Virat Kohli: రాయిపూర్ వేదికగా టీమిండియాతో జరిగిన రెండవ వన్డేలో టీమిండియాపై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది సౌత్ ఆఫ్రికా. దీంతో 3 వన్డేల సిరీస్ ని 1 – 1 తో సమం చేసింది. 359 పరుగుల భారీ లక్ష్యాన్ని సౌత్ ఆఫ్రికా ఆరు వికెట్లు కోల్పోయి 49.2 ఓవర్లలోనే చేదించింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లు అద్భుతంగా రాణించి భారత్ పై తొలిసారిగా ఇంత పెద్ద లక్ష్యాన్ని ఛేదించారు.
Also Read: Kohli-Bavuma: బవుమా ముందు కోహ్లీ కుప్పి గంతులు.. ఐసీసీ వేటు ?
దీంతో పాటు భారత జట్టు పేలవంగా ఆడడం కూడా అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. టీమిండియా బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్ సెంచరీలు వృధా అయ్యాయి. ముఖ్యంగా టీమిండియా బౌలర్లు, ఫీల్డర్లు విఫలం కావడం టీమిండియా ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
రెండవ వన్డేలో భారత జట్టు ఓడిపోవడానికి బౌలర్లు, ఫీల్డర్లే కారణమని సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు క్రీడాభిమానులు. ఈ మ్యాచ్ లో ప్రసిద్ద్ కృష్ణ 8 ఓవర్లలో 79 పరుగులు ఇచ్చాడు. కుల్దీప్ యాదవ్ కూడా తన పది ఓవర్లలో ఏకంగా 78 పరుగులు ఇచ్చాడు. ఇక భారత ఓటమికి యశస్వి జైస్వాల్ ఓ ప్రధాన కారణంగా చెప్పవచ్చు. యశస్వి జైష్వాల్ బ్యాటింగ్ లో విఫలం కావడమే కాకుండా.. తన పేలవమైన ఫీల్డింగ్ కూడా జట్టుకు భారీ నష్టం కలిగించింది. 53 పరుగుల వద్ద ఉన్న మార్క్రమ్ ఇచ్చిన సులభమైన క్యాచ్ ని యశస్వి జైష్వాల్ వదిలేశాడు. మార్క్రమ్ ఆఫ్ సెంచరీ తర్వాత సిక్సర్ కి ప్రయత్నించాడు. ఆ బంతి బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న యశస్వి జైష్వాల్ వద్దకి నేరుగా వెళ్ళింది. కానీ ఆ క్యాచ్ ని జైశ్వాల్ వదిలేసాడు. ఆ తర్వాత మార్క్రమ్ కేవలం 88 బంతుల్లోనే సెంచరీ చేసి.. సౌత్ ఆఫ్రికా మ్యాచ్ విజయంలో కీలకంగా మారాడు. యశస్వి మాత్రమే కాకుండా భారత జట్టు పేలవమైన ఫీల్డింగ్ ని ప్రదర్శించింది. వాషింగ్టన్ సుందర్, అర్షదీప్ సింగ్, రవీంద్ర జడేజా వంటి ఫీల్డర్లు సైతం మిస్టేక్స్ చేయడం సౌత్ ఆఫ్రికా కి కలిసి వచ్చింది.
Also Read: Ruturaj Gaikwad: ఇండియాకు శాపంగా మారిన రుతురాజ్..సెంచరీ చేస్తే దరిద్రమే
మార్క్రమ్ క్యాచ్ ని వదిలేసిన తర్వాత యశస్వి జైస్వాల్ బౌండరీ లైన్ వద్ద మనసులో కాస్త భయాందోళనలతోనే ఫీల్డింగ్ చేశాడు. కుల్దీప్ యాదవ్ వేసిన 40 ఓవర్ 3 వ బంతిని 54 పరుగులు చేసిన డేవాల్డ్ బ్రేవీస్ భారీ షాట్ కి ప్రయత్నించాడు. అయితే బౌండరీ లైన్ వద్ద కాస్త భయపడుతూనే ఆ క్యాచ్ ని ఒడిసిపట్టుకున్నాడు యశస్వి జైష్వాల్. ఆ తరువాత సెలబ్రేట్ చేసుకునేందుకు ఆటగాళ్లు ఒక దగ్గర చేరిన తర్వాత.. యశస్వి జైష్వాల్ క్యాచ్ తీసుకున్న తీరుని అనుసరిస్తూ విరాట్ కోహ్లీ అతడిని ఏడిపించాడు. దీంతో ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన విరాట్ కోహ్లీ అభిమానులు.. వింటేజ్ విరాట్ కోహ్లీ మళ్ళీ తిరిగి వచ్చాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">