BigTV English

Loan Waiver: మాఫీ కాలే.. ఇదుగో రుజువు.. ఆ ఊరిలో ఒక్కరికైనా మాఫీ కాలేదు: కేటీఆర్

Loan Waiver: మాఫీ కాలే.. ఇదుగో రుజువు.. ఆ ఊరిలో ఒక్కరికైనా మాఫీ కాలేదు: కేటీఆర్

– రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ సర్కారు దగా
– పెంటవెల్లిలో 499 మందిలో ఒక్కరికీ మాఫీ కాలే
– నాలుగో వంతు మందికీ న్యాయం జరగలే
– ఇకనైనా ప్రభుత్వం నిజం ఒప్పుకోవాలి
– బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్


KTR: స్వతంత్ర భారతదేశంలోనే రైతు రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ అతి పెద్ద మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రజలకు మాయమాటలు చెప్పి రైతులను నిండా ముంచారని కేటీఆర్ మండిపడ్డారు. ఇందుకు ఉదాహరణే నాగర్ కర్నూల్ జిల్లా పెంటవెల్లి గ్రామమని ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.

ఒక్కరికీ మాఫీ కాలే..
పెంటవెల్లిలో 499మంది రైతులు ఉండగా.. ఏ ఒక్కరికీ రుణమాఫీ కాకపోవటం దారుణమంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే కేటీఆర్ ట్విటర్‌లో నిప్పులు చెరిగారు. రుణమాఫీ పూర్తిచేశామని గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రివి బూటకపు మాటలని చెప్పడానికి ఈ గ్రామమే సజీవ సాక్ష్యమని చెప్పుకొచ్చారు. అంత మంది రైతులు ఉన్న పెంటవెల్లిలో ఒక్కరంటే ఒక్కరికీ మాఫీ కాకపోవడం పచ్చి మోసం కాక మరేమిటంటూ ప్రశ్నలు సంధించారు. గత డిసెంబర్ నుంచి ఈ ఏడాది ఆగస్టు 15 దాకా డెడ్ లైన్లు పెట్టుకుంటూ వచ్చిన సీఎం ఈ గ్రామ రైతులకు ఎందుకు మాఫీ కాలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.


Also Read: TGSRTC: ఆర్టీసీని నిలబెడతాం.. సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి

ఇంతమోసమా?
తెలంగాణలోని రైతాంగంలో నాలుగో వంతు మందికి కూడా రుణమాఫీ చేయకుండా వందశాతం అయిపోయినట్టు సీఎం ఫోజులు కొడుతున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే పెంట్లవెల్లి రైతులకు రుణమాఫీ చేసి నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. ఈ మేరకు పెంటవెల్లి గ్రామ రైతులు రుణమాఫీ కాలేదంటూ నిరసన తెలుపుతున్న వార్తాపత్రిక క్లిప్‌ను ట్వీట్‌కు కేటీఆర్ జతచేశారు.

Related News

Innovation Hub: ఈ రెండు జిల్లాలకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఇంక్యూబేషన్ కేంద్రాల ఏర్పాటు: శ్రీధర్ బాబు

Vemulawada Temple: రాజన్న దర్శనాల్లో తాత్కాలిక మార్పులు.. రేపటి నుంచి భీమేశ్వరాలయంలో దర్శనాలు

Janagam District: రియల్లీ గ్రేట్.. ఆటోలోనే పురుడు పోసిన ఆశా వర్కర్లు.. జనగాం జిల్లాలో ఘటన

Konda Surekha vs Ponguleti: ఢిల్లీకి చేరిన పంచాయితీ.. పొంగులేటిపై సోనియాకు కొండా కంప్లైంట్

BC Reservations: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. BC రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయం

Karimnagar BJP: కరీంనగర్ జిల్లా బీజేపీలో.. బయటపడ్డ విభేదాలు..

Theft at Brilliant college: బ్రిలియంట్ కాలేజీ చోరీ కేసులో వెలుగులోకి సంచలనాలు..

Padi Kaushik Reddy: అమ్మతోడు వెయ్యి మందితో దాడి చేస్తా.. సొంత పార్టీ నేతలకు పాడి కౌశిక్ రెడ్డి వార్నింగ్

Big Stories

×