E-Paper
Advertisement

Hotel: రూ.20కే మంచి భోజనం.. టేస్ట్ అదుర్స్.. ఎక్కడంటే…

Hotel: రూ.20కే మంచి భోజనం.. టేస్ట్ అదుర్స్.. ఎక్కడంటే…
Advertisement

Hotel: కాస్త మంచి టీ తాగాలంటే 20 రూపాయలు పెట్టాల్సిందే. అరడజను అరటిపండ్లు కొనాలన్నా 30 అవుతోంది. అలాంటిది కేవలం 20 రూపాయలకే కమ్మని ఇంటి భోజనం పెడుతుండటం మామూలు విషయం కాదు. ఈశ్వర్ ఛారిటీస్ సంస్థ ఆ పని చేస్తోంది. విజయవాడలో రూ.20కే మంచి భోజనం అందిస్తూ అందరి మన్ననలు పొందుతోంది.

ఇద్దరు దాతలు కలిసి ఈశ్వర్ ఛారిటీస్ ఏర్పాటు చేశారు. ఒక్కో ప్లేట్ భోజనం తయారు చేయాలంటే కనీసం రూ.60 ఖర్చు అవుతుండగా.. వాళ్లు మాత్రం 20కే వడ్డిస్తున్నారు. మిగిలిన 40 రూపాయలు వారే భరిస్తున్నారు. అలా అతితక్కువ ధరలో, రుచికరమైన ఆహారం అందిస్తూ ఎందరి ఆకలో తీరుస్తున్నారు. అందరితో శభాష్ అనిపించుకుంటున్నారు.

Advertisement

విజయవాడ శిఖామణి సెంటర్ లో సొంత భవనంలో ‘మన భోజనశాల’ పేరుతో నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు తెరిచి ఉంటుంది. కప్పునిండా అరకిలో పరిమాణంలో వేడివేడి అన్నం, రెండు కూరలు, రోటి పచ్చడి, సాంబారు, మజ్జిగ. ఇదీ మెనూ. పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు అదనంగా ఇస్తారు.

తక్కువ ధర అని ఆలోచించాల్సిన పని లేదు. నాణ్యమైన పదార్థాలనే వాడతారు. ఫ్రెష్ అండ్ క్వాలిటీ కూరగాయలతోనే వంట చేస్తారు. పాత్రలు శుభ్రంగా తళతళ మెరుస్తుంటాయి. సిబ్బంది సైతం హైజెనిక్ గా ఉంటారు. కేవలం సేవా భావం మాత్రమే కానీ, ఎక్కడా వ్యాపార ధోరణి కనిపించదు.

Advertisement

పేదలు, విద్యార్థులు, నిరుద్యోగులు, వివిధ పనులపై నగరానికి వచ్చే ప్రజలు, ఉద్యోగులు.. ఇలా అందరికీ అత్యంత తక్కువ ధరలో మంచి ఇంటి భోజనం అందిస్తున్న ఈశ్వర్ ఛారిటీస్ ను అభినందించాల్సిందే.

Tags

Related News

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

గుంటూరులో మంటగలిసిన మానవత్వం.. మహిళపై దాడి చేయించిన టీడీపీ నేత, పార్టీ నుంచి సస్పెండ్!

Big Stories

Advertisement
×