E-Paper
Advertisement

Warangal: కనువిందు చేయనున్న 40 ఫీట్ల మట్టి గణపతి, ఫస్ట్‌ టైం ఓరుగల్లులో..!

Warangal: కనువిందు చేయనున్న 40 ఫీట్ల మట్టి గణపతి, ఫస్ట్‌ టైం ఓరుగల్లులో..!

40 Feet Clay Ganapati To Be Inaugurated, First Time In Warangal: వరంగల్ ఎల్లం బజార్‌లోని భద్రకాళి హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మొదటిసారిగా గణపతి ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. వరంగల్ జిల్లాలో మొట్టమొదటిసారిగా మట్టితో చేసిన భారీ గణపతి విగ్రహ ప్రతిష్టాపన కావడం విశేషం.అంతేకాకుండా ఈ భారీ విగ్రహం వరంగల్‌ జిల్లాలోనే హైలైట్‌గా నిలవనుంది. తన సొంత ఖర్చుతో ఉత్సవాన్ని నిర్వహిస్తున్న ఉత్సవ నిర్వాకుడు ఆకుతోట సంజీవ్ ని భద్రకాళి ఆలయ ప్రధాన అర్చకులు శేషు అభినందించారు.

అంతేకాకుండా ఈ భారీ మట్టి గణపతి పూర్తిగా మట్టితో తయారుచేయడంతో అందరి చూపు ఆ విగ్రహంపైనే ఉంది. ఈ విగ్రహం ఏకంగా 40 ఫిట్ల పొడవుతో భారీ మట్టి గణపతిని ప్రతిష్టించనున్నారు. ఈ భారీ వినాయకుడు పర్యావరణ పరిరక్షణగా భావించి మట్టితో కలకత్తాకు చెందిన కళాకారులతో విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. అంతేకాదు ఈ విగ్రహాన్ని ఓరుగల్లులో ఏర్పాటు చేయడంతో హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ మహాగణపతి తరువాత ఇదే నిలవనుందని నిర్వాహకులు చెబుతున్నారు. అంతేకాదు వరంగల్‌లో ఏర్పాటు చేయనున్న ఈ మట్టి వినాయక విగ్రహ నిర్మాణంలో రాగడి మట్టి, గడ్డి మాత్రమే ఉపయోగించామని నిర్వాహకుడు ఆకుతోట సంజీవ్ తెలిపారు.

Also Read: వణికిస్తున్న వర్షాలు, తెలంగాణలో కురిసే ఛాన్స్

ఏదేమైనా ఈ గణపతి మాత్రం హైదరాబాద్ తరువాత వరంగల్ పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టేలా ఉండాలంటే ప్రతి ఏడాది ఇలాగే ప్రతిష్టించాలంటూ వరంగల్‌కు చెందిన పలువురు స్థానికులు విగ్రహ నిర్వాహకులను కోరుతున్నారు. ఇక ఈ గణపతి ప్రతిష్టాపన పూర్తి అయిన తరువాత దర్శనార్థం భక్తులను స్వామివారి దర్శనం కోసం అనుమతించనున్నట్టు విగ్రహ నిర్మాణ కమిటీ ఓ ప్రకటనలో తెలిపారు. ఇక ఈ మట్టి మహాగణపతిని ఎప్పుడు ఎప్పుడు చూస్తామో అంటూ భక్తులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరి వరంగల్‌లో మొట్టమొదటిసారిగా ప్రతిష్టించడంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి.

Related News

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Big Stories

×