E-Paper
Advertisement

T20 World Cup 2024 : వాళ్లిద్దరి భవిష్యత్ ఏంటి..? సౌతాఫ్రికాలో చీఫ్ సెలక్టర్ బృందం..!

T20 World Cup 2024 : వాళ్లిద్దరి భవిష్యత్ ఏంటి..? సౌతాఫ్రికాలో చీఫ్ సెలక్టర్ బృందం..!
Advertisement

T20 World Cup 2024 : టీమ్ ఇండియాలో కీలకమైన ఇద్దరు ప్లేయర్లు ఎవరంటే రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ అని ఠపీమని చెప్పేస్తారు. ఒకనాడు సచిన్ టెండూల్కర్ ఎలా వెన్నుముకలా ఉండేవాడో, ఇప్పుడు వీరిద్దరూ కుడి,ఎడమ భుజాల్లా కాస్తున్నారు. అందుకని వీరిని తొలగించడం అంటే అనుకున్నంత ఆషామాషీ కాదు. ఎందుకంటే 140 కోట్ల మంది భారతీయుల నుంచి వచ్చే ఒత్తిడిని తట్టుకోవడం ఎవరి తరం కాదు.

మొన్ననే చూశాం కదా.. ముంబై ఇండియన్స్ భరతం పట్టిన రోహిత్ అభిమానులు, ఇక బీసీసీఐని అయితే ఒక రేంజ్ లో ఆడుకుంటారు. అది ఐపీఎల్ లో ప్రైవేటు ఫ్రాంచైజీ కాబట్టి వారు బతికి బట్టకట్టారు. బీసీసీఐ అలా కాదు.. ప్రజలతో ముడిపడిన భారతీయ సంస్థ. ప్రతీ భారతీయుడికి సమాధానం చెప్పాల్సిందే. అంటే ఒక్కరు కోర్టులో కేసు వేసినా, బదులు చెప్పక తప్పని పరిస్థితి బీసీసీఐకి ఉంది. అందుకే వాళ్లిద్దరి విషయంలో నిర్ణయం తీసుకోవాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించాలి.

Advertisement

త్వరలో టీ 20 వరల్డ్ కప్ జరగనుంది. అంతేకాదు భారత్ లో ఆఫ్గనిస్తాన్ పర్యటన ఉంది. అక్కడ 3 టీ 20 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ ఇద్దరూ కూడా ఏడాదిగా టీ 20 లు ఆడటం లేదు.  ఇప్పుడు వీరిద్దరిని ప్రపంచకప్ నకు ఎంపిక చేయాలా? లేదా? అనేది బీసీసీఐ సెలక్షన్ కమిటీకి అగ్ని పరీక్షలా మారింది. అందుకే సమయం లేక, ఇక లాభం లేదనుకుని, డైరక్టుగా అడిగేద్దామని భావించి సౌతాఫ్రికాకి అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ బృందం బయలుదేరింది.

ఇప్పుడక్కడ వారు సమావేశం కానున్నారు. రెండో టెస్ట్ ముగిసే జనవరి 7లోపు వీరిద్దరినీ ప్రత్యేకంగా కూర్చోబెట్టి, అసలు టీ 20 మ్యాచ్ లు ఆడతారా? లేదంటే ఇక్కడితో చాలిస్తారా? అని ప్రశ్నించేలా కనిపిస్తోంది. దీంతో వీరు చెప్పే సమాధానం బట్టి జట్టు కూర్పు ఆధారపడి ఉంటుంది.

Advertisement

ఎందుకంటే టీ 20 మ్యాచ్ ల్లో స్థానం కోసం ఎంతోమంది ప్రతిభావంతులు మెయిన్ డోర్ వద్ద ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరు చెప్పే మాటపై ఎవరు 15 మందిలో ఉంటారు? ఎవరు ఉండరనేది తేలిపోతుంది. రెండోటెస్ట్ ముగిసేలోపు వ్యవహారం ఒక కొలిక్కి వస్తుందని అంటున్నారు.

ఆఫ్గనిస్తాన్ తో జరిగే టీ 20 మ్యాచ్ ల్లో, ఇంకా ఐపీఎల్ లో ఎవరు బాగా ఆడుతున్నారో చూసి, ఫైనల్ జట్టు ఎంపిక ఉంటుందని అంటున్నారు. అందుకే ముందు వీరిద్దరి సంగతి తేల్చేస్తే.. సెలక్షన్ కమిటీకి గుండె బరువు తగ్గుతుందని అంటున్నారు. అంతేకాదు కెప్టెన్సీపై కూడా క్లారిటీ వస్తుందని అంటున్నారు.

Related News

పాకిస్తాన్ జట్టుకు భారతీయుల దిష్టి తగిలింది..అందుకే ఓడిపోతోంది

రాజస్థాన్ ను వదిలేసి LSGలోకి వచ్చేయ్.. నా ఆస్తులు రాసి ఇస్తా !

ఫిక్సింగ్ చేసి ఫైనల్స్ కు వచ్చారు..లంక చేతిలో చిత్తుగా ఓడిపోవడం పక్కా

రన్స్ చేయకపోతే..గొంతు నొక్కి చంపేస్తానని సచిన్ కు వార్నింగ్ ఇచ్చా !

అనిల్ కుంబ్లే కుక్క కంటే హీనంగా కోహ్లీ ట్రీట్ చేసాడు..!

400 మంది కొత్త ప్లేయర్లను తీసుకోని, పాకిస్తాన్ జట్టును తయారు చేయండి

40 ఏళ్ళ రోహిత్ ను తీసుకున్నప్పుడు, షమీని ఉగ్రవాదిలా ఎందుకు ట్రీట్ చూస్తున్నారు ?

కోచ్ వహాబ్ రియాజ్ తో పాకిస్తాన్ లేడీ క్రికెటర్ డేటింగ్…స్టేడియంలోనే రొమాన్స్ !

Big Stories

Advertisement
×