E-Paper
Advertisement

Vaibhav Suryavanshi: వైభవ్ సెంచరీ.. పేరెంట్స్ ఎమోషనల్

Vaibhav Suryavanshi: వైభవ్ సెంచరీ.. పేరెంట్స్ ఎమోషనల్
Advertisement

Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ పేరు ఇప్పుడు మార్మోగుతోంది. క్రికెట్ లవర్స్ మరో టెండూల్కర్ అంటూ కొనియాడుతున్నారు. రాత్రికి రాత్రే టాప్ సెలబ్రిటీ అయిపోయాడు. క్రికెట్ దిగ్గజాలు సైతం నూనూగు మీసాల రాని కుర్రోడ్ని పదేపదే ప్రస్తావిస్తున్నారు. అసలు వైభవ్ ఎంపికపై డిసెంబర్‌లో దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. వైభవ్ వెనుక కర్మ, కర్త, క్రియ అన్నీ టీమిండియా మాజీ కోచ్ రాహల్ ద్రావిడ్.

ఆదివారం రాత్రి జరిగిన రాజస్థాన్-గుజరాత్ ఐపీఎల్ మ్యాచ్ క్రికెట్ లవర్స్‌కు తీపి గుర్తుగా మిలిగిపోయింది. ఓ వైపు అంతర్జాతీయ ఆటగాళ్లు ఇషాంత్ శర్మ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రషీద్ ఖాన్, కరీంజనత్ వంటి బౌలర్లు. ఇంకోవైపు నూనూగు మీసాలు రాని యువకుడి వైభవ్. కేవలం సహచరుడి నుంచి మాత్రమే సహకారం.

Advertisement

ప్రత్యర్థులు నిప్పులు చెరిగే బంతులు వేస్తున్నారు. ఏ మాత్రం ఏకాగ్రత చెదిరిపోకుండా బౌలర్‌పై విరుచుకుపడ్డాడు వైభవ్ సూర్యవంశీ. బౌలర్ ఎవరైతేనేం అయితే సిక్స్.. లేదంటే బౌండరీ తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. గుజరాత్ బౌలర్లను ఊచకోత కోశాడు. అనుకున్నది సుసాధ్యం చేశాడు.. క్రికెట్ ప్రముఖులతో ప్రశంసలు అందుకుంటున్నాడు. కేవలం 35 బంతుల్లో సెంచరీ చేశాడు. ఐపీఎల్‌లో తక్కువ బంతుల్లో సెంచరీ చేసినవాళ్లలో తొలి కిస్ గేల్ కాగా, ఆ  తర్వాత వైభవ్ మాత్రమే ఉన్నాడు.

జట్టును విజయపథంలో నడిపిన కొడుకుపై తల్లిదండ్రులు కాసింత ఎమోషనల్ అయ్యారు. కొడుకు గురించి అందరు మాట్లాడడంతో ఉప్పొంగిపోయారు. వైభవ్ కేవలం 35 బంతుల్లో సెంచరీ సాధించి తన జట్టు విజయ పథంలో నడిపించాడని, అతని విజయం పట్ల తాము చాలా సంతోషంగా ఉన్నామన్నారు.

Advertisement

ALSO READ: వైభవ్ కన్నీళ్లు చూసి

రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం, తోటి ఆటగాళ్లకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు. వైభవ్ సాధించిన ఘనత ఈ ప్రాంతానికి పరిమితం కాలేదని జిల్లా, రాష్ట్రం, దేశం వైభవ్ అద్భుతమైన బ్యాటింగ్ గురించి చెప్పుకుంటుందోనని అన్నారు.

మ్యాచ్ తర్వాత ఇంటర్వ్యూలో మాట్లాడిన వైభవ్.. ఏళ్ల తరబడి తాను చేసిన పోరాటానికి ఫలితం దక్కిందన్నాడు. తన తల్లి రోజుకు మూడు గంటలు మాత్రమే నిద్రపోయేదని, తన కలను నెరవేర్చుకోవడానికి తండ్రి తన ఉద్యోగాన్ని ఎలా వదులుకున్నాడని చెప్పాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తాను క్రికెటర్ కావాలనే కలను సజీవంగా ఉంచిందన్నాడు. ప్రాక్టీస్ వల్ల, మా అమ్మ అర్థరాత్రి రెండు గంటలకు నిద్ర లేచేది. రాత్రి 11 గంటలకు నిద్రపోయేది.

గడిచిన మూడు, నాలుగు నెలలు రాజస్థాన్ జట్టుతో ఉండడం వల్ల మంచి ప్రాక్టీస్ వచ్చిందన్నాడు. కోచ్ రాహుల్ ద్రవిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, సాయిరాజ్ బహుతులేతోపాటు చేసిన కృషి మరువలేమన్నాడు. తనను వారితో ఉండడం వల్ల ఆటతీరును మెరుగు పరుచుకున్నట్లు చెప్పాడు. సీనియర్ల నుండి చక్కటి మద్దతు లభించిందన్నాడు. సంజు, ర్యాన్ , యశస్వి, నితీష్ భయ్యాలు సహాయం మరువలేనిదన్నాడు.

 

Related News

నా అల్లుడిపై బ్యాన్ వేస్తే, అంద‌రి భాగోతాలు బ‌య‌ట‌పెడ‌తా..ఇంజ‌మామ్ హెచ్చ‌రిక‌

మ‌రో వివాదంలో మ‌హ్మ‌ద్ రిజ్వాన్..డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు !

బాబ‌ర్ ఆజం గొప్పోడని డ‌బ్బా కొట్ట‌డం త‌ప్ప‌, పీకిందేమీ లేదు..అంతా ప్ర‌చారం మాత్ర‌మే

ఓయో రూంల్లో ఉండ‌నున్న టీమిండియా ప్లేయ‌ర్లు ?

ధోని చాణ‌క్యం…బెంగాలీ రాద‌ని డ్రామాలు ఆడి బంగ్లా ప‌ళ్లు రాలగొట్టాడు

ఇంగ్లండ్ చేతిలో వైట్ వాష్ అయినా, టీమిండియా అంతు చూస్తాం !

స్మృతి మందాన‌ బ్యాట్ లో AI చిప్స్…అందుకే సెంచ‌రీ చేసింది

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

Big Stories

Advertisement
×