ్ ఇండియా గెలుస్తుందని చెబుతున్నారు.

లేకపోతే జింబాబ్వే చేతిలో కూడా టీమిండియా ఓడిపోవడం గ్యారంటీ అంటున్నారు. గౌతమ్ గంభీర్ ఈ విషయాన్ని గుర్తించి మార్పులు చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు. మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రాల‌పై గంభీర్ క‌క్ష్య క‌ట్టిన‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నాడు గంభీర్‌. మహమ్మద్ షమీని ఏ ఫార్మాట్ లో కూడా తీసుకోవ‌డం లేదు. మహమ్మద్ సిరాజ్ ను టెస్టుల‌కు ప‌రిమితం చేశాడు. జస్‌ప్రీత్ బుమ్రాను టీ20ల‌కు ప‌రిమితం చేశాడు. దీంతో వ‌న్డేల్లో టీమిండియాకు దెబ్బ ప‌డుతోంది. ఈ స‌మ‌స్య నుంచి టీమిండియా బ‌య‌ట‌ప‌డాల్సి ఉంది.

Also Read: Mohammed Shami: బట్టతలకు చెక్‌..ఆ అమ్మాయితో మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ ఎ*ఫైర్ ?

 

Related News

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Big Stories

×