BigTV English
Advertisement

Airport Bus Fare: ఎయిర్ పోర్ట్ బస్సు ఛార్జీలు తగ్గింపు, కానీ చిన్న ట్విస్ట్!

Airport Bus Fare: ఎయిర్ పోర్ట్ బస్సు ఛార్జీలు తగ్గింపు, కానీ చిన్న ట్విస్ట్!

Airport Bus Fare: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి రాత్రివేళ ప్రయాణం చేసే వారు ఇకపై ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, అంటే మన TGSRTC, విమానాశ్రయం నుంచి నడిచే పుష్పక్ బస్సుల ఛార్జీలను తగ్గించింది. అయితే ఈ తగ్గింపు అన్ని సమయాల్లో కాదు… కేవలం రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకే అమలులో ఉంటుంది.


ఈ నిర్ణయం ముఖ్యంగా లేట్ నైట్‌లో విమాన ప్రయాణం ముగించుకుని బయటికొచ్చే ప్రయాణికుల కోసం తీసుకుంది. ఎందుకంటే… ఆ సమయాల్లో అందుబాటులో ఉండే టాక్సీలు ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తుంటాయి. ప్రైవేట్ ట్రావెల్స్ అయినా, క్యాబ్ సేవలైనా… అధిక ధరలు వసూలు చేస్తుంటాయి. దీంతో చాలామంది మధ్య తరగతి ప్రయాణికులకు నిత్యం ప్రయాణం చేయడం భారం అయ్యింది.

ఇలాంటి పరిస్థితుల్లో పుష్పక్ బస్సుల ఛార్జీల తగ్గింపు నిజంగా ఊరటనిచ్చే అంశంగా మారింది. విమానాశ్రయం నుంచి హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలకు వెళ్లే ఈ బస్సులు, ఇకపై మరింత చౌకగా అందుబాటులోకి రానున్నాయి.


ప్రస్తుత ఛార్జీల వివరాలు

* కొన్ని రూట్లలో ఛార్జీలు ఏకంగా 50 శాతం వరకు తగ్గాయి. ఉదాహరణకు…

* శంషాబాద్ రూట్‌లో పుష్పక్ బస్సు టికెట్ రేటు గతంలో రూ.200 ఉండేది. ఇప్పుడు అదే రూట్ కేవలం రూ.100కు చేరుకుంది.

* అదే విధంగా పహాడీషరీఫ్ రూట్ కూడా రూ.200 నుంచి రూ.100కు తగ్గించబడింది.

* అరంఘర్, బాలాపూర్ రూట్లకు ఇప్పటికే రూ.250 ఛార్జీ తీస్తుండగా, ఇప్పుడు ఆ ఛార్జీలు రూ.200కు తగ్గించబడ్డాయి.

* మెహిదీపట్నం, ఎల్బీనగర్ వంటి మధ్య దూర ప్రాంతాలకు గతంలో రూ.350 ఉండే ఛార్జీలు ఇప్పుడు రూ.300కు తగ్గాయి.

జూబ్లీ బస్‌స్టేషన్, మియాపూర్, లింగంపల్లి లాంటి లాంగ్ రూట్స్‌కి పుష్పక్ ఛార్జీలు రూ.450 నుంచి రూ.400కు తగ్గించడం జరిగింది.

ఈ తగ్గింపులు  ప్రస్తుత ఖర్చుల కాలంలో ఇది చాలా కొద్దిగా అయినా ఉపశమనమే. ముఖ్యంగా రెగ్యులర్‌గా విమాన ప్రయాణాలు చేసే ఉద్యోగులు, విద్యార్థులు, బిజినెస్ ట్రావెలర్లు ఈ మార్పుతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

పుష్పక్ బస్సుల గురించి వివరాలు

పుష్పక్ బస్సులు అంటే మనకు తెలిసినవే… లగ్జరీ వాహనాలు. ఏసీ ఉన్న ఈ బస్సులు, హైడ్రాలిక్ డోర్లు, సురక్షిత డ్రైవింగ్‌కి అనుకూలంగా రూపొందించబడ్డాయి. ప్రయాణికుల కంఫర్ట్‌ను దృష్టిలో పెట్టుకుని వీటిని డిజైన్ చేశారు. పైగా రాత్రివేళ నగరానికి సురక్షితంగా చేరడానికి ఇది మంచి మార్గంగా మారింది.

ఎయిర్‌పోర్ట్ నుంచి నగరంలోని ప్రధాన ప్రాంతాలైన జూబ్లీ బస్‌స్టేషన్, ఎల్బీనగర్, మియాపూర్, లింగంపల్లి, మెహిదీపట్నం, బాలాపూర్, పహాడీషరీఫ్ వంటి ప్రాంతాలకు డైరెక్ట్ క‌నెక్టివిటీతో ఈ బస్సులు నడుస్తుంటాయి. రాత్రి సమయంలో క్యాబ్ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా, సీటు గ్యారంటీతో ముందుగానే ఈ బస్సుల్లో ప్రయాణించవచ్చు.

బహుశా రాత్రి సమయంలో విమానాశ్రయం నుంచి బయల్దేరే వారు ఇప్పటివరకు ఎదుర్కొంటున్న అసౌకర్యాలు చాలానే ఉన్నాయి. క్యాబ్ దొరకకపోవడం, లేదా దొరికినా అధిక ధరలు చెల్లించాల్సి రావడం వంటి సమస్యలు ఈ కొత్త నిర్ణయం తర్వాత కాస్త తగ్గే అవకాశం ఉంది. టీఎస్‌ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రయాణికులకు మానసికంగా, ఆర్థికంగా రెండూ ఉపశమనం కలుగుతుంది.

మొత్తానికి రాత్రి సమయంలో ప్రయాణించదలచిన వారికీ, ముఖ్యంగా విమానాశ్రయం నుంచి నగరానికి వెళ్లే వాళ్లకు ఇది ఒక మంచి అవకాశం. సురక్షితంగా, కంఫర్ట్‌తో కూడిన ప్రయాణం… ఇకపై పుష్పక్ బస్సులతో సాధ్యమే. కొత్త ఛార్జీలు అమల్లోకి వచ్చిన తర్వాత మరింత మంది ప్రజలు ఈ సేవను వినియోగించుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

Related News

Say No to Drug: ‘సే నో టు డ్రగ్స్’ పేరుతో రాష్ట్రంలో క్రికెట్ టోర్నమెంట్.. ప్రైజ్ మనీ అక్షరాల రూ.80 లక్షలు

Kalvakuntla Kavitha: కవిత టార్గెట్.. కారు పార్టీ.. టచ్‌లో ఆ నేతలు?

Jubilee Hills: ఢిల్లీ నుంచి గల్లీ వరకు కాంగ్రెస్ మాత్రమే లౌకిక పార్టీ: ఉత్తమ్ కుమార్ రెడ్డి

Jubilee Hills By-election: ఈ నెల 11 లోపు కేసీఆర్, హరీష్ రావులను సీబీఐ అరెస్ట్ చేయాలి.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Jubilee Hills Bypoll: కాంగ్రెస్ మైలేజ్ తగ్గిందా? ప్రచారంపై అధిష్టానం నిఘా

Hyderabad: గన్‌తో బెదిరింపులు.. మాజీ డిప్యూటీ సీఎం వర్సెస్ మాజీ ఎమ్మెల్యే.. అసలేంటి ఈ గొడవ

Jubilee Hills by-election: ఫాం హౌస్ నుండే బయటకు వస్తలేడు, మళ్లీ అధికారంలోకి ఎలా వస్తాడు?.. కేసీఆర్‌పై కోమటిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు

Fee Reimbursement: ఫీజు రియింబర్స్‌మెంట్ విధానంపై రేవంత్ సర్కాట్ కమిటీ ఏర్పాటు

Big Stories

×