E-Paper
Advertisement

Formula E Race Scandal: కేటీఆర్‌కు మళ్లీ నోటీసు..! ఈసారి అరెస్ట్ ఖాయం?

Formula E Race Scandal: కేటీఆర్‌కు మళ్లీ నోటీసు..! ఈసారి అరెస్ట్ ఖాయం?
Advertisement

Formula E Race Scandal: ఫార్ములా ఈ రేసు కేసు వ్యవహారం ఎంత వరకు వచ్చింది? ఈ కేసులో ముగ్గురు నిందితుల ఇచ్చిన ఆధారాలేంటి? ఎవరి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది? ఎందుకు మళ్లీ నోటీసు ఇవ్వాలని ఏసీబీ భావిస్తోందా? ఈసారి కేటీఆర్‌కు నోటీసులిస్తే అరెస్టు ఖాయమా? అవుననే సంకేతాలు ప్రభుత్వ వర్గాల నుంచి బలంగా వినిపిస్తోంది.

హైదరాబాద్ ఫార్ములా ఈ రేసు కుంభకోణంలో మరో అంకం మొదలుకానుంది. నిందితులైన కేటీఆర్, ఐఏఎస్ అరవింద్ కుమార్, మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్‌రెడ్డి విచారించింది. వీరిచ్చిన సమాచారం ఆధారంగా ఏస్ నెక్ట్స్ జెన్ కంపెనీ డైరెక్టర్ అనిల్‌కుమార్‌ను శనివారం కేవలం మూడున్నర గంటల సేపు మాత్రమే విచారించింది. వారిచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా విశ్లేషణ చేస్తున్నారు ఏసీబీ అధికారులు.

Advertisement

నిందితులు ఇచ్చిన స్టేట్‌మెంట్ల పరిశీలిస్తున్న అధికారులకు కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముగ్గురు వేళ్లు కేటీఆర్ వైపు చూపిస్తున్నాయి. దీంతో మరోసారి కేటీఆర్, అరవింద్ కుమార్, బీఎల్ఎన్‌రెడ్డిలను విచారించాలని భావిస్తోంది. దీనికి సంబంధించి రేపో మాపో నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

రేసు నిర్వహణలో స్పాన్సర్‌గా వ్యవహరించిన ఏస్ నెక్ట్స్ జెన్ డైరెక్టర్ అనిల్ కుమార్ ఇచ్చిన స్టేట్‌మెంట్ల ఇప్పటికే పరిశీలించారు అధికారులు. ఆయన ఇచ్చిన ఆధారాలు, గతంలో లభించిన వివరాలతో మళ్లీ విచారించాలన్నది ఏసీబీ అధికారుల ఆలోచన. మంత్రిగా తాను ఆదేశాలు జారీ చేశానని, అయితే నిధుల చెల్లింపు వ్యవహారం పూర్తిగా అధికారుల వంతని పలుమార్లు కేటీఆర్ వెల్లడించిన విషయం తెల్సిందే.

Advertisement

ALSO READ: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు.. నిందితులు చిక్కడం ఖాయం, కొత్త చట్టమేంటి?

ఫార్ములా ఈ రేసు కేసు విచారణ కోసం గవర్నర్ నుంచి అనుమతి రావడానికి చాలా సమయం పట్టింది. అందుకు కారణాలు లేకపోలేదు. దీనిపై గవర్నర్.. కేంద్ర సొలిసిటర్ జనరల్ నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. ఆయన అన్నికోణాల్లో పరిశీలించిన తర్వాత ఉల్లంఘనలు జరిగినట్టు గుర్తించారు. ఆ తర్వాత ఆయన ఓకే చెప్పడంతో విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు గవర్నర్.

ఈ పరిణామాల నేపథ్యంలో గవర్నర్ విచారణకు పర్మిషన్ ఇవ్వడంతో వెంటనే ఈడీ రంగంలోకి దిగేసింది. ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధారంగా దర్యాప్తులో నిమగ్నమైంది. వివరాలు సైతం తీసుకుంది. ప్రస్తుతం నిందితులు ఇచ్చిన వివరాలను క్రోడీకరిస్తున్నారు. త్వరలో కొంతమందిని ఈడీ పిలిచే అవకాశమున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.

Related News

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

Big Stories

Advertisement
×