E-Paper
Advertisement

Accident in Hyderabad: ప్రాణం తీసిన మితిమీరిన వేగం.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

Accident in Hyderabad: ప్రాణం తీసిన మితిమీరిన వేగం..  రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
Advertisement

Accident in Hyderabad Students Died: హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో టిప్పర్‌ను కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామేన 4.30 గంటల సమయంలో జంక్షన్ వద్ద చోటుచేసుకుంది.

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం కారులో ఇరుక్కున్న వారిని బయటకు తీశారు. ఈ ప్రమాదం తెల్లవారు జామున 4.30 గంటల సమయంలో జరిగిందన్నారు. ఈ ప్రమాదానికి కారు మితిమీరిన వేగంతో నడపడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధారించారు.

Advertisement

వివరాల ప్రకారం.. ఈ ప్రమాదంలో గాయపడిన వాళ్లంతా ఇంజనీర్స్ అన్నారు. సిరి, గౌతమ్, సుదీప్ లకు గాయాలు కావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: రాఖీ పండుగ వేళ టీఎస్ఆర్టీసీ శుభవార్త

Advertisement

ఇదిలా ఉండగా, పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖని గంగానగర్ రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. వీరు మంచిర్యాల నుంచి గోదావరిఖనికి వెళ్తుండగా..లారీ ఢీకొట్టింది. ఇద్దరూ మంచిర్యాలలో ఓ షాపింగ్ లో పనిచేస్తున్నట్లు సమాచారం.

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×