BigTV English
Advertisement

Phone Tapping Case: 1200 మంది ఫోన్లు ట్యాప్ చేశాం..అందులో ఎవరెవరున్నారంటే ? : ప్రణీత్ రావు

Phone Tapping Case: 1200 మంది ఫోన్లు ట్యాప్ చేశాం..అందులో ఎవరెవరున్నారంటే ? : ప్రణీత్ రావు

Praneeth Rao Statement In Phone Tapping Case(TS today news): రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడైన మాజీ పోలీస్ అధికారి ప్రణీత్ రావు వాంగ్మూలం ఇచ్చారు. ఇందులో అనేక సంచలన విషయాలను ఆయన వెల్లడించారు.


56 మంది ఎస్‌వోటీ సిబ్బందితో కలిసి 1200 మంది ఫోన్లు ట్యాప్ చేశామని ప్రణీత్ రావు వాంగ్మూలంలో తెలిపారు. ప్రధానంగా ప్రతిపక్ష నేతలపై దృష్టి పెట్టినట్లు ఒప్పుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ పర్యవేక్షణ కోసం 17 కంప్యూటర్లు వినియోగించినట్లు వెల్లడించారు. ప్రధానంగా ప్రతిపక్ష నేతలపై నిఘా ఉంచినట్లు వాంగ్మూలంలో ప్రణీత్ రావు తెలిపారు. ప్రతిపక్ష నేతలకు వెళ్లే డబ్బును అడ్డుకున్నామని చెప్పారు.

జడ్జిలు, నేతలు, స్థిరాస్తి వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేశామన్నారు. కన్వర్జెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్ సాయంతో ట్యాపింగ్ చేసినట్లు స్పష్టం చేశారు. 17 కంప్యూటర్లను ఫోన్ ట్యాపింగ్ కోసం వినియోగించినట్లు తెలిపారు. అంతే కాకుండా ట్యాపింగ్ కోసం 56 మంది ఎస్‌వోటీ సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ట్యాపింగ్ ఆపేయాలని ప్రభాకర్ రావు చెప్పారని ప్రణీత్ రావు అన్నారు.


ఫోన్లు,పెన్‌డ్రైవ్ లు బేగంపేట్ నాలాలో పడేశామని.. అందుకే పాత వాటిని ద్వంసం చేసి వాటి స్థానంలో కొత్త వాటిని అమర్చినట్లు వెల్లడించారు. ధ్వంసం చేసిన ఆధారాలను నాగోల్, ముసారాంబాగ్ వద్ద ఉన్న మూసీ పదిలో పడేసినట్లు తెలిపారు. ఫార్మెట్ చేసిన ఫోన్లు, పెన్‌డ్రైవ్ లు బేగంపేట్ నాలాలో పడేసినట్లు తెలిపారు.

Also Read: ఫోన్ ట్యాపింగ్ కేసు.. తీగలాగితే డొంక, జడ్జీలు, అడ్వకేట్ సహా..

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడైన అదనపు ఎస్పీ నాయని భుజంగరావు రాజకీయ నాయకుల ఫోన్లనే కాకుండా జడ్జీలు, జర్నలిస్టుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు  తెలిపారు. 2018 శాసన సభ ఎన్నికల ముందు ట్యాపింగ్ చేయడం ప్రారంభించామన్నారు.

Tags

Related News

Cyber Crimes: సైబర్ నేరాలు తీవ్ర సామాజిక సమస్య.. ఇది ఉద్యమంగా మారాలి: డీజీపీ శివధర్ రెడ్డి

Cold Wave Alert: తెలంగాణకు తీవ్ర చలి హెచ్చరిక.. సింగిల్ డిజిట్‌కు పడిపోనున్న ఉష్ణోగ్రతలు!

Poll Management: పోల్ మేనేజ్‌మెంట్‌పై పార్టీల ఫోకస్

Thati Venkateswarlu: బీఆర్ఎస్ లో అగ్గి రాజుకుందా ?

Hyderabad: హైదరాబాద్‌లో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. ముగ్గురు ఉగ్రవాదుల అరెస్ట్.. ఒకరు డాక్టర్

Maganti Gopinath: గోపినాథ్ మరణంపై సీబీఐ విచారణ కోరుతూ గోపినాథ్ బాధితుల డిమాండ్

Jubilee Hills Elections: ముగిసిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం.. బహిరంగ సభలు, ప్రసంగాలపై నిషేధం

Jubilee Hills Elections: మూడేళ్ల అభివృద్ధికి కాంగ్రెస్‌ను గెలిపించండి.. ఓటర్లకు మంత్రుల పిలుపు

Big Stories

×