E-Paper
Advertisement

Trolls On Shubman Gill: ఓరి ద‌రిద్రుడా..రోహిత్ శ‌ర్మ సాధించిన ఛాంపియన్స్ ట్రోఫీని ఖాతాలో వేసుకున్నావా ? గిల్ పై దారుణంగా ట్రోల్స్‌

Trolls On Shubman Gill: ఓరి ద‌రిద్రుడా..రోహిత్ శ‌ర్మ సాధించిన ఛాంపియన్స్ ట్రోఫీని ఖాతాలో వేసుకున్నావా ? గిల్ పై దారుణంగా ట్రోల్స్‌
Advertisement

Trolls On Shubman Gill:  టీమిండియా వన్డే కెప్టెన్ శుభమాన్ గిల్ ( Shubman Gill) మరో వివాదంలో చిక్కుకున్నాడు. రోహిత్ శర్మ సాధించిన రికార్డును తన ఖాతాలో గిల్ వేసుకునే ప్రయత్నం చేశాడని సోషల్ మీడియాలో దారుణంగా పోస్టులు పెడుతున్నారు. ఎంతకు తెగించావు రా ? రోహిత్ శర్మ సాధించిన చాంపియన్స్ ట్రోఫీ 2025 ట్రోఫీని ( champions trophy 2025) తన ఖాతాలో వేసుకునేందుకు గిల్ కుట్రలు పన్నాడని మండిపడుతున్నారు ఫ్యాన్స్. బీసీసీఐ తాజాగా నమన్ అవార్డ్స్ వేడుకను న్యూఢిల్లీలో నిర్వహించింది. ఈ సందర్భంగా క్రికెట్ రంగంలో విశేష సేవలు అందించిన క్రికెటర్లకు ప్రత్యేకంగా అవార్డులు అందించింది. అయితే ఈ సందర్భంగా టీమిండియా ప్రస్తుత వన్డే కెప్టెన్ గిల్ మాట్లాడేటప్పుడు, ఈవెంట్ నిర్వహించిన ఒక సంస్థ పెద్ద తప్పిదం చేసింది. చాంపియన్స్ ట్రోఫీ 2025 ట్రోఫీని గెలిచిన కెప్టెన్ గా గిల్ పేరును ప్రస్తావించింది. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు దుమారం రేపుతోంది. దీంతో రోహిత్ శ‌ర్మ ( rohit sharma) ఫ్యాన్స్ సీరియ‌స్ అవుతున్నారు.

Also Read: World Cup 2027: టీమిండియా ఓపెన‌ర్లుగా రోహిత్, కోహ్లీ..గిల్ కు నో ఛాన్స్‌..వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడే టీమ్ ఇదే !

రోహిత్ శ‌ర్మ సాధించిన ఛాంపియన్స్ ట్రోఫీని ఖాతాలో వేసుకున్నావా ?

Advertisement

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ విజేతగా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మెగా ఈవెంట్ పాకిస్తాన్ నిర్వహించింది. పాకిస్తాన్ లో ఇండియా పర్యటించబోను కాబట్టి, మన టీమ్ ఇండియా ప్రతి మ్యాచ్ దుబాయ్ లోనే ఆడింది. ఆ సమయంలో టీమిండియా వన్డే కెప్టెన్ గా రోహిత్ శర్మ కొనసాగాడు. జట్టును ఫైనల్ దాక తీసుకువెళ్లి టైటిల్ అందించాడు రోహిత్ శర్మ. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఫైట్ జరిగింది.

ఈ మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది టీమిండియా. దీంతో రోహిత్ శర్మ ఖాతాలో మరో ట్రోఫీ పడింది. అయితే ఇంత అరుదైన రికార్డును సాధించిన రోహిత్ శర్మకు తాజాగా ఘోర అవమానం ఎదురయింది. బిసిసిఐ తాజాగా నమన్ అవార్డ్స్ వేడుకను ఢిల్లీలో నిర్వహించింది. ఈ ఈవెంట్ కు రోహిత్ శర్మతోపాటు విరాట్ కోహ్లీని ఇన్వైట్ చేయలేదు. అలాగే ఈ ఈవెంట్ నిర్వహించిన బ్రాడ్కాస్టర్ సంస్థ పెద్ద తప్పిదం చేసింది. చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ గెలిపించిన కెప్టెన్ గిల్ అంటూ పేర్కొంది. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. దీంతో గిల్ ను దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు రోహిత్ శర్మ అభిమానులు. ఇదంతా గిల్ కావాలనే చేయించాడని.. రోహిత్ శర్మ అభిమానులు ఆరోపణలు చేస్తున్నారు. మొన్న టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ అందించిన సంజు శాంసన్ ఫోటోలు తొలగించి రచ్చ చేసిన గిల్.. ఇప్పుడు రోహిత్ శర్మాను ఇలా వేధిస్తున్నాడని మండిపడుతున్నారు. ఇలాంటి వాడికి కెప్టెన్సీ ఇవ్వకూడదని.. వెంటనే ఇండియన్ కెప్టెన్ గా మరొకరికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.

Advertisement

 

 

Also Read: SRH-Abrar Ahmed: కావ్య పాపకు విల‌న్ గా మారిన‌ మొహ్సిన్ నఖ్వీ…స‌న్ రైజ‌ర్స్ కు అబ్రార్ అహ్మద్ ఆడ‌కుండా కుట్ర‌లు !

 

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

 

Related News

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

Big Stories

Advertisement
×