IND VS PAK: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026) నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ( Pakistan Cricket Board) సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ టోర్నమెంట్ లో ఎంట్రీ ఇస్తూనే, ఫిబ్రవరి 15వ తేదీన ఇండియాతో జరిగే మ్యాచ్ బాయ్ కాట్ చేస్తున్నట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వెల్లడించిందట. పాకిస్తాన్ సర్కార్ ఆదేశాల మేరకు PCB క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. అయితే దీనిపై ఇండియన్స్ చాలా దారుణంగా రియాక్ట్ అవుతున్నారు. ఇండియాకు భయపడి పాకిస్తాన్ వెనుకడుగు వేసిందని కౌంటర్ ఇస్తున్నారు. అటు తెలుగు స్పోర్ట్స్ యాంకర్ వింధ్య విశాఖ మేడపాటి (Telugu Anchor Vindhya Vishaka ) కూడా సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ పెట్టారు. చేతకాని దద్దమ్మలు అంటూ పాకిస్తాన్ పై ఫైర్ అయ్యారు. ఇండియా అంటే గజ గజ వణికి పోతున్నారని, అందుకే ఫిబ్రవరి 15వ తేదీన జరిగే మ్యాచ్ ను పాకిస్తాన్ బాయ్ కాట్ చేసిందని పరువు తీశారు యాంకర్ వింధ్య విశాఖ. ఈ నేపథ్యంలో యాంకర్ వింధ్య విశాఖ చేసిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్ గా మారింది.
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026) నేపథ్యంలో ఇండియా మ్యాచ్ ను పాకిస్తాన్ బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ అంశంపై తాజాగా తెలుగు స్పోర్ట్స్ యాంకర్ వింధ్య విశాఖ మేడపాటి (Telugu Anchor Vindhya Vishaka ) సంచలన వ్యాఖ్యలు చేశారు. టీమిండియా కు భయపడి మ్యాచ్ ఆడకుండా బహిష్కరించినట్లు పాకిస్తాన్ పరువు తీశారు తెలుగు స్పోర్ట్స్ యాంకర్ వింధ్య విశాఖ. శ్రీలంక వేదికగా అద్భుతమైన అవకాశం పాకిస్తాన్ కు దక్కిందని వెల్లడించారు. ఈ టోర్నమెంట్ లో మొత్తం నాలుగు మ్యాచ్ లు ఒకే వేదిక కొలంబోలో ఆడే అవకాశం పాకిస్తాన్ కు ( IND VS PAK) మాత్రమే వచ్చిందని గుర్తు చేశారు.
అలా ఒకే వేదికపై అన్ని మ్యాచ్ లు జరిగితే పాకిస్థాన్ కు లాభం జరుగుతుందని వివరించారు. ఇలాంటి బంగారం లాంటి అవకాశాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పోగొట్టుకుందని చురకలు అంటించారు. న్యూజిలాండ్ పై టీమిండియా అత్యంత ప్రమాదకరంగా బ్యాటింగ్ చేసిన నేపథ్యంలో భయపడి ఉంటుందని ఎద్దేవా చేశారు. టీమిండియా బ్యాటింగ్ కూడా అత్యంత ప్రమాదకంగా ఉన్న నేపథ్యంలోనే వెనక్కి తగ్గినట్లు ఆమె పోస్ట్ పెట్టారు. దీంతో తెలుగు స్పోర్ట్స్ యాంకర్ వింధ్య విశాఖ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.
?igsh=Ym56b2Z0N24ybndh