E-Paper
Advertisement

Adilabad district News: గ్రామంలో ఉద్రిక్తత.. ప్రభుత్వ వాహనాళ్లపై రాళ్ల దాడి, ఏం జరిగింది?

Adilabad district News: గ్రామంలో ఉద్రిక్తత.. ప్రభుత్వ వాహనాళ్లపై రాళ్ల దాడి, ఏం జరిగింది?
Advertisement

Adilabad district News: కార్డెన్ సెర్చ్‌కు వెళ్లిన పోలీసులు, అటవీశాఖ సిబ్బందిపై గ్రామస్తుల తిరుగుబాటు చేశారు. అధికారుల వాహనాలపై రాళ్లతో దాడి చేశారు. పరిస్థితి గమనించిన అధికారులు ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోయారు. అసలేం జరిగింది? ఈ ఘటన జరిగింది ఎక్కడ? అనే లోతుల్లోకి ఒక్కసారి వెళ్దాం.

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేశవపట్నం గ్రామం ఈ ఘటనకు వేదికైంది. కార్డెన్ సెర్చ్ నిర్వహించేందుకు అధికారులు అక్కడికి వెళ్లారు. ఇళ్లల్లో లభించిన కలప, ఫర్నీచర్ స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. దీన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. అక్కడితో ఆగలేదు.. కోపంతో రెచ్చిపోయిన గ్రామస్తులు అటవీ శాఖ అధికారుల వాహనాలపై దాడికి దిగారు.

Advertisement

పరిస్థితి గమనించిన అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మొదట గ్రామంలో భారీగా కలప నిల్వలు ఉన్నాయంటూ అధికారులకు సమాచారం వెళ్లింది. అడవిలో లభించిన ఖరీదైన కలపతో రకరకాల ఫర్నిచర్ తయారు చేస్తున్నారు. ఈ విషయం తెలియగానే సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.

ఈ క్రమంలో బీట్ ఆఫీసర్ జాదవ్‌పై దాడి చేశారు కేశవపట్నం గ్రామస్తులు. ఈ విషయం తెలియగానే ఆ గ్రామానికి పోలీసులు, అటవీశాఖ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. గ్రామస్తులంతా ఏకమై పోలీసులు, ఫారెస్ట్ సిబ్బంది, వాహనాలపై దాడికి దిగారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. పరిస్థితి గమనించిన అధికారులు గ్రామం నుంచి వెళ్లిపోయారు. కలప వ్యవహారంలో గ్రామస్తులకు-ఫారెస్ట్ అధికారుల మధ్య వివాదం నలుగుతున్న విషయం తెల్సిందే.

Advertisement

ALSO READ: హైడ్రా యాక్షన్ షురూ.. 8 అంతస్తుల బిల్డింగ్ ఫసక్

 

Related News

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆపై ప్రభుత్వం ప్రకటన

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

Big Stories

Advertisement
×