E-Paper
Advertisement

Adilabad district News: గ్రామంలో ఉద్రిక్తత.. ప్రభుత్వ వాహనాళ్లపై రాళ్ల దాడి, ఏం జరిగింది?

Adilabad district News: గ్రామంలో ఉద్రిక్తత.. ప్రభుత్వ వాహనాళ్లపై రాళ్ల దాడి, ఏం జరిగింది?
Advertisement

Adilabad district News: కార్డెన్ సెర్చ్‌కు వెళ్లిన పోలీసులు, అటవీశాఖ సిబ్బందిపై గ్రామస్తుల తిరుగుబాటు చేశారు. అధికారుల వాహనాలపై రాళ్లతో దాడి చేశారు. పరిస్థితి గమనించిన అధికారులు ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోయారు. అసలేం జరిగింది? ఈ ఘటన జరిగింది ఎక్కడ? అనే లోతుల్లోకి ఒక్కసారి వెళ్దాం.

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేశవపట్నం గ్రామం ఈ ఘటనకు వేదికైంది. కార్డెన్ సెర్చ్ నిర్వహించేందుకు అధికారులు అక్కడికి వెళ్లారు. ఇళ్లల్లో లభించిన కలప, ఫర్నీచర్ స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. దీన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. అక్కడితో ఆగలేదు.. కోపంతో రెచ్చిపోయిన గ్రామస్తులు అటవీ శాఖ అధికారుల వాహనాలపై దాడికి దిగారు.

Advertisement

పరిస్థితి గమనించిన అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మొదట గ్రామంలో భారీగా కలప నిల్వలు ఉన్నాయంటూ అధికారులకు సమాచారం వెళ్లింది. అడవిలో లభించిన ఖరీదైన కలపతో రకరకాల ఫర్నిచర్ తయారు చేస్తున్నారు. ఈ విషయం తెలియగానే సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.

ఈ క్రమంలో బీట్ ఆఫీసర్ జాదవ్‌పై దాడి చేశారు కేశవపట్నం గ్రామస్తులు. ఈ విషయం తెలియగానే ఆ గ్రామానికి పోలీసులు, అటవీశాఖ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. గ్రామస్తులంతా ఏకమై పోలీసులు, ఫారెస్ట్ సిబ్బంది, వాహనాలపై దాడికి దిగారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. పరిస్థితి గమనించిన అధికారులు గ్రామం నుంచి వెళ్లిపోయారు. కలప వ్యవహారంలో గ్రామస్తులకు-ఫారెస్ట్ అధికారుల మధ్య వివాదం నలుగుతున్న విషయం తెల్సిందే.

Advertisement

ALSO READ: హైడ్రా యాక్షన్ షురూ.. 8 అంతస్తుల బిల్డింగ్ ఫసక్

 

Related News

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

Big Stories

Advertisement
×