U19 Asia Cup 2025: అండర్ 19 ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ఫైనల్ విజేతగా పాకిస్తాన్ జట్టు నిలిచిన సంగతి తెలిసిందే. టీమిండియా అండర్ 19 జట్టుపై ఏకంగా 191 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది పాకిస్తాన్. బౌలింగ్ అలాగే బ్యాటింగ్ రెండు విభాగాలలో అట్టర్ ఫ్లాప్ అయిన టీమిండియాను చిత్తు చిత్తుగా ఓడించింది పాకిస్తాన్. అయితే ఓటమి, గెలుపు సహజం.. కానీ అండర్ 19 ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ ప్లేయర్లు కాస్త ఓవర్ గా బిహేవ్ చేశారు. ఊర కుక్కల లాగా మీదుకు వచ్చారు. టీమిండియా ప్లేయర్ల వికెట్ తీసిన అనంతరం రెచ్చిపోతూ ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియోలు అలాగే ఫోటోలు వైరల్ గా మారాయి.
Also Read: T20 World Cup 2026 India Squad: గిల్ పీడ విరగడైంది.. టి20 ప్రపంచ కప్ 2026 ఆడే టీమిండియా జట్టు ఇదే
అండర్ 19 ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా పాకిస్తాన్ అండర్ 19 ప్లేయర్లు రెచ్చిపోయారు. టీమిండియా ప్లేయర్లను కించపరుస్తూ గ్రౌండ్ లో ఓవరాక్షన్ చేశారు. ఊర కుక్కల మీదకు వచ్చారు. అయితే పాకిస్తాన్ ప్లేయర్లు అలా వ్యవహరిస్తున్న నేపథ్యంలో వైభవ్ సూర్య వంశీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. మీరు మా బూట్లు తుడవడానికి కూడా పనికిరారు.. అంటూ అలీ రజాకు తన షూలు చూపించాడు. అటు టీమిండియా కెప్టెన్ ఆయుష్ మాత్రే కూడా రెచ్చిపోయాడు. నువ్వేంట్రా అంటూ పాకిస్తాన్ బౌలర్ అలీ రజాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అనేక సంఘటనలు నిన్నటి మ్యాచ్ సందర్భంగా జరిగాయి. దీనిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి సీరియస్ గా వ్యవహరిస్తోందట.
అండర్ 19 ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ఫైనల్ సందర్భంగా పాకిస్తాన్ ప్లేయర్లు రెచ్చిపోయిన నేపథ్యంలో ఐసీసీకి ఫిర్యాదు చేసేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి సిద్ధమైనట్లు చెబుతున్నారు. నిన్నటి మ్యాచ్ సందర్భంగా రెచ్చిపోయిన పాకిస్థాన్ ప్లేయర్లపై బ్యాన్ వేయాలని బీసీసీఐ కోరనుందట. ఈ మేరకు ఐసీసీకి నివేదికను పంపేందుకు సిద్ధం అయిందని అంటున్నారు. ఏ క్షణమైనా ఐసీసీ బాస్ జై షాకు ఈ నివేదిక చేరనుందని అంటున్నారు. అదే జరిగితే, ఆ పాక్ ప్లేయర్లపై వేటు వేసే ఛాన్స్ ఉండనుందని అంటున్నారు. ఇది ఇలా ఉండగా అండర్ 19 ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లు ఆడి 8 వికెట్ల నష్టపోయి 347 పరుగులు సాధించింది. అయితే ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో మన టీమిండియా ఆటగాళ్లు దారుణంగా విఫలమయ్యారు. దీంతో 26.2 ఓవర్లు ఆడిన టీమిండియా ప్లేయర్లు 156 పరుగులకు అలౌట్ అయ్యారు. దీంతో టైటిల్ పాకిస్తాన్ సొంతం చేసుకుంది.
Also Read: Team India Squad: న్యూజిలాండ్ తో ఆడే టీం ఇండియా జట్టు ఇదే.. గిల్ పై వేటు, అక్షర్ పటేల్ కు బంపర్ ఆఫర్
These Pakistani cricketers are the worst creatures in the world. pic.twitter.com/iGpGdvJYB7
— Vipin Tiwari (@Vipintiwari952) December 21, 2025