E-Paper
Advertisement

అవ‌మానించిన చోటే నిల‌బ‌డ్డాడు.. సిక్స్ ప్యాక్ చూపిస్తూ ప్ర‌తీకారం తీర్చుకున్నాడు, తిల‌క్ వ‌ర్మ అంటే ఫైర్ రా

అవ‌మానించిన చోటే నిల‌బ‌డ్డాడు.. సిక్స్ ప్యాక్ చూపిస్తూ ప్ర‌తీకారం తీర్చుకున్నాడు,  తిల‌క్ వ‌ర్మ అంటే ఫైర్ రా
Advertisement

Tilak Revenge On Arshdeep:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) చివరి దశకు వచ్చేసింది ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య గురువారం బిగ్ ఫైట్ జరిగింది. ఇందులో తప్పక గెలవాల్సిన పంజాబ్ కింగ్స్ చేతులెత్తేసింది. అటు ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది. ముఖ్యంగా తిలక్ వర్మ 75 పరుగులతో దగ్గరుండి ముంబై ఇండియన్స్ ను గెలిపించాడు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో తిలక్ వర్మ పేరు మారుమోగుతోంది. అంతేకాదు తనను నల్లోడు అని అవమానించిన అర్ష్‌దీప్‌ సింగ్‌కు ఈ విజయం ద్వారా కౌంటర్ ఇచ్చాడని తిలక్ వర్మను మెచ్చుకుంటున్నారు.

Also Read: జాకబ్ బెథెల్ గోల్డ్ చైన్ దొంగిలించిన RCB ఫ్యాన్స్ ? పాకిస్తాన్ వెధ‌వ‌ల్లాగా త‌యారు అవుతున్నారంటూ ట్రోల్స్!

అర్ష్‌దీప్‌ సింగ్ పై ప్ర‌తీకారం తీర్చుకున్న తిల‌క్ వ‌ర్మ‌

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో (Indian Premier League 2026 Tournament) భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ గురువారం జరిగింది. అయితే ఈ మ్యాచ్ ప్రారంభం కంటే ముందు తిలక్ వర్మను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అర్ష్‌దీప్‌ సింగ్‌. హిందీలో మాట్లాడుతూ తిలక్ వర్మ నల్లోడు అంటూ కామెంట్ చేశాడు. ఫన్నీ రీల్స్ చేస్తుండగా ఈ సంఘటన జరిగింది. దీంతో తిలక్ వర్మను తిట్టిన అర్ష్‌దీప్‌ సింగ్‌ పై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాడు పెద్ద రే**పిస్టు అంటూ మండిపడుతున్నారు.

అయితే ఈ సంఘటన జరిగి 24 గంటలు ముగియక ముందే అర్ష్‌దీప్‌ సింగ్‌ పై తిలక్ వర్మ రివేంజ్ తీర్చుకున్నాడు. పంజాబ్ కింగ్స్ పైన విరోచితమైన ఇన్నింగ్స్ ఆడి.. పంజాబ్ కింగ్స్ జట్టుకు ఇచ్చి పడేశాడు. అంతేకాదు హర్షదీప్ సింగ్ బౌలింగ్ లో కూడా ఊచ కూత కోశాడు తిలక్ వర్మ. మొత్తంగా 33 బంతుల్లోనే 75 పరుగులు చేసిన తిలక్ వర్మ.. ప్లే ఆప్స్ వెళ్లాల్సిన పంజాబ్ కింగ్స్ స్పీడ్ కు బ్రేకులు వేశాడు. తనను అవమానించినందుకు ప్రతి కారం తీర్చుకున్నాడు. మ్యాచ్ అనంతరం తన సిక్స్ ప్యాక్ చూపిస్తూ అర్ష్‌దీప్‌ సింగ్‌ ను ఏడిపించాడు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.

ఆరు వికెట్ల తేడాతో ముంబై విజయం

Advertisement

పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య ధర్మశాల వేదికగా మ్యాచ్ జరిగింది. ఇందులో మొదటి బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్, ఎనిమిది టికెట్లు నష్టపోయి 200 పరుగులు చేసింది. ఇక ఈ లక్ష్యాన్ని చివరి వరకు ఆడిన ముంబై ఇండియన్స్ జట్టు, 19.5 ల‌క్ష్యాన్ని చేరుకుంది. ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయిన పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ ఆశలు మరింత జటిలం అయ్యాయి. తన మిగిలిన రెండు మ్యాచ్ లో కచ్చితంగా పంజాబ్ కింగ్స్ గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. లేకపోతే ఎలిమినేట్ కావాల్సిందే.

Also Read: రాజీవ్ శుక్లా భాగోతం బ‌య‌ట‌పెట్టిన ల‌లిత్ మోడీ…ఐపీఎల్ లో ఛాన్స్ ఇస్తామ‌ని డ‌బ్బులు వ‌సూళ్లు, ప్రైవేట్ వీడియోలు చూపించి !

 

 

 

Related News

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

Big Stories

Advertisement
×