E-Paper
Advertisement

Warangal: కనువిందు చేయనున్న 40 ఫీట్ల మట్టి గణపతి, ఫస్ట్‌ టైం ఓరుగల్లులో..!

Warangal: కనువిందు చేయనున్న 40 ఫీట్ల మట్టి గణపతి, ఫస్ట్‌ టైం ఓరుగల్లులో..!
Advertisement

40 Feet Clay Ganapati To Be Inaugurated, First Time In Warangal: వరంగల్ ఎల్లం బజార్‌లోని భద్రకాళి హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మొదటిసారిగా గణపతి ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. వరంగల్ జిల్లాలో మొట్టమొదటిసారిగా మట్టితో చేసిన భారీ గణపతి విగ్రహ ప్రతిష్టాపన కావడం విశేషం.అంతేకాకుండా ఈ భారీ విగ్రహం వరంగల్‌ జిల్లాలోనే హైలైట్‌గా నిలవనుంది. తన సొంత ఖర్చుతో ఉత్సవాన్ని నిర్వహిస్తున్న ఉత్సవ నిర్వాకుడు ఆకుతోట సంజీవ్ ని భద్రకాళి ఆలయ ప్రధాన అర్చకులు శేషు అభినందించారు.

అంతేకాకుండా ఈ భారీ మట్టి గణపతి పూర్తిగా మట్టితో తయారుచేయడంతో అందరి చూపు ఆ విగ్రహంపైనే ఉంది. ఈ విగ్రహం ఏకంగా 40 ఫిట్ల పొడవుతో భారీ మట్టి గణపతిని ప్రతిష్టించనున్నారు. ఈ భారీ వినాయకుడు పర్యావరణ పరిరక్షణగా భావించి మట్టితో కలకత్తాకు చెందిన కళాకారులతో విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. అంతేకాదు ఈ విగ్రహాన్ని ఓరుగల్లులో ఏర్పాటు చేయడంతో హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ మహాగణపతి తరువాత ఇదే నిలవనుందని నిర్వాహకులు చెబుతున్నారు. అంతేకాదు వరంగల్‌లో ఏర్పాటు చేయనున్న ఈ మట్టి వినాయక విగ్రహ నిర్మాణంలో రాగడి మట్టి, గడ్డి మాత్రమే ఉపయోగించామని నిర్వాహకుడు ఆకుతోట సంజీవ్ తెలిపారు.

Advertisement

Also Read: వణికిస్తున్న వర్షాలు, తెలంగాణలో కురిసే ఛాన్స్

ఏదేమైనా ఈ గణపతి మాత్రం హైదరాబాద్ తరువాత వరంగల్ పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టేలా ఉండాలంటే ప్రతి ఏడాది ఇలాగే ప్రతిష్టించాలంటూ వరంగల్‌కు చెందిన పలువురు స్థానికులు విగ్రహ నిర్వాహకులను కోరుతున్నారు. ఇక ఈ గణపతి ప్రతిష్టాపన పూర్తి అయిన తరువాత దర్శనార్థం భక్తులను స్వామివారి దర్శనం కోసం అనుమతించనున్నట్టు విగ్రహ నిర్మాణ కమిటీ ఓ ప్రకటనలో తెలిపారు. ఇక ఈ మట్టి మహాగణపతిని ఎప్పుడు ఎప్పుడు చూస్తామో అంటూ భక్తులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరి వరంగల్‌లో మొట్టమొదటిసారిగా ప్రతిష్టించడంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి.

Related News

కొండా‌ సురేఖ ఆసక్తికర పోస్టు.. త్వరలో భారీ అప్‌డేట్, అసలు మేటరేంటి?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

Big Stories

Advertisement
×