BigTV English

Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు.. నిందితులు చిక్కడం ఖాయం, కొత్త చట్టమేంటి?

Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు.. నిందితులు చిక్కడం ఖాయం, కొత్త చట్టమేంటి?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్‌ కేసుపై తెలంగాణ పోలీసులు సీరియస్‌గా దృష్టిపెట్టారు. అమెరికా ఉన్న నిందితులను ఎలాగైనా ఇండియాకు రప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా నిందితులు ఏదో ఒక రూపంలో తప్పించుకుంటు న్నారు. ఈ క్రమంలో సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించారు. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర హోంశాఖకు నివేదిక వెళ్లినట్టు సమాచారం.


తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది‌పైనే గడిచింది. తొలుత ఫోన్ ట్యాపింగ్ పై దృష్టి సారించారు పోలీసులు. ఈ క్రమంలో చాలామందిని అరెస్ట్ చేశారు. ఇప్పటికే పలువురు రిమాండ్‌లో ఉన్నారు. కేసు నమోదు తర్వాత అమెరికాకు వెళ్లిపోయారు కీలక నిందితులు ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావు. వారిని రప్పించేందుకు పోలీసులు చేయని ప్రయత్నాలు లేవు. ఎప్పటికప్పుడు తిప్పుకొడుతూ వస్తున్నారు నిందితులు.

పోలీసు వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. అమెరికాలో ఉన్న ఇద్దరు నిందితులు ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావులపై ఎక్స్‌ట్రడిషన్ అస్త్రాన్ని ప్రయోగించాలని నిర్ణయించుకున్నారట పోలీసులు. కరుడుగట్టిన నేరస్తులను అప్పగించే విషయంలో భారత్-అమెరికా మధ్య ఉన్న ఒప్పందాన్ని తెరపై తెచ్చారు.


ఈ క్రమంలో సీఐడీ ద్వారా కేంద్ర హోంశాఖకు నివేదిక సైతం ఇచ్చినట్టు తెలుస్తోంది. అక్కడి నుంచి విదేశాంగ శాఖ ద్వారా అమెరికాకు నివేదిక వెళ్లాల్సివుంది. అమెరికా ప్రభుత్వం దీన్ని పరిగణనలోకి తీసుకుంటే కచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులు భారత్ రావడం ఖాయమన్నమాట.

ALSO READ: వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి‌పై భూకబ్జా కేసు, ఎక్కడ? ఏం జరిగింది?

ఇద్దరు నిందితులపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేశారు తెలంగాణ పోలీసులు. విదేశీ వ్యవహారాల శాఖ ద్వారా ఇంటర్ పోల్‌కు సమాచారం పంపించారు. దీనిపై నిందితులు విదేశీ వ్యవహారాల శాఖలో అప్పీల్ చేశారు. ఓ వైపు ఈ తతంగం జరుగుతుండగా నేరస్తుల అప్పగింత ఒప్పందాన్ని తెరపైకి తెచ్చారు పోలీసులు.

నిందితులు ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావు‌లు అమెరికాలో అక్రమ వలసదారులుగా నివాసం ఉన్నారు. తమను రాజకీయ శరణార్ధిగా గుర్తించాలని మూడు నెలల కిందట ప్రభాకర్ రావు అమెరికా ప్రభుత్వానికి దరఖాస్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ అంశం అక్కడి ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది.

మంగళవారం నుంచి అమెరికాలో ట్రంప్ సర్కార్ అధికారంలోకి రానుంది. ఈ నేపథ్యంలో నిందితులు అప్పగింత సునాయాశమవుతుందని ఆలోచన చేస్తున్నారు పోలీసులు. ఈ వ్యవహారం వీలైనంత త్వరగా జరిగితే,  నిందితులు చిక్కడం ఖాయమని అంటున్నారు. వాళ్లు వస్తే.. తెరవెనుక సూత్రధారులు ఎవరన్నది తేలిపోనుంది. ఆపై కేసుకు ఓ ముగింపు రానుంది.

Related News

KTR: తెలంగాణ ప్రజలపై రూ.15వేల కోట్ల భారం.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ సంచలన ఆరోపణలు

Hyderabad Rains: హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. నార్శింగ్-హిమాయత్‌‌సాగర్ సర్వీస్ రోడ్డు క్లోజ్..

Weather News: మరో రెండు రోజుల భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన, బయటకు వెళ్తే అంతే సంగతులు

BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు.. ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ

Hyderabad Musi River: మూసీ నదికి పోటెత్తిన వరద.. మునిగిన హైదరాబాద్.. హై అలర్ట్!

BRS KTR: నన్ను ఇప్పుడంటే ఇప్పుడు అరెస్ట్ చేసుకోండి.. నేను దేనికైనా రెడీ: కేటీఆర్

ED raids Hyderabad: లగ్జరీ కార్ల స్మగ్లింగ్ కేసు.. బసరత్ ఖాన్ ఇంట్లో ఈడీ సోదాలు

TG Dasara Holidays: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. కాలేజీలకు దసరా సెలవులు, ఎప్పటినుంచంటే?

Big Stories

×