E-Paper
Advertisement

Trolls On Jemimah Rodrigues: 4వ సారి ఢిల్లీ ఓట‌మి..జెమిమాపై దారుణంగా ట్రోలింగ్…ఆ మ‌త‌మే కొంపముంచిందంటూ ?

Trolls On Jemimah Rodrigues:  4వ సారి ఢిల్లీ ఓట‌మి..జెమిమాపై దారుణంగా ట్రోలింగ్…ఆ మ‌త‌మే కొంపముంచిందంటూ ?
Advertisement

Trolls On Jemimah Rodrigues:  ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Women’s Premier League 2026) నేపథ్యంలో గురువారం ఫైనల్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఫైనల్ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ ( Royal Challengers Bengaluru Women vs Delhi Capitals Women, Final,) మధ్య ఫైట్ జరిగింది. అయితే ఈ మ్యాచ్లో అద్భుతంగా రాణించిన బెంగుళూరు మహిళల జట్టు ఆరు వికెట్లతో విజయం సాధించింది. దీంతో రెండోసారి ఛాంపియన్ గా నిలిచింది స్మృతి మందాన ప్రాతినిధ్యం వహిస్తున్న బెంగళూరు జట్టు. అయితే ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ జెమిమా రోడ్రిగ్స్ ( Jemimah Rodrigues ) పైన దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు నేటిజన్స్. క్రిస్టియన్ అయిన జెమిమా రోడ్రిగ్స్ కు ఢిల్లీ కెప్టెన్సీ ఇవ్వడం వల్ల ఫైనల్స్ లో ఓడిపోయిందని దారుణంగా కామెంట్లు పెడుతున్నారు. ఆమెకు కాకుండా మరో వ్యక్తికి కెప్టెన్సీ ఇస్తే ఖచ్చితంగా ఢిల్లీ గెలిచేదని పోస్టులు పెడుతున్నారు.

Also Read: MS Dhoni on Ro-Ko: ఎవ‌డెన్ని డ్రామాలు చేసినా, 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ లో Ro-Ko ఆడ‌తారు..గంభీర్ కు ఇచ్చిప‌డేసిన‌ ధోని!

జెమిమా రోడ్రిగ్స్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్

Advertisement

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ఫైనల్ సందర్భంగా మరోసారి జెమిమా రోడ్రిగ్స్ మతం గురించి సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. క్రిస్టియన్ అయిన జెమిమా రోడ్రిగ్స్ కు ఢిల్లీ కెప్టెన్సీ ఇవ్వడం వల్ల, ఫైనల్స్ లో ఓడిపోయిందని ఫైర్ అవుతున్నారు. ఆ మతస్తులకు అసలు కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వడం ఏంటని ఢిల్లీ యాజమాన్యాన్ని నిలదీస్తున్నారు. మరో వ్యక్తికి కెప్టెన్సీ ఇస్తే బాగుండేదని సూచనలు చేస్తున్నారు. ఢిల్లీ ఓటమికి ఆ మతం ( Jesus) ఒక్కటే కారణమని హిందువులు ఫైర్ అవుతున్నారు. కాగా మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ సందర్భంగా ఓ మ్యాచ్ గెలిచిన తర్వాత అంతా జీసస్ మాయా అంటూ జమీమా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి జెమిమా రోడ్రిగ్స్ ను సోషల్ మీడియాలో దారుణంగా ఆడుకుంటున్నారు జనాలు. ఇక ఇప్పుడు అదే జెమిమా రోడ్రిగ్స్ (Trolls On Jemimah Rodrigues) శాపం ఢిల్లీకి తగిలి, ఆ జట్టు ఓటమిపాలైందని ట్రోల్ చేస్తున్నారు.

వరుసగా నాలుగు సార్లు ఫైనల్స్ ఓడిపోయిన ఢిల్లీ క్యాపిటల్స్

2023 సంవత్సరంలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2023 నుంచి ఇప్పటివరకు నాలుగు సీజన్లు ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్ కి వెళ్ళింది. కానీ ఒక్కసారి కూడా టైటిల్ నెగ్గలేదు. ప్రతిసారి ఫైనల్స్ లో ఓడిపోయి, ఇంటిదారి పడుతోంది ఢిల్లీ క్యాపిటల్స్. అయితే, ఇప్పటివరకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు రెండు టైటిల్స్ గెల్చుకుంది. అలాగే ముంబై ఇండియన్స్ రెండు సార్లు ఛాంపియన్ అయింది.

Advertisement

Also Read:  Ishan Kishan vs Sanju Samson: సంజు వ‌ర్సెస్ ఇషాన్..టీ20 ప్ర‌పంచ క‌ప్ లో ఓపెన‌ర్ గా ఎవ‌రు బెస్ట్ ? ఇదిగో రికార్డులు

 

 

 

 

Related News

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

Big Stories

Advertisement
×