E-Paper
Advertisement

IND vs SA Test Series : స్వదేశానికి కోహ్లి.. గాయంతో వైదొలగిన రుతురాజ్..

IND vs SA Test Series : స్వదేశానికి కోహ్లి.. గాయంతో వైదొలగిన రుతురాజ్..
Advertisement

IND vs SA Test Series : ఇటీవలే టెస్టు సిరీస్ కోసం దక్షిణాఫ్రికా వెళ్లిన కోహ్లి.. ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా భారత్‌కు తిరిగి వచ్చాడు. ఎమర్జెన్సీకి సంబంధించిన ఖచ్చితమైన వివరాలు తెలియాల్సి ఉంది. అయితే డిసెంబర్ 26న సెంచూరియన్‌లో ప్రారంభమయ్యే మొదటి టెస్టు కోసం అతను జోహన్నెస్‌బర్గ్‌కు తిరిగి వస్తాడనిభారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) వర్గాలు చెబుతున్నాయి.

దక్షిణాఫ్రికాతో జరిగే రెండు టెస్టుల సిరీస్‌కు రుతురాజ్ గైక్వాడ్ దూరమయ్యాడు. రుతురాజ్ గైక్వాడ్ వేలి గాయం నుంచి ఇంకా కోలుకోలేదని BCCI తెలిపింది. భారత జట్టు మేనేజ్‌మెంట్ అతడిని విడుదల చేసింది.

Advertisement

డిసెంబర్ 19న పోర్ట్ ఎలిజబెత్‌లో ఆతిథ్య జట్టుతో జరిగిన రెండో వన్డేలో 26 ఏళ్ల గైక్వాడ్ వేలికి గాయమైంది. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో గాయపడ్డాడు. ఆ గాయం నుంచి అతను పూర్తిగా కోలుకోలేదని.. బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడని అని గురువారం చివరి వన్డే ప్రారంభానికి ముందు BCCI పేర్కొంది.

వన్డే సిరీస్ గురువారం ముగిసింది.. శుక్రవారంతో మూడు రోజుల ఇంట్రా-స్క్వాడ్ గేమ్‌ ముగుస్తుంది. ఈ నెల 26న సెంచూరియన్‌‌లో దక్షిణాఫ్రికాతో భారత్ తొలి టెస్ట్ ఆడనుంది. డిసెంబర్ 30న ముగిసే బాక్సింగ్ డే టెస్ట్ తర్వాత, కేప్ టౌన్‌‌లో జనవరి 3న చివరి టెస్టు ప్రారంభం కానుంది.

Related News

ఓయో రూంల్లో ఉండ‌నున్న టీమిండియా ప్లేయ‌ర్లు ?

ధోని చాణ‌క్యం…బెంగాలీ రాద‌ని డ్రామాలు ఆడి బంగ్లా ప‌ళ్లు రాలగొట్టాడు

ఇంగ్లండ్ చేతిలో వైట్ వాష్ అయినా, టీమిండియా అంతు చూస్తాం !

స్మృతి మందాన‌ బ్యాట్ లో AI చిప్స్…అందుకే సెంచ‌రీ చేసింది

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

డ్రెస్సింగ్ రూంలో త‌న్నుకున్న పాకిస్తాన్ క్రికెట‌ర్లు..!

ఐర్లాండ్ చేతిలో టీమిండియానే వైట్ వాష్ అయింది, అందుకే పాకిస్తాన్ ఓడిపోతోంది

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

Big Stories

Advertisement
×